Rohit Sharma: హార్దిక్ను అనాలని కాదు.. అది రోహిత్పై అభిమానం: గిల్క్రిస్ట్
హార్దిక్ పాండ్య విషయంలో అభిమానుల తీరుపై ఆసీస్ మాజీ ఆటగాడు ఆడమ్ గిల్క్రిస్ట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్లో ముంబయి (Mumbai) మూడు మ్యాచ్లు ఆడింది. ఒక్క విజయాన్ని నమోదు చేయలేదు. పాయింట్ల పట్టికలో ఖాతా తెరవని ఏకైక జట్టు కూడా ముంబయి కావడం గమనార్హం. ఆ జట్టు సారథ్య బాధ్యతలను తీసుకున్న హార్దిక్ పాండ్యపై (Hardik Pandya) సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. ఇప్పుడు మ్యాచ్ల సమయంలోనూ అభిమానులు అతడిని హేళన చేసేలా నినాదాలు చేస్తూ ప్రవర్తించడం మాజీ క్రికెటర్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దీంతో రోహిత్ శర్మ (Rohit Sharma) అలా చేయొద్దని అభిమానులకు సూచించాల్సిన పరిస్థితి ఎదురైంది. అయితే, తమ జట్టును ఐదుసార్లు ఛాంపియన్గా నిలిపిన రోహిత్ శర్మపై అభిమానం వల్లే పాండ్య ట్రోలింగ్కు గురి కావాల్సి వచ్చిందని మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్క్రిస్ట్ వ్యాఖ్యానించాడు. హార్దిక్కు కెప్టెన్ బాధ్యతలు అప్పగించడం రహస్యంగా జరిగినట్లు ఫ్యాన్స్ భావించడమూ మరో కారణంగా పేర్కొన్నాడు.
‘‘ఈ మ్యాచ్ల సందర్భంగా రోహిత్ శర్మ స్థాయి ఏంటనేది తెలుస్తోంది. కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్ను తప్పించి.. గుజరాత్ నుంచి తీసుకొచ్చి మరీ హార్దిక్కు జట్టు పగ్గాలు అప్పగించడం మిస్టరీగా జరిగిపోయింది. అత్యంత కఠినమైన నిర్ణయం. ఐపీఎల్లో ఇలాంటివి సహజమే. ఫ్యాన్బేస్ కూడా తీవ్ర స్థాయిలో ఉంటుంది. ఒకే స్థాయి కలిగిన దానికి కచ్చితమైన ప్రతిరూపం ఎంపిక చేయడం చాలా కష్టం. ఇప్పుడు ముంబయి జట్టులో పరిస్థితి కూడా ఇలానే ఉంది. గతంలో నాకూ ఇలాంటి అనుభవమే ఎదురైంది.
ఆసీస్ తరఫున వన్డే అరంగేట్రం చేసినప్పుడు క్రికెట్ దిగ్గజం ఇయాన్ హీలే స్థానంలో నేను వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టా. నా సొంత దేశంలోనూ అభిమానుల నుంచి వ్యతిరేకత ఎదురైంది. నేను మైదానంలోకి దిగినప్పుడు ఎగతాళి చేస్తున్నట్లు కొందరు అభిమానులు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు హార్దిక్ ఎలా ఫీల్ అవుతున్నాడో.. నాకు తెలుసు. తప్పకుండా పాండ్యను కలుసుకుంటా. అభిమానుల మనసు ఎలా గెలుచుకోవాలో చెబుతా. ఈ సమస్య నుంచి బయటపడేందుకు అవకాశం ఉంది’’ అని గిల్క్రిస్ట్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నంబర్ 6 ర్యాంకర్కు నో ప్లేస్.. ఆ బాధను తట్టుకోవడం కష్టమే: ఇర్ఫాన్ పఠాన్
ప్రపంచ కప్ కోసం జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్లు కాస్త గుర్రుగానే ఉన్నారు. సెలక్షన్ కమిటీ కొందరిపట్ల అభిమానం చూపిస్తుందని విమర్శలు గుప్పించారు. -
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
పంజాబ్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. -
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
మ్యాచ్ జరుగుతున్నప్పుడు పెద్దగా ఆందోళన పడని రుతురాజ్ టాస్ సమయంలో మాత్రం ఒత్తిడికి గురయ్యాడట. ఇదే విషయాన్ని స్వయంగా చెన్నై కెప్టెన్ వెల్లడించాడు. -
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
ఐపీఎల్లో ఇప్పటికే ఎన్నో మెరుపు ఇన్నింగ్స్లు ఆడిన గ్లెన్ మ్యాక్స్వెల్ (Glenn Maxwell) ఈసారి కూడా అలాగే అలరిస్తాడని ఫ్యాన్స్ ఆశించారు. కానీ మ్యాక్సీ పేలవ ఫామ్తో లీగ్ మధ్యలో తనకు తానుగా బ్రేక్ తీసుకుని షాక్ ఇచ్చాడు. -
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
T20 World Cup: టీ20 ప్రపంచకప్ కోసం భారత ఆటగాళ్లకు అమితాబ్ బచ్చన్ సందేశమిచ్చారు. తన కొత్త సినిమా ‘కల్కి’లోని అశ్వత్థామ అవతారంలో క్రికెటర్లలో ప్రేరణ నింపారు. -
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
MS Dhoni: బుధవారం పంజాబ్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై ఓడిపోయింది. అయితే, ధోనీ మాత్రం ఇప్పటి వరకు తన పేరిట ఉన్న ఓ రికార్డును ఈ మ్యాచ్తో మరింత పదిలం చేసుకున్నాడు. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నంబర్ 6 ర్యాంకర్కు నో ప్లేస్.. ఆ బాధను తట్టుకోవడం కష్టమే: ఇర్ఫాన్ పఠాన్
-
దిల్లీ ఎల్జీ కీలక నిర్ణయం.. మహిళా కమిషన్లో 223 మంది తొలగింపు
-
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
-
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
-
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి