Arjun Tendulkar: అర్జున్పై విమర్శలు.. వారంతా కీబోర్డు యోధులు: బ్రెట్ లీ
ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) గెలిచినా.. ఓడినా సచిన్ కుమారుడు అర్జున్ తెందూల్కర్ ప్రదర్శనపైనే చర్చంతా సాగుతుండటం విశేషం. కేవలం నాలుగు మ్యాచ్లను మాత్రమే ఆడిన అర్జున్ విమర్శలు మాత్రం భారీగానే ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో ఆసీస్ దిగ్గజ పేసర్ బ్రెట్ లీ మద్దతుగా నిలిచాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్లో అరంగేట్రం చేసినప్పటి నుంచి ప్రతి ఒక్కరూ అర్జున్ తెందూల్కర్పై (Arjun Tendulkar) దృష్టిసారించారు. ప్రతి మ్యాచ్లో ఎలా ఆడుతున్నాడనే దానిపై బేరీజు వేసుకుంటూ సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. ముంబయి ఆడే ప్రతి మ్యాచ్లోనూ ప్రత్యేక ఆకర్షణ అర్జున్ తెందూల్కరే. తొలి మ్యాచ్లో (కోల్కతాపై) కాస్త ఫర్వాలేదనిపించిన అర్జున్.. పంజాబ్తో జరిగిన మ్యాచ్లో మాత్రం మూడు ఓవర్లలోనే 48 పరుగులు సమర్పించాడు. దీంతో అతడిపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చెలరేగాయి. అయితే, తాజాగా గుజరాత్తో జరిగిన మ్యాచ్లో (GT vs MI) రెండు ఓవర్లలో అర్జున్ ఒక వికెట్ తీసి కేవలం 9 పరుగులను మాత్రమే ఇచ్చి విమర్శకులకు సమాధానమిచ్చాడు. ఈ క్రమంలోనే అర్జున్పై విమర్శలు గుప్పించినవారిపై ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఇలాంటి విమర్శలను తాను కూడా అనుభవించినట్లు గుర్తు చేశాడు.
‘‘బయట నుంచి ఎవరో ఒకరు ప్రతిసారి విమర్శలు చేస్తూనే ఉంటారు. సీనియర్ బౌలర్ అయిన సందీప్ శర్మ 120 కి.మీ వేగంతో బంతులను సంధిస్తాడు. అర్జున్ అంతకంటే ఎక్కువ వేగంతో విసురుతాడు. అతడికి ఇంకా 23 ఏళ్లే. అర్జున్కు ఇంకా చాలా కెరీర్ ఉంది. అందుకే, అతడికి నేనిచ్చే సలహా ఒక్కటే.. ఇలాంటి విమర్శలను ఎప్పుడూ వినొద్దు. అర్జున్లో అద్భుతమై నైపుణ్యాలు ఉన్నాయి. నిలకడగా 140 కి.మీ వేగంతో వేస్తున్నాడు. తప్పకుండా ముంబయి జట్టుకు అద్భుత ప్రదర్శన ఇవ్వగలడు. భారీ సంఖ్యలో హాజరయ్యే అభిమానుల మధ్య ఆడేందుకు ఇంకాస్త సమయం పడుతుంది. అతడి పేస్ కూడా పెరుగుతుంది. ఇప్పటి వరకు అర్జున్ పేస్లో ఎలాంటి సమస్యలను చూడలేదు. ఎలా బౌలింగ్ వేయాలని అనుకుంటున్నాడో అలా చేయాలి. అంతేకానీ, బయట నుంచి విమర్శలు చేసేవారిని పట్టించుకోకూడదు. వీరంతా తమ జీవితంలో ఒక్కబంతినైనా వేసి ఉండరు. వాళ్లంతా కీబోర్డు వారియర్లు’’ అని బ్రెట్ లీ వ్యాఖ్యానించాడు.
గుజరాత్తో జరిగిన మ్యాచ్లో ముంబయి 55 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ముంబయి బౌలర్లలో అర్జున్ (2-0-9-1) మినహా మిగతావారంతా భారీగానే పరుగులు సమర్పించారు. కామెరూన్ గ్రీన్ అయితే కేవలం రెండు ఓవర్లు మాత్రమే వేసి 39 రన్స్ ఇచ్చాడు. అర్జున్ ఉత్తమ బౌలింగ్ వేసినా కెప్టెన్ రోహిత్ మాత్రం కేవలం రెండు ఓవర్లను మాత్రమే ఇచ్చాడు. దీంతో గుజరాత్ 207/6 భారీ స్కోరు చేసింది. అనంతరం టాప్ ఆర్డర్ విఫలం కావడంతో ముంబయి 152/9 స్కోరుకే పరిమితమైంది. నేహాల్ వధేరా (40) టాప్ స్కోరర్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
గాయం కారణంగా టీమ్కు దూరమైన స్టార్ పేసర్ షమీ.. తిరిగి జట్టులోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. -
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!