ODI WC 2023: వారిద్దరిలో ఎవరికి చోటు..? వీరిద్దరిపైనేనా వేటు? వరల్డ్ కప్ కోసం భారత జట్టు ప్రకటన నేడేనా?
వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023) కోసం జట్టును ప్రకటించాల్సిన సమయం దగ్గర పడుతోంది. ఇవాళే భారత స్క్వాడ్ (Team India) ఎంపిక ఉంటుందని వార్తలు వస్తున్నాయి. దీంతో ఎవరికి చోటు దక్కుతుంది.. ఎవరిని పక్కన పెడతారనేది ఆసక్తికరంగా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023) జరగనుంది. ఇప్పటికే కొన్ని దేశాలు ప్రాథమిక జట్లను ప్రకటించాయి. ప్రస్తుతం టీమ్ఇండియా (Team India)ఆసియా కప్ (Asia Cup 2023) ఆడుతోంది. శనివారం పాకిస్థాన్తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. గ్రూప్ స్టేజ్లో సోమవారం నేపాల్తో భారత్ తలపడనుంది. మరోవైపు సెప్టెంబర్ 4లోపు (సోమవారం) వరల్డ్ కప్ కోసం స్క్వాడ్ను ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ ప్రత్యేకంగా చర్చించి ఇవాళే 15 మందితో కూడిన జట్టును ప్రకటిస్తారనే కథనాలు వస్తున్నాయి. ఆసియా కప్ కోసం ప్రకటించిన జట్టునే కొనసాగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, బీసీసీఐ నుంచి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఊరించి.. ఉసూరుమనిపించి.. 16 ఏళ్ల తర్వాత మళ్లీ మ్యాచ్ రద్దు
ఆసియా కప్లోని తొలి రెండు మ్యాచ్లకు దూరమైన కేఎల్ రాహుల్ ఫిట్నెస్ నిరూపించుకోగలిగితే అతడినే ఎంపిక చేసే అవకాశం ఉంది. దీంతో సంజూ శాంసన్ మరోసారి రిజర్వ్ బెంచ్కే పరిమితం అవ్వొచ్చు. ఆసియా కప్లోనూ సంజూ స్టాండ్బై ప్లేయర్గానే ఉన్నాడు. ప్రస్తుతం 17 మందితో ఉన్న ఆసియా కప్ జట్టులో నుంచి ఇద్దరిని పక్కన పెట్టాల్సి ఉంటుంది. దీంతో యువ క్రికెటర్లు తిలక్ వర్మ, ప్రసిధ్ కృష్ణను తప్పించే అవకాశాలు మెండుగా ఉన్నట్లు క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వన్డేల్లో గొప్పగా రాణించలేకపోతున్ననప్పటికీ సూర్యకుమార్ యాదవ్ మాత్రం జట్టులోకి రావచ్చు. పేసర్లుగా బుమ్రా, షమీ, సిరాజ్, శార్దూల్, హార్దిక్ పాండ్య బౌలింగ్ను నడిపిస్తారు. అయితే.. చాహల్కు మరోసారి నిరాశ తప్పకపోవచ్చు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా చాహల్కు బదులు కుల్దీప్ యాదవ్ను తీసుకోవడం ఖాయం. స్పిన్ ఆల్రౌండర్లుగా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఉన్నారు.
భారత స్క్వాడ్ (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!