BAN vs SL: టెన్షన్ పడినా.. 2 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసిన బంగ్లా
పొట్టి కప్లో ప్రతి మ్యాచ్ ఉత్కంఠగా సాగుతోంది. తాజాగా బంగ్లా - శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ కూడా అభిమానులకు క్రికెట్ మజాను అందించింది.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్లో (T20 World Cup 2024) బంగ్లాదేశ్ బోణీ కొట్టింది. వరుసగా శ్రీలంకకు రెండో ఓటమి ఎదురైంది. డల్లాస్ వేదికగా జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన లంక 124/9 స్కోరుకే పరిమితం కాగా.. బంగ్లా 19 ఓవర్లలో 125 పరుగులు చేసి విజయం సాధించింది. చివరి వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో బంగ్లా 8 వికెట్లను కోల్పోవడం గమనార్హం. శ్రీలంక ఓపెనర్ పాతున్ నిస్సాంక (47), ధనంజయ డిసిల్వా (21) ఫర్వాలేదనిపించారు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజర్ 3, రషద్ హుస్సేన్ 3, తస్కిన్ అహ్మద్ 2, తన్జిమ్ ఒక వికెట్ తీశారు.
తుషారా బెంబేలెత్తించినా..
లంక నిర్దేశించిన 129 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో బంగ్లాకు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. ఓపెనర్ సౌమ్యా సర్కార్ (0) డకౌట్గా పెవిలియన్కు చేరాడు. మరో ఓపెనర్ తన్జిద్ హసన్ (3) కూడా త్వరగా పెవిలియన్కు చేరాడు. ఆ తర్వాత కెప్టెన్ నజ్ముల్ (7) కాసేపు క్రీజ్లో ఉన్నప్పటికీ కీలక సమయంలో ఔటయ్యాడు. లిటన్ దాస్ (36), తౌహిద్ హృదోయ్ (40) ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. వీరిద్దరూ నాలుగో వికెట్కు 63 పరుగులు జోడించారు. మరోసారి తుషారా (4/18)తోపాటు హసరంగ (2/32) విజృంభణతో బంగ్లా కష్టాల్లో పడింది. స్వల్ప వ్యవధిలో నాలుగు వికెట్లను కోల్పోయింది. అయితే, మహమ్మదుల్లా (16*) చివరి వరకూ క్రీజ్లో ఉండి జట్టును గెలిపించడంతో బంగ్లా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికే సౌతాఫ్రికా చేతిలో ఓటమిపాలైన శ్రీలంక ఇప్పుడు మరో పరాజయం నమోదు చేయడంతో సూపర్ - 8 అవకాశాలు సన్నగిల్లినట్లే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ