IND vs AUS 2nd ODI : విశాఖ వన్డేలో ఆసీస్ విశ్వరూపం.. 11 ఓవర్లలోనే ముగించేశారు!
విశాఖపట్నం (Vizag ODI) వన్డేలో అటు బౌలింగ్లోనూ, ఇటు బ్యాటింగ్లోనూ టీమ్ ఇండియా (Team India) ఘోర వైఫల్యం చెందింది. దీంతో రెండో వన్డేలో ఆసీస్ ఘన విజయాన్ని నమోదు చేసింది.
విశాఖపట్నం: ఆస్ట్రేలియా(Australia) పేస్ ధాటికి సగం ఓవర్లు ఆడేందుకూ టీమ్ఇండియా(Team India) కష్టపడిన పిచ్పైనే ఆసీస్ విశ్వరూపం చూపించింది. విశాఖ వేదికగా జరిగిన రెండో వన్డే(IND vs AUS)లో రోహిత్ సేన విధించిన 118 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం 11 ఓవర్లలోనే ఛేదించింది. సిక్స్లు, ఫోర్లతో చెలరేగుతూ వికెట్ పడకుండా ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (51*), మార్ష్ (66*) పని పూర్తి చేశారు. ఈ విజయంతో ఆసీస్ 1-1తో సిరీస్ను సమం చేసి టైటిల్ రేసులో నిలిచింది. ఇక చెన్నై వేదికగా జరిగే చివరిదైన మూడో మ్యాచ్ సిరీస్ విజేతను తేల్చనుంది.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ 117 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ స్టార్క్, సీన్ అబాట్, ఎల్లీస్ పేస్ అటాక్ ముందు భారత బ్యాటింగ్ ఆర్డర్ వెలవెలబోయింది. విరాట్ కోహ్లీ (31), అక్షర్ పటేల్ (29) ఆ కాస్త రాణించడంతో.. భారత్ స్కోరు వంద పరుగులైనా దాటగలిగింది. శుబ్మన్ గిల్, సూర్య కుమార్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ డకౌట్లు కాగా.. కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్ సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 5 వికెట్లతో విజృంభించగా.. సీన్ అబాట్ 3, ఎల్లీస్ 2 వికెట్లు పడగొట్టాడు.
మరికొన్ని వివరాలు:
* మిచెల్ మార్ష్ భారత్పై వన్డేల్లో 122.44 స్ట్రైక్రేట్తో 311 పరుగులు సాధించాడు. 103.66 సగటుతో కొనసాగుతున్నాడు.
* అత్యంత వేగవంతమైన ఆసీస్ లక్ష్య ఛేదనలో ఇది మూడో మ్యాచ్. ఇంతకుముందు యూఎస్ఏపై 66/1 (7.5 ఓవర్లు), వెస్టిండీస్పై 71/1 (9.2 ఓవర్లు) ఆసీస్ విజయం సాధించింది.
* కేవలం 37 ఓవర్లలోనే మ్యాచ్ ముగియడం గమనార్హం. సెంచరీ భాగస్వామ్యంలో అత్యధిక రన్రేట్ కలిగిన మూడో మ్యాచ్ కూడా ఇదే. ట్రావిస్ హెడ్ - మిచెల్ మార్ష్ 66 బంతుల్లో 121 పరుగులు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్