T20 League: ఆ లీగ్.. ఓ సర్కస్ లాంటిది: బంగ్లాదేశ్ కోచ్ సంచలన వ్యాఖ్యలు
బంగ్లాదేశ్ క్రికెటర్లు నైపుణ్యాలను అందిపుచ్చుకోవడంలో విఫలం కావడానికి తమ దేశంలో జరుగుతున్న లీగ్ కూడా కారణమని ప్రధాన కోచ్ వ్యాఖ్యానించాడు.
ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్ ప్రధాన కోచ్ చండికా హతురుసింఘా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ దేశంలో జరుగుతున్న టీ20 లీగ్ మ్యాచ్లను చూడకుండా టీవీని ఆపేసిన సందర్భాలున్నాయని వ్యాఖ్యానించాడు. ఆటగాళ్ల మధ్య సరైన పోటీ వాతావరణం లేదని అభిప్రాయపడ్డాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL) వల్ల చాలా మంది క్రికెటర్లు వెలుగులోకి వచ్చినప్పటికీ.. అదేమంత గొప్ప టోర్నీ కాదని పేర్కొన్నాడు.
‘‘బంగ్లాదేశ్లో సరైన టీ20 టోర్నమెంట్ లేదని చెబుతా. కొందరికి ఈ మాటలు కష్టంగా అనిపించే అవకాశం ఉంది. బీపీఎల్ జరుగుతున్న సమయంలో.. కొన్నిసార్లు ఆ మ్యాచ్లను చూడలేకపోయా. టీవీ ఆపేసిన సందర్భాలూ ఉన్నాయి. ఇప్పుడున్న పద్ధతి నాకస్సలు నచ్చలేదు. అందుకే, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఇందులో జోక్యం చేసుకోవాలి. కొన్ని నియమాలను రూపొందించాలి. ఆటగాడు ఒక టోర్నీలో ఆడుతూనే.. మరొక దానిలో పాల్గొంటున్నాడు. ఇదంతా ఓ సర్కస్లా ఉంది. కొందరు ప్లేయర్లు తమకు అవకాశాలు వస్తున్నాయని దీనిని సమర్థించుకొంటున్నారు. కానీ, క్రికెట్కు ఇది మేలు చేయదు. అభిమానుల్లోనూ ఆసక్తి పోతుంది. నాక్కూడా అలానే జరిగింది.
బంగ్లాదేశ్ క్రికెటర్లకు కొన్ని విభాగాల్లో నాణ్యమైన సాధన కరవైంది. టాప్-3 బ్యాటర్లు దూకుడుగా ఆడే అవకాశం లేదు. అలాగే బౌలర్లకు డెత్ ఓవర్లలో రాణించడం అత్యవసరం. ఇలాంటి విషయాలను ఎక్కడ నేర్చుకుంటారు? మనకు ఒక టోర్నీ మాత్రమే ఉంది. అందుకే బీపీఎల్కు ముందు మరొకటి నిర్వహిస్తే బాగుంటుంది. కొందరు టాప్ ప్లేయర్లు మాత్రం ఇలాంటి వాటిల్లో ఆడకుండా తప్పించుకుంటున్నారు. నైపుణ్యాలను మెరుగుపర్చుకోకపోతే ఇతర జట్లతో పోటీ ఎలా పడతాం?’’ అని చండికా హతురుసింఘా వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
టెస్టుల్లో సచిన్ తెందూల్కర్ అత్యధిక పరుగుల రికార్డును ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ (Joe Root) బ్రేక్ చేసే అవకాశముందని భారత మాజీ వికెట్కీపర్ దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) అభిప్రాయపడ్డాడు. -
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
Paris Olympics 2024: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో షూటర్లు సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా నిరాశపర్చారు. -
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ