Australia Team: ఆడుతోంది ఆస్ట్రేలియానేనా!
ఐదుసార్లు ప్రపంచ వరల్డ్ కప్ ఛాంపియన్గా నిలిచిన ఆస్ట్రేలియా (Australia Team) జట్టు ఈసారి మాత్రం పేలవ ఆటతీరును ప్రదర్శిస్తోంది. ఇప్పటి వరకు ఆడిన రెండింట్లోనూ ఓటమిపాలైంది.
గత ఎనిమిది వన్డేల్లో ఒకే ఒక్క విజయం! అందులోనూ దక్షిణాఫ్రికా చేతిలో నాలుగు పరాభవాలు! ప్రపంచకప్లో (ODI World Cup 2023) ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ ఓటమి! ఇది మాజీ ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియా (Australia Team) ఆట. ఒకప్పుడు భీకరంగా చెలరేగి మిగిలిన జట్లను చివురుటాకులా వణించిన ఆస్ట్రేలియానేనా ఇలా ఆడేది అనే అనుమానం కలుగుతోంది. మరి ఆసీస్కు ఏమైంది:! ప్రపంచకప్లో ఫేవరెట్ జట్లలో ఒకటిగా బరిలో దిగిన ఈ అయిదుసార్లు ఛాంపియన్.. ఆరంభంలోనే ఇలా వెనుకబడడం అభిమానులకు మింగుడుపడట్లేదు.
ఇంత చెత్త ఫీల్డింగా!
క్యాచ్లు ఎలా పట్టాలో.. ఎలా ఫీల్డింగ్ చేయాలో ఆస్ట్రేలియాను చూసి నేర్చుకోవాలి అన్నట్లు ఉండేది ఆ జట్టు ఫీల్డింగ్. కానీ, అలాంటిది ప్రపంచకప్లో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో ఏకంగా అయిదు సులభమైన క్యాచ్లను ఆ జట్టు జారవిడిచిన తీరు అభిమానులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. భారత్తో తొలి మ్యాచ్లోనూ ఆసీస్ ఫీల్డింగ్ గొప్పగా ఏం లేదు. భారత్ ఛేదనలో 2 పరుగులకే 3 వికెట్లు పడగొట్టి విశ్వరూపం చూపించినట్లు కనిపించిన ఆ జట్టు.. కీలక సమయంలో కోహ్లి క్యాచ్ వదిలేసి మూల్యం చెల్లించుకుంది. ఏకంగా మ్యాచ్నే కోల్పోయింది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్లోనూ ఇదే వరుస. తేలికైన క్యాచ్లు నేలపాలయ్యాయి. చేతిలో పడిన క్యాచ్లను కూడా కంగారూ ఫీల్డర్లు విడిచిపెట్టారు. టాప్ ఫీల్డింగ్ జట్టు నుంచి ఇలాంటి ప్రదర్శన అనూహ్యమే. ప్రపంచకప్ మాత్రమే కాదు ఇటీవల జరిగిన దక్షిణాఫ్రికా, భారత్తో సిరీస్లలోనూ ఆసీస్ ఫీల్డర్లు ఆకట్టుకోలేకపోయారు. కంగారూలు గ్రౌండ్ ఫీల్డింగ్లో ఇంత పేలవంగా ఉండడం ఇదే తొలిసారి. ఫీల్డింగ్లో ఒకప్పటి సమన్వయం కూడా లేదు. భారత్తో పోరులో కోహ్లి ఇచ్చిన క్యాచ్ను మార్ష్, వికెట్కీపర్ కేరీ కలిసి నేలపాలు చేశారు.
ఓటమి నంబర్ 4
గత ప్రపంచకప్లో కలిపి వరుసగా నాలుగు మ్యాచ్లు ఓడడం ఆసీస్కు ఇదే తొలిసారి. 2019 ప్రపంచకప్లో ఇదే దక్షిణాఫ్రికా చేతిలో లీగ్ దశలో ఓడిన కంగారూ జట్టు.. సెమీఫైనల్లో బలమైన ఇంగ్లాండ్ చేతిలో మట్టి కరిచి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈసారి ఎలాగైనా ఆరోసారి కప్ పట్టాలన్న ఆశయంతో ప్రపంచకప్ బరిలో దిగిన ఆసీస్.. తొలి రెండు మ్యాచ్ల్లో బలమైన జట్ల చేతిలో ఓడి సెమీస్ అవకాశాలను తనకు తానే దెబ్బ తీసుకుంది. మ్యాచ్లో చిన్న అవకాశం దొరికితే చాలు ఉడుంపట్టు పట్టి గెలిచేదాకా వదలకపోవడం ఆసీస్ స్టైల్. అలాంటిది 2 పరుగులకే 3 వికెట్లు తీసి కూడా భారత్ చేతిలో ఓడిపోవడం ఆ జట్టును మానసికంగా దెబ్బ తీసింది. రెండో మ్యాచ్లో ఇంకా దారుణంగా 134 పరుగుల తేడాతో సఫారీల చేతిలో చిత్తు కావడంతో ఆ జట్టుకు దెబ్బ మీద దెబ్బ తగిలింది. ప్రపంచకప్లో ఆసీస్కు ఇదే అతి పెద్ద ఓటమి. ఈ ఏడాది మార్చి నుంచి 4 సందర్భాల్లో 70 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది ఆ జట్టు. 1992 ప్రపంచకప్ తర్వాత టోర్నీ తొలి మ్యాచ్ ఓడడం కూడా కంగారూలకు ఇదే తొలిసారి. అన్నింటికంటే దారుణం ఏమిటంటే 10 జట్లు పోటీపడుతున్న టోర్నీలో 2 మ్యాచ్లు ఆడిన ఆసీస్ నెదర్లాండ్స్ కన్నా ఆఖరిగా 9వ స్థానంలో ఉండడం!
పుంజుకోకుంటే కష్టమే
రెండు మ్యాచ్లు ఓడిపోయినంత మాత్రాన ఆ జట్టు పనైపోయింది అనలేం. కానీ ఈ ఆటతీరు మార్చుకోకపోతే కష్టం. ఆసీస్ చేతిలో ఇంకా 7 మ్యాచ్లు ఉన్నాయి. మరో మ్యాచ్ ఓడితే ఆ జట్టుకు సెమీఫైనల్ మార్గం మరింత క్లిష్టమవుతుంది. చిన్న జట్లే కదా అని అఫ్గానిస్థాన్, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్లను తేలిగ్గా తీసుకుంటే మొదటికే మోసం వస్తుంది. పాకిస్థాన్, శ్రీలంక, న్యూజిలాండ్, ఇంగ్లాండ్తో ఆసీస్కు పెద్ద ముప్పు పొంచి ఉంది. ముఖ్యంగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్లను ఓడించడం కంగారూలకు పెద్ద సవాల్. ఉన్నట్టుండి బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలడం, సరైన భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోవడం ఆ జట్టుకు బలహీనతగా మారింది. ముఖ్యంగా ఓపెనర్లు సరైన ఆరంభాలను ఇవ్వలేకపోతున్నారు. వార్నర్ స్థిరంగానే ఆడుతున్నా.. మిచెల్ మార్ష్లో స్థిరత్వం లేదు. పేసర్లు ఎక్కువ పరుగులు ఇచ్చేస్తుండడం.. ఎన్నో ఆశలు పెట్టుకున్న లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా తేలిపోతుండడం ఆసీస్ను దెబ్బ తీస్తోంది. ముఖ్యంగా ఫీల్డింగ్ను మెరుగుపరుచుకుంటే ఆ జట్టుకు మన్ముందు మరిన్ని చేదు అనుభవాలు తప్పవు.
-ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు