WTC Final-Gill: కామెరూన్ గ్రీన్ వివాదాస్పద క్యాచ్.. బంతి నేలను తాకింది: రికీ పాంటింగ్
ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత ఓపెనర్ శుభ్మన్ గిల్ (Shubman Gill) క్యాచ్ ఔట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దీని గురించి ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ (Ricky Ponting) ఐసీసీ ఇంటర్వ్యూలో మాట్లాడాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ (WTC Final 2023)లో భారత్ ఓటమిపాలైంది. 444 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రోహిత్ సేన (Team India) 234 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో శుభ్మన్ గిల్ (Shubman Gill) క్యాచ్ ఔట్ వివాదస్పదంగా మారిన సంగతి తెలిసిందే. బొలాండ్ వేసిన ఎనిమిదో ఓవర్ మొదటి బంతిని స్లిప్లో కామెరూన్ గ్రీన్ ఎడమ వైపు డైవ్ చేస్తూ ఒంటి చేత్తో క్యాచ్ అందుకున్నాడు. బంతి నేలకు తాకిన తర్వాత గ్రీన్ అందుకున్నట్లు రీప్లేలో స్పష్టంగా కనిపించింది. కానీ, థర్డ్ అంపైర్ కెటిల్బోరో ఔట్గా ప్రకటించడంతో గిల్ పెవిలియన్కు చేరక తప్పలేదు. అప్పటి నుంచి ఈ క్యాచ్ గురించి పెద్ద చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ క్యాచ్ గురించి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ (Ricky Ponting) ఐసీసీ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. కామెరూన్ గ్రీన్ క్యాచ్ అందుకున్నప్పుడు బంతి నేలను తాకిందని పాంటింగ్ పేర్కొన్నాడు. ఇదే సమయంలో థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం సరైనదే అని అభిప్రాయపడ్డాడు.
‘‘ప్రత్యక్షప్రసారంలో చూసినప్పుడు గ్రీన్ క్యాచ్ సరిగ్గానే అందుకున్నట్లు అనిపించింది. కానీ, మేం అన్ని రీప్లేలు చూసిన తర్వాత బంతి పూర్తిగా చేతిలోకి వచ్చిందా? లేదా అనే దానిపై నాకు స్పష్టత రాలేదు. వాస్తవానికి బంతిలో కొంతభాగం నేలను తాకినట్లు నేను భావిస్తున్నాను. బంతి నేలను తాకడానికి ముందు ఫీల్డర్కు బాల్పై పూర్తి నియంత్రణ కలిగి ఉన్నంత వరకు అది ఔట్ అని అంపైర్ భావిస్తాడు. ఇక్కడ సరిగ్గా అదే జరిగి ఉండొచ్చు. ఈ క్యాచ్ గురించి చాలా చర్చ జరుగుతోంది. ఆస్ట్రేలియాలో కంటే భారత్లోనే దీని గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. భారత్లోని ప్రతీ ఒక్కరూ ఇది నాటౌట్ అని అనుకుంటారు. ఆస్ట్రేలియా వారు ఇది ఔట్ అని భావిస్తారు. ఒకవేళ ఫీల్డ్ అంపైర్లు ఔట్ ఇచ్చి ఉంటే.. ఆ నిర్ణయాన్ని మార్చేందుకు ఆధారాన్ని థర్డ్ అంపైర్ కనుగొని ఉండాల్సిన అవసరం ఉండేది. అయితే, బంతి నేలకు తాకిందనేలా తుది ఆధారం ఏదీ లేదని నేను అనుకుంటున్నా. సాఫ్ట్ సిగ్నల్ లేకున్నా.. థర్డ్ అంపైర్ అందుకే దీన్ని ఔట్గా ఇచ్చారని, అతను తీసుకున్న నిర్ణయం సరైనదని భావిస్తున్నా” అని పాంటింగ్ వివరించాడు.
థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయంపై శుభ్మన్ గిల్ సోషల్ మీడియా వేదికగా అసమ్మతి వ్యక్తం చేశాడు. ఇది ఐసీసీ (ICC) ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘన కిందకు వస్తుందని గిల్కు జరిమానా విధించారు. అతని మ్యాచ్ ఫీజులో 15శాతం కోత విధించారు. స్లో ఓవర్ రేట్ కారణంగా భారత జట్టుకు ఐసీసీ మ్యాచ్ ఫీజులో 100 శాతం కోత విధించింది. ఈ లెక్కన చూసుకుంటే గిల్కు 115 శాతం జరిమానా పడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్సీబీ.. ఆశల పల్లకిలో
నిజంగా ఇది ఎవరూ ఊహించనిదే. ఎప్పుడో కథ ముగిసిన జట్టుగా కనిపించిన ఆర్సీబీ వరుసగా అయిదో విజయంతో అనూహ్యంగా ప్లేఆఫ్స్ రేసులోకి వచ్చింది. రజత్ పటీదార్ బ్యాటింగ్ మెరుపులకు బౌలర్ల శ్రమ తోడవడంతో దిల్లీని చిత్తుగా ఓడించిన ఆ జట్టు.. మొత్తంగా ఆరో విజయంతో పాయింట్ల పట్టికలో అయిదో స్థానానికి దూసుకెళ్లింది. -
చెన్నై గట్టెక్కింది
చెన్నై నిలిచింది. సొంతగడ్డ చెపాక్లో అదరగొట్టి ప్లేఆఫ్స్కు చేరువైంది. పెద్దగా మెరుపుల్లేని.. భారీస్కోర్లు నమోదుకాని పోరులో రాజస్థాన్ను ఓడించిన సీఎస్కే 13 మ్యాచ్ల్లో ఏడో విజయంతో మూడో స్థానానికి చేరుకుంది. -
ధోని మళ్లీ చెన్నైకి వస్తాడా?
ఆదివారం రాజస్థాన్తో మ్యాచ్ అనంతరం చెపాక్ స్టేడియంలో భావోద్వేగ వాతావరణం కనిపించింది. ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అనే ఊహాగానాల నేపథ్యంలో చెపాక్లో మళ్లీ అతణ్ని చూస్తామో లేదో అని అభిమానుల్లో అన్న సందేహాలు నెలకొన్నాయి. -
అందుకే జడేజా ఔట్
రాజస్థాన్తో మ్యాచ్లో జడేజా ఔట్ చర్చనీయాంశమైంది. ఫీల్డింగ్కు అవరోధం కలిగించాడనే కారణంతో మూడో అంపైర్ జడేజాను ఔట్గా ప్రకటించాడు. అవేశ్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్లో అయిదో బంతిని ఆడిన జడేజా రెండో పరుగుకు ప్రయత్నించాడు. -
కోట్లు వస్తున్నాయిగా.. ఇంకేంటి బాధ?
లఖ్నవూ సూపర్ జెయింట్స్ ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గొయెంకాపై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశ్నించాడు. సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో లఖ్నవూ చిత్తుగా ఓడిన తర్వాత.. -
వాళ్ల జీతాల్లో కోత పెట్టాలి
టీ20లో ప్రపంచకప్లో ఆడనున్న తమ ఆటగాళ్లు ఐపీఎల్ నుంచి త్వరగా స్వదేశానికి రావాలని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఆదేశించడంపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ మండిపడ్డాడు. త్వరగా ఐపీఎల్ను వీడే ఆటగాళ్ల జీతాల్లో కోత పెట్టాలని డిమాండ్ చేశాడు. -
పారిస్లో అతనొక్కడే..
భారత రెజ్లర్లు సుజీత్ కల్కాల్ (65 కేజీ), జైదీప్ అహ్లావత్ (74 కేజీ)లకు తీవ్ర నిరాశ. పారిస్ ఒలింపిక్స్ బెర్తు సాధించాలన్న వీరి ఆశ తీరలేదు. ప్రపంచ ఒలింపిక్ క్వాలిఫయర్స్ రెపిచేజ్లో సుజీత్ 2-2తో అలెన్ రుథర్ఫర్డ్ (అమెరికా)తో సమానంగా నిలిచాడు. -
కార్ల్సన్కు ప్రజ్ఞానంద షాక్
ప్రపంచ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)కు భారత గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద మరోసారి షాకిచ్చాడు. ఇటీవలి కాలంలో కార్ల్సన్ను తరుచుగా ఓడిస్తున్న ప్రజ్ఞానంద.. శనివారం సూపర్బెట్ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ టోర్నీ 11వ రౌండ్లో 69 ఎత్తుల్లో పైచేయి సాధించాడు. -
సత్తాచాటిన ‘లక్ష్య’ అనూష
జాతీయ ఫెడరేషన్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో ‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ మల్లాల అనూష సత్తాచాటింది. ఆదివారం భువనేశ్వర్లో జరిగిన మహిళల ట్రిపుల్ జంప్లో ఆమె పసిడి సొంతం చేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఓటు కోసం ద్విచక్రవాహనంపై దంపతుల సాహస యాత్ర!
-
మెదడులో నాడీ దిక్సూచి.. గుర్తించిన శాస్త్రవేత్తలు
-
‘వివేకం’ సినిమాకు 2.15 కోట్లకు పైగా వీక్షణలు
-
డాక్టర్ సునీతకు ప్రతిష్ఠాత్మక ఐడీఎస్ఏ ఫెలోషిప్
-
రూ.4 వేల కోట్ల రుణం కోసం ఆర్బీఐ తలుపు తట్టిన ఏపీ సర్కార్
-
భారత్ ఇచ్చిన ఎయిర్క్రాఫ్ట్లను నడిపే సామర్థ్యం మా పైలట్లకు లేదు: మాల్దీవుల మంత్రి