RCB: ఫామ్తో తంటాలా.. ఆర్సీబీ ఉందిగా!
ఈ ఐపీఎల్ సీజన్లో బెంగళూరుపై ఫామ్లో లేని ఆటగాళ్లు కూడా చెలరేగుతున్నారు. అంతేకాదు వారే మ్యాచ్ విన్నర్లుగా అవతరిస్తున్నారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఐపీఎల్లో అత్యంత ఆకర్షణీయ జట్లలో ఒకటి. ఎప్పుడూ స్టార్ ఆటగాళ్లతో కళకళలాడుతుంటుంది. కానీ ప్రదర్శన చూస్తే అంతంతమాత్రం. ప్రతిసారీ కప్పు మీద బెంగళూరు అభిమానులు భారీ ఆశలు పెట్టుకోవడం.. ఆ జట్టు అందుకు తగ్గట్లు సాగక మధ్యలోనే నిష్క్రమించడం మామూలే. ఈసారి కూడా పరిస్థితి భిన్నంగా ఏమీ లేదు. అసలు ఫామ్లో లేని ఆటగాళ్లు కూడా ఆర్సీబీ అనగానే చెలరేగిపోయి ఆడేస్తుండడం.. ఆ జట్టు పాలిట విలన్లుగా మారుతుండడం గమనార్హం. దీంతో ఎవరైనా ఫామ్లో లేకుంటే ఆర్సీబీ వారిని గాడిన పడేలా చేస్తుందంటూ సామాజిక మాధ్యమాల్లో ఆ జట్టుపై జోకులు పేలుతున్నాయి.
తన చివరి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమి చవిచూసింది బెంగళూరు. ఈ మ్యాచ్లో కోహ్లి అద్భుత శతకంతో జట్టుకు 183 పరుగుల స్కోరు అందించినా ఫలితం లేకపోయింది. అంత పెద్ద లక్ష్యాన్ని రాయల్స్ అలవోకగా, ఆడుతూ పాడుతూ ఛేదించింది. తొలి ఓవర్లోనే యశస్వి జైస్వాల్ డకౌటవ్వగానే రాజస్థాన్కు కష్టమే అనుకున్నారు. ఎందుకంటే మరో ఓపెనర్ జోస్ బట్లర్ ఫామ్లో లేడు. పేలవ ఆరంభం తర్వాత ఆ జట్టు ఏం పుంజుకుంటుందిలే అన్న కామెంట్లు వినిపించాయి. కానీ తన తొలి మూడు మ్యాచ్ల్లో తీవ్రంగా తడబడుతూ.. వరుసగా 11, 11, 13 పరుగులే చేసిన బట్లర్ ఈ మ్యాచ్లో చెలరేగిపోయాడు. 58 బంతుల్లోనే 100 పరుగులు చేసి అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. పేలవ ఫామ్ నుంచి బయటపడి ఆర్సీబీ మీద చెలరేగిపోయిన ఆటగాడు బట్లర్ ఒక్కడే కాదు. గత మ్యాచ్ల్లో కూడా కొందరు ఆటగాళ్లు ఇలాగే బెంగళూరుతో మ్యాచ్ అనగానే లయ అందుకున్నారు.
రెచ్చిపోయిన క్వింటన్ డికాక్..
దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ కూడా ఈ ఐపీఎల్ ముంగిట అంత మంచి ఫామ్లో లేడు. దక్షిణాఫ్రికా టీ20 లీగ్లో అతను బాగా ఇబ్బంది పడ్డాడు. సీజన్ మొత్తంలో ఒక్క అర్ధసెంచరీనే సాధించాడు. ఐపీఎల్ తొలి మ్యాచ్లోనూ 4 పరుగులే చేశాడు. రెండో మ్యాచ్లో పంజాబ్పై అర్ధశతకం సాధించినా.. సాధికారికంగా ఆడలేకపోయాడు. కానీ బెంగళూరు మీద మాత్రం రెచ్చిపోయాడు 56 బంతుల్లోనే 81 పరుగులు చేసి మ్యాచ్లో టాప్స్కోరర్గా నిలిచాడు. దీంతో లఖ్నవూ ఆర్సీబీని సులువుగా ఓడించింది.
సునీల్ నరైన్ విధ్వంసం..
సునీల్ నరైన్ అంటే కేవలం స్పిన్నర్ మాత్రమే. గతంలో ఒక సీజన్లో ఓపెనింగ్లో వచ్చిన కొన్ని మెరుపు ఇన్నింగ్స్లు ఆడాడు. తర్వాత బ్యాటింగ్లో పెద్దగా ప్రభావం చూపింది లేదు. కానీ ఈ సీజన్లో మాత్రం తిరిగి ఓపెనర్గా వచ్చి బ్యాటుతో రెచ్చిపోతున్నాడు. అతను ఈ సీజన్ తొలి మ్యాచ్లో 2 పరుగులే చేసి ఔటయ్యాడు. కానీ ఆర్సీబీ మీద మాత్రం చెలరేగిపోయాడు. కేవలం 22 బంతుల్లోనే 47 పరుగులు చేసి బెంగళూరును పోటీలో లేకుండా చేశాడు. కోహ్లి (83 నాటౌట్) అర్ధశతకం సాయంతో 182 పరుగులు చేసిన బెంగళూరు.. నరైన్ను కట్టడి చేయలేకపోవడంతో ఛేదనలో కోల్కతా దూసుకెళ్లింది. అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. ఇదే మ్యాచ్లో వెంకటేశ్ అయ్యర్ (30 బంతుల్లో 50) కూడా ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. అతనీ సీజన్లో మరే మ్యాచ్లోనూ రాణించలేదు.
బ్రార్ అద్భుత బౌలింగ్..
బెంగళూరు ఈ సీజన్లో సాధించిన ఏకైక విజయం పంజాబ్ మీదే. ఐతే ఆ మ్యాచ్లో 177 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు 6 వికెట్లు కోల్పోయి కష్టం మీద ఛేదించింది. ఐతే మామూలుగా చాలా సాధారణ స్పిన్నర్లా కనిపించే హర్ప్రీత్ బ్రార్ ఈ మ్యాచ్లో చాలా ప్రమాదకరంగా కనిపించాడు. అసలు ఫామ్లో లేని అతను.. ఆర్సీబీ మీద 4 ఓవర్లలో 13 పరుగులే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టి ఆ జట్టుకు ఓటమి భయం కలిగించాడు. చివర్లో దినేశ్ కార్తీక్ చెలరేగి ఆడబట్టి ఆర్సీబీ నెగ్గింది కానీ.. లేదంటే ఇది కూడా ఓడిపోయేదే. కాగిసో రబాడ సైతం ఈ మ్యాచ్తోనే ఫామ్ అందుకుని రెండు వికెట్లు పడగొట్టడం గమనార్హం.
లయ అందుకొన్న ముస్తాఫిజుర్..
ఈ సీజన్ ఆరంభ మ్యాచ్లో చెన్నై చేతిలో ఓటమి పాలైంది ఆర్సీబీ. ఆ మ్యాచ్తో ఫాం అందుకున్న ఆటగాడు ముస్తాఫిజుర్ రెహ్మాన్. అంతకుముందు అతను అంతర్జాతీయ మ్యాచ్ల్లో అతడి ప్రదర్శన సాధారణం. చివరి 5 మ్యాచ్ల్లో 6 వికెట్లే తీశాడు. కానీ ఆర్సీబీతో మ్యాచ్లో మాత్రం 29 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. తర్వాతి రెండు మ్యాచ్ల్లో మాత్రం 3 వికెట్లే తీశాడు. ఇలా ఫామ్లో లేని ఆటగాళ్లు, వేరే జట్లపై రాణించలేని క్రికెటర్లు ఆర్సీబీపై మాత్రం రెచ్చిపోయి ఆ జట్టుకు ఓటమి మిగులుస్తుండటం ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్గా మారింది. మామూలుగానే బాగా ట్రోలింగ్కు గురయ్యే ఆర్సీబీ ఈ ఒరవడితో మరింతగా విమర్శలు ఎదుర్కొంటోంది.
- ఈనాడు క్రీడావిభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
-
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సుకు బైడెన్ హాజరవుతారు: శ్వేత సౌధం