Bengaluru X Hyderabad: వరుస ఓటములు జట్టును కుంగదీశాయి: బెంగళూరు కెప్టెన్
Bengaluru X Hyderabad: చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు, హైదరాబాద్ జట్లు సోమవారం తలపడ్డాయి. ఎస్ఆర్హెచ్ రికార్డు స్కోరు నమోదు చేసింది. దీంతో ఆర్సీబీ మరో ఓటమి మూటగట్టుకుంది. మ్యాచ్ అనంతరం దాని కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఓటమికి గల కారణాలను వివరించాడు.
బెంగళూరు: ఐపీఎల్లో వరుస ఓటములతో సతమతమవుతున్న బెంగళూరు జట్టుకు.. సోమవారం హైదరాబాద్ చేతిలోనూ పరాభవం తప్పలేదు. పైగా బౌలర్లను సన్రైజర్స్ బ్యాటర్లు ఓ ఆటాడేసుకున్నారు. ఫలితంగా వారి జట్టు ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసింది. మ్యాచ్ అనంతరం బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ మాట్లాడుతూ.. తమ జట్టు ఓటమికి గల కారణాలను వివరించాడు. వరుస వైఫల్యాలతో తమ ప్లేయర్లలో విశ్వాసం సన్నగిల్లిందని తెలిపాడు.
‘‘ఈ రోజు పిచ్పై నమోదైన స్కోర్లు ఓ ప్రపంచ రికార్డు. మేం చేసిన 262 పరుగులు కూడా తక్కువేం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో బౌలింగ్ చాలా కష్టం. మేం కొన్ని ప్రయత్నాలు చేశాం. కానీ, అవి ఫలించలేదు. వరుస విజయాలు దూకుడును పెంచినట్లే.. ఓటములు దాన్ని లాగేసుకుంటాయి. ఆత్మవిశ్వాసం లేకుండా బరిలోకి దిగితే అది ఆటతీరులోనూ ప్రతిఫలిస్తుంది. ఫాస్ట్బౌలర్లు చాలా శ్రమించాల్సి వచ్చింది. బ్యాటింగ్ విషయంలోనూ మేం కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంది. పవర్ప్లే తర్వాత రన్రేట్ తగ్గకుండా చూసుకోవాలి. మా బ్యాటర్లు తమ వంతు కృషి చేశారు. ఎక్కడా చేతులెత్తేయలేదు. క్రికెట్లో మైండ్ను ఎప్పుడూ ఫ్రెష్గా ఉంచుకోవాలి. ఒక్కోసారి ఒత్తిడికి బుర్ర బద్దలౌతుందేమో అనిపిస్తుంది. అయితే, బరిలోకి దిగాక మాత్రం పూర్తి కమిట్మెంట్తో ఆడాల్సి ఉంటుంది’’ అంటూ మ్యాచ్ సమయంలో తమపై ఒత్తిడి పనిచేసినట్లు డుప్లెసిస్ అంగీకరించాడు.
చిన్నస్వామి స్టేడియంలో సోమవారం హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో బెంగళూరు ఓటమిపాలైన విషయం తెలిసిందే. మ్యాచ్లో 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి హైదరాబాద్ ఏకంగా 287 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (102) విధ్వంసక శతకం సాధిస్తే.. క్లాసెన్ (67), సమద్ (37), అభిషేక్ శర్మ (34), మార్క్రమ్ (32 నాటౌట్) కూడా రాణించారు. అనంతరం బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లకు 262 పరుగులు చేసింది. డుప్లెసిస్ (62), కోహ్లి (42) మెరుపు ఆరంభాన్నిచ్చినా.. ఆ తర్వాత జట్టు గాడి తప్పింది. దినేశ్ కార్తీక్ (83) సంచలన ఇన్నింగ్స్ ఆడి ఆర్సీబీకి గౌరవప్రదమైన ఓటమిని మిగిల్చాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల