BCCI: ఏప్రిల్ 16న ఐపీఎల్ ఫ్రాంచైజీ యజమానులతో బీసీసీఐ కీలక భేటీ.. మెగా వేలంపై చర్చ!
ఐపీఎల్ ఫ్రాంచైజీ యజమానులతో బీసీసీఐ ఏప్రిల్ 16న అహ్మదాబాద్లో భేటీ కానుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ ఫ్రాంచైజీ యజమానులతో బీసీసీఐ భేటీ కానుంది. ఏప్రిల్ 16న అహ్మదాబాద్లో ఈ సమావేశం జరగనుంది. ఈ మేరకు అన్ని ఫ్రాంచైజీల ఓనర్లకు బీసీసీఐ సమాచారం అందించింది. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, సెక్రెటరీ జై షా, ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ సింగ్ ధుమాల్ ఈ సమావేశానికి హాజరుకానున్నారు.
ఇందులో ప్రధానంగా 2025 ఎడిషన్కు ముందు నిర్వహించే మెగా వేలం గురించి చర్చించనున్నట్లు తెలుస్తోంది. వేలానికి ముందు ఆటగాళ్ల రిటెన్షన్ అంశంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఆటగాళ్ల రిటెన్షన్పై ఫ్రాంచైజీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని జట్లు రిటైన్ ఆటగాళ్ల సంఖ్యను ఎనిమిదికి పెంచాలని కోరుతుండగా.. మరికొన్ని జట్లు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి. ఐపీఎల్ 2022 సీజన్కు ముందు నిర్వహించిన చివరి మెగా వేలంలో ఒక్కో జట్టు నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశం కల్పించారు. ఐపీఎల్ 2024 వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి జట్లకు రూ.100 కోట్ల పరిమితిని విధించారు. వచ్చే సీజన్ నుంచి దీనిని పెంచే అవకాశముంది.
కోల్కతా, రాజస్థాన్ మ్యాచ్ రీ షెడ్యూల్?
ఐపీఎల్ 2024లో భాగంగా ఏప్రిల్ 17న ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా, రాజస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్ రీ షెడ్యూల్ అయ్యే ఛాన్స్ ఉంది. మ్యాచ్ జరిగే రోజే శ్రీరామనవమి కావడమే ఇందుకు కారణం. కోల్కతాలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. దీంతో భద్రత కోసం భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మొహరించాల్సి ఉంటుంది. కాబట్టి, ఆ రోజు మ్యాచ్కు తగినంత భద్రత కల్పించడం సాధ్యం కాకపోవచ్చు. మరికొన్ని రోజుల్లో ఈ మ్యాచ్ నిర్వహణ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు