ధోనీ ఆడటం చూడాలి.. ఇదంతా బీసీసీఐ చేతుల్లోనే..!: అంబటి రాయుడు
‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ ఐపీఎల్ భవితవ్యంపై ఎవరికి తగ్గట్టుగా వారు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటివరకు దానిగురించి ధోనీ మాత్రం స్పందించలేదు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్లో చెన్నై ప్లేఆఫ్స్కు చేరుకోలేకపోవడంతో చాలామంది అభిమానులు తీవ్ర వేదనకు గురయ్యారు. అందులో ఒకప్పటి సీఎస్కే ఆటగాడు అంబటి రాయుడు (Ambati Rayudu) కూడా ఉన్నాడు. ఆ మ్యాచ్ సందర్భంగా రాయుడు కాస్త భావోద్వేగానికి గురయ్యాడు. ఎంఎస్ ధోనీ (MS Dhoni) ఆటను మళ్లీ చూస్తామా? లేదా? అనే అనుమానాలను మాత్రం రాయుడు కొట్టిపడేశాడు. తప్పకుండా మరికొన్నేళ్లు ఆడతాడని.. అయితే, బీసీసీఐ ఇప్పుడు అమలుచేస్తున్న ‘ఇంపాక్ట్’ రూల్ను కొనసాగించాలని కోరాడు. ఈ నిబంధనపై చాలామంది నుంచి వ్యాఖ్యలు వస్తున్న క్రమంలో రాయుడు ఇలా స్పందించడం విశేషం.
‘‘ధోనీకిదే చివరి మ్యాచ్ అని నేను అనుకోవడం లేదు. క్రికెట్కు ముగింపు పలకకూడదని గట్టిగా కోరుకుంటున్నా. ఆర్సీబీతో మ్యాచ్ చివర్లో ఔట్ కావడంపై ధోనీ కాస్త నిరుత్సాహానికి గురయ్యాడు. గతంలో ఎప్పుడూ అతడిని ఇలా చూడలేదు. సీఎస్కేను క్వాలిఫై చేసి.. ముగింపు ఉన్నతంగా ఉండాలని కోరుకొని ఉంటాడు. అయితే, ధోనీ గురించి మీకెవరికీ తెలియదు. తప్పకుండా అతడు వచ్చే సీజన్లోనూ మైదానంలోకి దిగుతాడు. ఇంపాక్ట్ రూల్తో అతడి ఆటను మళ్లీ చూసే అవకాశం ఉంది. అయితే, ఈ రూల్ను బీసీసీఐ కొనసాగించాలి. మేం ఎంఎస్ ధోనీ ఆడాలని కోరుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు అది బీసీసీఐ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది’’ అని రాయుడు తెలిపాడు. మరోవైపు ధోనీ తన మోకాలి శస్త్రచికిత్స కోసం విదేశాలకు వెళ్తున్నట్లు సమాచారం. ఆ తర్వాత తన భవితవ్యంపై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.
ధోనీ నుంచి నేర్చుకుంటూనే ఉన్నా: రచిన్
ఐపీఎల్లో తొలిసారి సీఎస్కే జట్టుకు రచిన్ రవీంద్ర ప్రాతినిధ్యం వహించాడు. ధోనీతో మైదానం పంచుకోవడం ఎప్పటికీ స్పెషల్గా మిగిలిపోతుందని వ్యాఖ్యానించాడు. ‘‘ప్రపంచ క్రికెట్లో అద్భుత ఘనత సాధించిన ఎంఎస్ ధోనీతో కలిసి ఆడా. కేవలం మైదానంలోనే కాకుండా.. వెలుపలా అతడినుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. తన జ్ఞానాన్ని అందరికీ పంచుతాడు. నా పేరు గురించి గూగుల్లో చాలామంది శోధించినట్లు ఇటీవలే తెలిసింది. అంతకుముందు నేనెప్పుడూ దానిని పట్టించుకోలేదు. నేను భారత వారసత్వం కలిగిన వ్యక్తినే. అలాగే కివీస్ పౌరుడిగా చెప్పుకొనేందుకు గర్వపడతా. భారత్కు రావడాన్ని ఎప్పుడూ ఆస్వాదిస్తా’’ అని రచిన్ పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.