Rohit Sharma: రోహిత్ అడుగులు ఎటు.. భవితవ్యంపై చర్చించనున్న బీసీసీఐ..!
రోహిత్ పరిమిత ఓవర్ల క్రికెట్ భవితపై బీసీసీఐ చర్చించనుంది. ఇక పొట్టి ప్రపంచకప్లో రోహిత్ మెరుపులను మళ్లీ చూసేందుకు బలమైన అవకాశాలున్నాయి. కాకపోతే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్, కొత్త నాయకుడి తయారీ హిట్మ్యాన్ ప్రధాన అజెండాలో చేరే అవకాశం ఉంది.
ఇంటర్నెట్డెస్క్: ప్రపంచకప్ ఓటమి హడావుడి కొంచెం తగ్గాక జట్టులో కీలక మార్పులపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. రానున్న నాలుగేళ్లలో వైట్బాల్ క్రికెట్లో బోర్డు అనుసరించాల్సిన వ్యూహంపై రోహిత్, చీఫ్ సెలెక్టర్ అగార్కర్తో బోర్డు చర్చించనుంది. వీటిల్లో రోహిత్ వైట్బాల్ క్రికెట్ భవితపై కూడా కీలక నిర్ణయాలు తీసుకోవచ్చు. భవిష్యత్తులో పరిమిత ఓవర్ల క్రికెట్లో జట్టును నడిపేందుకు అవసరమైన నాయకుడిని తీర్చిదిద్దే అంశంపై కూడా వ్యూహం సిద్ధం చేయవచ్చు.
బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటికే రోహిత్ ఈ విషయంలో స్పష్టతతో ఉన్నట్లు తెలుస్తోంది. తన పేరును టీ20 ఫార్మాట్కు పరిశీలించకపోయినా ఇబ్బంది లేదని బోర్డుకు సంకేతాలిచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు సెలక్టర్లు కూడా దాదాపు ఏడాది నుంచి యువతకు టీ20 జాతీయ జట్టులో భారీగా అవకాశాలు కల్పిస్తున్నారు. మరో ఏడు నెలల్లో టీ20 ప్రపంచకప్ ఉండటంతో ఈ వ్యూహం నుంచి వెనక్కి తగ్గే అవకాశం లేదు.
ఇక శ్రేయస్ పునరాగమనం, మూడో స్థానంలో గిల్ స్థిరపడటంతో రహానేకు అవకాశాలు కష్టం కావచ్చు. మరోవైపు బ్యాకప్ వికెట్కీపర్ రూపంలో కేఎల్ సిద్ధంగా ఉన్నాడు. రోహిత్ కూడా తన కెరీర్లో ఇక టెస్ట్ మ్యాచ్లపైనే దృష్టిపెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ సైకిల్ 2025 వరకు కొనసాగనుంది. అదే సమయంలో ఈ ఫార్మాట్కు కొత్త కెప్టెన్ను సిద్ధం చేసే బాధ్యతలను కూడా రోహిత్పైనే పెట్టే అవకాశం ఉంది.
2024 టీ20 ప్రపంచకప్లో ఆడడా..?
రోహిత్ వన్డే ప్రపంచకప్లో 406 బంతుల్లో 500 పరుగులు చేశాడు. 54 సగటు.. 125స్ట్రైక్ రేట్తో ఆడాడు. టోర్నీ మొత్తంలో అత్యధికంగా 31 సిక్సులు బాదాడు. ఈ గణాంకాలు చూస్తే ఎవరైనా హిట్మ్యాన్ను టీ20 ఫార్మాట్లో ఆడొద్దు అనే సాహసం చేయరు. మరోవైపు కోహ్లీ 700కుపైగా పరుగులు చేసి సూపర్ ఫామ్లో ఉన్నాడు. టీ20 ప్రపంచకప్నకు కేవలం ఏడు నెలల సమయమే ఉంది. ఈ నేపథ్యంలో ఐసీసీ టోర్నీకి రోహిత్, కోహ్లీని పక్కనపెట్టి ఆ స్థానాల్లో కొత్తవారిని తెచ్చేందుకు సెలక్టర్లు పెద్దగా మొగ్గుచూపకపోవచ్చు. అంతేకాదు.. కోహ్లీ, రోహిత్ ప్రపంచకప్ కలను తీర్చుకొనేందుకు ఈ రూపంలో మరో అవకాశం ఇచ్చినట్లవుతుంది. సెలక్టర్ల ప్రయోగాలు కేవలం ద్వైపాక్షిక సిరీస్లకే పరిమితం చేసే అవకాశాలున్నాయి.
మరోవైపు కాలి మడమ గాయంతో బాధపడుతున్న హార్దిక్ పాండ్య జనవరి నాటికి కోలుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒక వేళ అతడు కోలుకోకపోతే టీ20 ప్రపంచకప్ జట్టు మరో ఆల్రౌండర్ను బ్యాకప్గా సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత కష్టమే..
21వ శతాబ్దంలో భారత్ తరపున క్రికెట్ ఆడిన ఆటగాళ్లలో కేవలం ఐదుగురే 38 ఏళ్ల తర్వాత కూడా మైదానంలో కొనసాగారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ అత్యధికంగా 40 ఏళ్ల 204 రోజుల వరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. ఇక రాహుల్ ద్రవిడ్, ధోనీ 38 ఏళ్లు దాటినా ఆటలో కొనసాగారు. ఇక ఆశిష్ నెహ్రా, కుంబ్లే 38వ ఏట వరకు ఆడారు. వీరిలో నెహ్రా మినహా మిగిలిన నలుగురు 400కు పైగా అంతర్జాతీయ మ్యాచ్లు ఆడారు. బ్యాటర్లు అయితే 500కు పైగా మ్యాచ్లు పూర్తిచేశారు. ఈ లెక్కన చూసినా.. రోహిత్ 2027 వరకు కొనసాగడం చాలా కష్టం. ఛాంపియన్స్ ట్రోఫీ వరకు అతడి కెరీర్కు ఇబ్బంది లేకపోవచ్చు. అప్పటికి రోహిత్ వయస్సు 38కి చేరుతుంది. ఇక సుదీర్ఘకాలం ఆటలో కొనసాగే విషయంలో మాత్రం కోహ్లీకి ఫిట్నెస్ కలిసి రావచ్చు. రోహిత్తో పోలిస్తే అతడు మరికొంత కాలం ఎటువంటి ఇబ్బంది లేకుండా కెరీర్ను కొనసాగించే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
-
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!