IND vs PAK: ఊరించి.. ఉసూరుమనిపించి.. 16 ఏళ్ల తర్వాత మళ్లీ మ్యాచ్ రద్దు
ఆసియా కప్ 2023లో భారత్, పాక్ (IND vs PAK) మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఇరుదేశాల అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్ - పాకిస్థాన్ (IND vs PAK) మ్యాచ్ అంటే క్రికెటర్లకు ఎంత టెన్షన్ ఉంటుందో.. క్రికెట్ అభిమానుల్లోనూ తీవ్ర ఆసక్తి ఉండటం సహజమే. ప్రత్యర్థి జట్టుపై తమ దేశం ఆటగాళ్లు ఆధిపత్యం చలాయించి విజయం సాధించాలని ఇరుజట్ల అభిమానులు కోరుకుంటారు. కానీ, కొన్నిసార్లు ఫలితం ఎటూ తేలకుండాపోయి అభిమానులకు నిరాశే మిగులుతుంది. తాజాగా ఆసియా కప్ 2023 టోర్నీలోనూ ఇలానే జరిగింది. శ్రీలంక వేదికగా దాయాదుల మధ్య పోరు వర్షం కారణంగా రద్దు అయింది. రెండుసార్లు వర్షం అంతరాయాల నడుమ టీమ్ఇండియా 48.5 ఓవర్లకు 266 పరుగులు చేసి ఆలౌటైంది. అనంతరం ఎడతెరిపి లేని వర్షం కురవడంతో మ్యాచ్ను పాక్ ఇన్నింగ్స్ ప్రారంభం కాకుండానే మ్యాచ్ను రద్దు చేశారు. దాయాదుల మధ్య వరుణుడు అడ్డుపడి ఇలా మ్యాచ్ రద్దు కావడం ఆసియా కప్లో రెండోసారి. మొత్తంగా మూడో మ్యాచ్ కావడం గమనార్హం. ఇలా ఊరించి.. అభిమానులను ఉసూరుమనిపించిన మ్యాచ్లూ ఉన్నాయి.
ఆసియా కప్లో అప్పుడు అలా..
ఈ మ్యాచ్ ముందు వరకు ఆసియా కప్లో భారత్ - పాకిస్థాన్ జట్ల మధ్య వన్డే ఫార్మాట్లో 17 మ్యాచ్లు జరిగాయి, అందులో 1997 ఆసియా కప్లో మినహా మిగతావన్నీ ఫలితాలు వచ్చినవే. ఇది కూడా శ్రీలంక వేదికగా జరిగిన మ్యాచ్ కావడం విశేషం. తొలుత జులై 20న భారత్ - పాక్ మ్యాచ్ ప్రారంభమైంది. పాక్ బ్యాటింగ్ చేస్తూ 9 ఓవర్లలోనే ఐదు వికెట్ల నష్టానికి 30 పరుగులు మాత్రమే చేసింది. ఆ సమయంలో వర్షం రావడంతో మ్యాచ్ మరుసటి రోజుకు వాయిదాపడింది. అయితే, అప్పుడు కూడా వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్ను రద్దు చేసినట్లు అంపైర్లు ప్రకటించారు. ఆ మ్యాచ్లో వెంకటేశ్ ప్రసాద్ (4/17), అబే కురువిల్లా (1/10) ధాటికి సయీద్ అన్వర్ (0), ఇంజమామ్ ఉల్ హక్ (0) డకౌట్గా వెనుదిరిగారు.
అక్కడ ఒకే ఒక్క మ్యాచ్ వర్షార్పణం..
ప్రస్తుత భారత కోచ్ రాహుల్ ద్రవిడ్ నాయకత్వంలోని టీమ్ఇండియా పాక్తో ఒకే ఒక్క వన్డే మ్యాచ్ ఆడేందుకు స్కాట్లాండ్కు వెళ్లింది. గ్లాస్గో వేదికగా మ్యాచ్ను చూసేందుకు క్రికెట్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూశారు. తీరా, ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దు కావడం ఫ్యాన్స్ను తీవ్ర ఆవేదనకు గురి చేసింది. పాకిస్థాన్ కెప్టెన్గా షోయబ్ మాలిక్ వ్యవహరించాడు.
- కెనడా వేదికగా 1997లో పాక్తో జరిగిన మ్యాచ్ కూడా వర్షార్పణమైంది. పాక్ తొలుత బ్యాటింగ్ చేస్తూ 31.5 ఓవర్ల సమయంలో వర్షం రావడంతో మ్యాచ్ రద్దు అయిపోయింది. అప్పటికి పాక్ స్కోరు 169/3.
- 1989 సీజన్లో పాక్ పర్యటనకు భారత్ వెళ్లింది. మూడో వన్డే కూడా ఇలాగే ప్రారంభమైన కాసేపటికే వర్షం కారణం అర్ధాంతరంగా రద్దు చేయాల్సి వచ్చింది. వర్షం వల్ల 40 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో పాక్ 14.3 ఓవర్లు ఆడి 28/3 స్కోరుతో ఉన్నప్పుడు మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.
- మోహిందర్ అమర్నాథ్ నాయకత్వంలోని భారత్ 1984లో పాక్కు వెళ్లింది. రెండో వన్డేలో భారత్ 40 ఓవర్లలో (కుదించిన ఓవర్లు) 210/3 స్కోరు చేసింది. అనంతరం పాక్ ఛేదనకు దిగాల్సి ఉంది. అయితే, వర్షం రావడంతో మ్యాచ్ ఆగిపోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దంచికొట్టి..దర్జాగా
అదే దూకుడు.. అదే దంచుడు. లక్ష్యం ఏమో 215. అయినా తమ ముందు అది చిన్నదే అంటూ.. సన్రైజర్స్ మరోసారి రెచ్చిపోయింది. -
సీఎస్కేను ఆపగలనని నమ్మా
చెన్నై సూపర్ కింగ్స్ని చివరి ఓవర్లో 17 పరుగులు చేయకుండా ఆపగలనని నమ్మానని.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ యశ్ దయాళ్ తెలిపాడు. -
ఒక్క బంతీ పడకుండానే..
ఐపీఎల్-17లో లీగ్ దశలో ఆఖరి మ్యాచ్ వర్షార్పణం అయింది. -
ఛాంప్స్ సాత్విక్-చిరాగ్
భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి అదరగొట్టారు. -
లీగ్ దశ ముగిసె..
పరుగుల వరద పారిన మ్యాచ్లు.. ఉత్కంఠభరితంగా ముగిసిన సమరాలు.. రికార్డుల మీద రికార్డులు! దాదాపు రెండు నెలలుగా అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్-17లో లీగ్ దశ ముగిసింది. -
ప్రసారదారుపై మండిపడ్డ రోహిత్
క్రికెటర్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తోందటూ ఐపీఎల్ ప్రసారదారుపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ మండిపడ్డాడు. -
ధోని ఆఖరి మ్యాచ్ ఆడాడని అనుకోవట్లేదు
దిగ్గజ ఆటగాడు మహేంద్రసింగ్ ధోని తన కెరీర్లో చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడినట్లు తాను భావించట్లేదని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. -
‘లక్ష్య’ దీప్తి రికార్డు
ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి జీవాంజి దీప్తి (తెలంగాణ) సత్తాచాటింది. -
అర్జున్ గేమ్ డ్రా
షార్జా మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ ఆటగాడు అర్జున్ ఇరిగేశి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. -
మను ఆధిపత్యం
ఒలింపిక్ సెలక్షన్ ట్రయల్స్లో స్టార్ షూటర్ మను బాకర్ ఆధిపత్యం ప్రదర్శించింది. -
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు
స్టార్ స్పోర్ట్స్పై రోహిత్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మైదానంలో ఆటగాళ్ల సంభాషణలు రికార్డు చేయడంపై మండిపడ్డాడు.
తాజా వార్తలు (Latest News)
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..