IND vs AUS 2nd ODI : విశాఖ వన్డేలో ఆసీస్ విశ్వరూపం.. 11 ఓవర్లలోనే ముగించేశారు!
విశాఖపట్నం (Vizag ODI) వన్డేలో అటు బౌలింగ్లోనూ, ఇటు బ్యాటింగ్లోనూ టీమ్ ఇండియా (Team India) ఘోర వైఫల్యం చెందింది. దీంతో రెండో వన్డేలో ఆసీస్ ఘన విజయాన్ని నమోదు చేసింది.
విశాఖపట్నం: ఆస్ట్రేలియా(Australia) పేస్ ధాటికి సగం ఓవర్లు ఆడేందుకూ టీమ్ఇండియా(Team India) కష్టపడిన పిచ్పైనే ఆసీస్ విశ్వరూపం చూపించింది. విశాఖ వేదికగా జరిగిన రెండో వన్డే(IND vs AUS)లో రోహిత్ సేన విధించిన 118 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం 11 ఓవర్లలోనే ఛేదించింది. సిక్స్లు, ఫోర్లతో చెలరేగుతూ వికెట్ పడకుండా ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (51*), మార్ష్ (66*) పని పూర్తి చేశారు. ఈ విజయంతో ఆసీస్ 1-1తో సిరీస్ను సమం చేసి టైటిల్ రేసులో నిలిచింది. ఇక చెన్నై వేదికగా జరిగే చివరిదైన మూడో మ్యాచ్ సిరీస్ విజేతను తేల్చనుంది.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ 117 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ స్టార్క్, సీన్ అబాట్, ఎల్లీస్ పేస్ అటాక్ ముందు భారత బ్యాటింగ్ ఆర్డర్ వెలవెలబోయింది. విరాట్ కోహ్లీ (31), అక్షర్ పటేల్ (29) ఆ కాస్త రాణించడంతో.. భారత్ స్కోరు వంద పరుగులైనా దాటగలిగింది. శుబ్మన్ గిల్, సూర్య కుమార్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ డకౌట్లు కాగా.. కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్ సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 5 వికెట్లతో విజృంభించగా.. సీన్ అబాట్ 3, ఎల్లీస్ 2 వికెట్లు పడగొట్టాడు.
మరికొన్ని వివరాలు:
* మిచెల్ మార్ష్ భారత్పై వన్డేల్లో 122.44 స్ట్రైక్రేట్తో 311 పరుగులు సాధించాడు. 103.66 సగటుతో కొనసాగుతున్నాడు.
* అత్యంత వేగవంతమైన ఆసీస్ లక్ష్య ఛేదనలో ఇది మూడో మ్యాచ్. ఇంతకుముందు యూఎస్ఏపై 66/1 (7.5 ఓవర్లు), వెస్టిండీస్పై 71/1 (9.2 ఓవర్లు) ఆసీస్ విజయం సాధించింది.
* కేవలం 37 ఓవర్లలోనే మ్యాచ్ ముగియడం గమనార్హం. సెంచరీ భాగస్వామ్యంలో అత్యధిక రన్రేట్ కలిగిన మూడో మ్యాచ్ కూడా ఇదే. ట్రావిస్ హెడ్ - మిచెల్ మార్ష్ 66 బంతుల్లో 121 పరుగులు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?