Shreyas Iyer: అందుకే అయ్యర్పై వేటు పడింది..!
గాయాన్ని కారణంగా చూపి రంజీ మ్యాచ్లకు దూరంగా ఉన్న అయ్యర్ ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ చేయడంతో బీసీసీఐ ఆగ్రహానికి గురయ్యాడు.
ఇంటర్నెట్ డెస్క్: దేశవాళీ టోర్నీల్లో ఆడనందుకు సీనియర్ ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్టులో ఇషాన్ కిషన్ (Ishan Kishan), శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)కు బీసీసీఐ చోటు కల్పించలేదన్న విషయం తెలిసిందే. కిషన్పై వేటు ఊహించిందే అయినా అయ్యర్ను తొలగించడానికి గల కారణాలు మాత్రం మొదట్లో తెలియలేదు. శ్రేయస్ అయ్యర్ ఇంగ్లాండ్తో జరిగిన రెండు టెస్టుల్లోనూ పాల్గొన్నాడు. గాయం కారణంగా జట్టుకు దూరమైన అతడికి వార్షిక కాంట్రాక్టులో చోటివ్వకుండా బీసీసీఐ పక్కన పెట్టేసింది. దీనికి పలు కారణాలున్నాయి. రంజీ టోర్నీ క్వార్టర్ ఫైనల్లో ముంబయి తరఫున ఆడాలని బీసీసీఐ కోరగా ఫిట్నెస్తో లేనని తెలిపి ఐపీఎల్ల్లో తాను కెప్టెన్గా వ్యవహరిస్తున్న కోల్కతా జట్టుతో చేరి ప్రాక్టీస్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. దీనిపై బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాడు. గాయాన్ని కారణంగా చూపి మ్యాచ్లకు దూరంగా ఉన్న అయ్యర్ ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ చేయడంతో అతడిపై వేటు పడింది.
‘‘ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ను వార్షిక కాంట్రాక్టు ఒప్పందానికి ఈసారి పరిగణలోకి తీసుకోవడం లేదు. ఆటగాళ్లు జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించని సమయాల్లో దేశవాళీ టోర్నీల్లో కచ్చితంగా ఆడాలి’’ అని బీసీసీఐ పేర్కొంది.
ముంబయి జట్టు తరఫున రంజీ క్వార్టర్ ఫైనల్లో ఆడకపోవడంతో వార్షిక కాంట్రాక్టు పోగొట్టుకున్న శ్రేయస్ అయ్యర్ తమిళనాడుతో జరగబోయే సెమీ ఫైనల్ మ్యాచ్కు అందుబాటులో ఉండనున్నాడు. ఇషాన్ కిషన్ దక్షిణాఫ్రికా పర్యటన నుంచి మధ్యలోనే తిరిగొచ్చిన తర్వాత ఏ ఒక్క సిరీస్లోనూ జాతీయ జట్టుకు ఆడలేదు. జార్ఖండ్ తరఫున రంజీల్లో పాల్గొనాలని బీసీసీఐ కోరినా పట్టించుకోకుండా ఐపీఎల్ కోసం హార్దిక్ పాండ్యాతో కలిసి ప్రాక్టీస్ చేయడం చర్చనీయాంశమైంది. దీంతో బీసీసీఐ అతడిని వార్షిక కాంట్రాక్టు జాబితా నుంచి తొలగించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.