Ben Stokes: వన్డేల్లోకి తిరిగొచ్చిన బెన్స్టోక్స్.. అసలెందుకు అతడిపై భారీ అంచనాలు?
కేవలం ఒకే ఒక్క ఆటగాడి కోసం ఆ జట్టు కోచ్ సహా ప్రతి ఒక్కరూ విజ్ఞప్తులు చేశారు. మరోసారి ప్రపంచకప్లో తమ జట్టు విజయం సాధించాలంటే అతడు తప్పక ఉండాలని మరికొందరు పట్టుపట్టారు. ఇంతకీ ఆ క్రికెటర్ బెన్ స్టోక్స్. వన్డే క్రికెట్ రిటైర్మెంట్ను వెనక్కి తీసుకుని తిరిగొచ్చాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్ టాప్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ (Ben Stokes) తన వన్డే రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. భారత్ వేదికగా జరగనున్న ప్రపంచకప్ (ODI World Cup 2023) బరిలోకి దిగేందుకు సిద్ధమేనని వెల్లడించాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అతడిని న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు ఎంపిక చేసింది. ఈ మేరకు ఈసీబీ ట్విటర్ వేదికగా (ప్రస్తుతం ఎక్స్) ‘బిగ్ మ్యాన్ ఈజ్ బ్యాక్’ అంటూ ట్వీట్ చేసింది. ఆగస్ట్ 30 నుంచి కివీస్తో ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్ కోసం బెన్ స్టోక్స్కు అవకాశం ఇవ్వగా.. సీనియర్ బౌలర్ జోఫ్రా ఆర్చర్కు చోటు దక్కకపోవడం గమనార్హం. స్టోక్స్ చివరి వన్డే మ్యాచ్ 2022 జులై 19న దక్షిణాఫ్రికాతో ఆడాడు. ఇప్పటి వరకు 105 వన్డేల్లో 2,924 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, 21 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
హబీబ్ అంటే ఒక బ్రాండ్... కోల్కతాను ఊపేసిన హైదరాబాద్ ఫుట్బాల్ దిగ్గజం
ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఆశ ఇదే..
క్రికెట్కు పుట్టినిల్లు ఇంగ్లాండ్ను ఊరిస్తూ వచ్చిన వన్డే ప్రపంచకప్ కల 2019లో నెరవేరింది. సూపర్ ఓవర్కు వెళ్లిన ఆ మ్యాచ్లో బౌండరీల ప్రకారం ఇంగ్లాండ్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. కెప్టెన్గా ఇయాన్ మోర్గాన్ ఉన్నప్పటికీ.. ఫైనల్ మ్యాచ్లో వీరోచిత ఇన్నింగ్స్తో బెన్ స్టోక్స్ ఇంగ్లాండ్కు కప్ దక్కడంలో కీలక పాత్ర పోషించాడు. వరుసగా రెండోసారి కప్ను గెలవాలనే లక్ష్యంతో ఉన్న ఇంగ్లాండ్ జట్టుకు పేస్ ఆల్రౌండర్గా బెన్స్టోక్స్ సేవలు అత్యవసరం. మిడిలార్డర్లో బెన్కు కీలక ఇన్నింగ్స్లు ఆడగల సత్తా ఉంది. తాజాగా ఆసీస్తో జరిగిన యాషెస్ సిరీస్లోనూ దూకుడైన (బజ్బాల్) క్రికెట్తో సిరీస్ను సమం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. బౌలింగ్లో ఎక్కువగా ఓవర్లు వేయనప్పటికీ.. బ్యాటింగ్లో మాత్రం ఇంగ్లాండ్కు వెన్నెముకగా నిలిచాడు. జట్టులో ఇప్పటికే బెయిర్ స్టో, జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్, సామ్ కరన్, లియామ్ లివింగ్స్టోన్ ఉన్నప్పటికీ.. నిలకడైన ఆటతీరుతోపాటు అవసరమైనప్పుడు ప్రత్యర్థులపై విరుచుకుపడే బెన్స్టోక్స్ ఉండటం మరింత కలిసొస్తుందని ఇంగ్లాండ్ క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
వన్డే ప్రపంచకప్ ప్రాథమిక జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్
మరోవైపు, వన్డే ప్రపంచకప్ కోసం ఇంగ్లాండ్ తమ ప్రాథమిక జట్టును ప్రకటించింది. జోస్ బట్లర్ కెప్టెన్గా 15 మందిని ఎంపిక చేసింది. వన్డేల నుంచి రిటైర్మెంట్ నిర్ణయాన్ని తీసుకున్న ఆల్రౌండర్ బెన్స్టోక్స్కు ఈ జాబితాలో చోటుదక్కింది. అయితే, టెస్టు క్రికెట్లో సంచలన ఆటతీరుతో ఆకట్టుకుంటున్న యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్కు ఇంగ్లాండ్ సెలక్టర్లు అవకాశం కల్పించలేదు. ఫాస్ట్ బౌలర్ జోఫ్రా అర్చర్ను కూడా ఎంపిక చేయలేదు. అర్చర్ని ప్రపంచ కప్ ప్రణాళికలలో ట్రావెలింగ్ రిజర్వ్గా మాత్రమే చేర్చుతామని ఇంగ్లాండ్ సెలక్టర్ ల్యూక్ రైట్ స్పష్టం చేశాడు.వన్డే ప్రపంచకప్ కోసం ప్రకటించిన ప్రాథమిక జట్టునే ఆగస్టు 30 నుంచి కివీస్తో ప్రారంభంకానున్న నాలుగు వన్డేల సిరీస్కు ఎంపిక చేసినట్లు తెలిపాడు.
వన్డే ప్రపంచ కప్.. ఇంగ్లాండ్ ప్రాథమిక జట్టు ఇదే
జోస్ బట్లర్ (కెప్టెన్), మొయిన్ అలీ, గుస్ అట్కిన్సన్, జానీ బెయిర్స్టో, సామ్ కరన్, లియామ్ లివింగ్స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, జో రూట్, జాసన్ రాయ్, బెన్ స్టోక్స్, రీస్ టాప్లీ, డేవిడ్ విల్లీ, మార్క్ వుడ్, క్రిస్ వోక్స్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శాంసన్ మెరిసినా.. మురిసింది దిల్లీనే
27 బంతుల్లో 60 పరుగులు చేయాలి. తక్కువేమీ కాదు. కానీ కెప్టెన్ సంజు శాంసన్ నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతుండడంతో రాజస్థాన్ రాయల్స్ రేసులోనే ఉంది. 222 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా.. అప్పుడు ఒత్తిడంతా దిల్లీపైనే. -
ఐపీఎల్.. మళ్లీ భారమేనా?
ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్లో తీరిక లేకుండా మ్యాచ్లు ఆడడం.. ఆ వెంటనే టీ20 ప్రపంచకప్ వేటకు వెళ్లడం.. అలసటకు గురైన ఆటగాళ్లు అక్కడ అంతంతమాత్రంగా ఆడడం.. టీమ్ఇండియా పోరాటం మధ్యలోనే ముగిసిపోవడం.. గత కొన్ని పర్యాయాల నుంచి ఇదే వరస! -
నేడు ఫ్రాన్స్ చేరనున్న ఒలింపిక్ జ్యోతి
ఒలింపిక్ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచే జ్యోతి రిలే.. ఆతిథ్య దేశం ఫ్రాన్స్లో అడుగుపెట్టనుంది. బుధవారం మార్సె దక్షిణ సముద్ర తీర ప్రాంతానికి చేరుకోనుంది. ఏప్రిల్ 16న గ్రీస్లోని ప్రాచీన ఒలింపియాలో మొదలైన ఈ రిలే.. సముద్ర మార్గం గుండా ఏథెన్స్ను దాటి మార్సెకి చేరువైంది. -
వారిద్దరి విషయంలో ద్రవిడ్కు ప్రణాళికలు ఉండాలి
భారత కెప్టెన్ రోహిత్శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి విషయంలో టీమ్ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్కు స్పష్టమైన ప్రణాళికలు ఉండాలని దిగ్గజ క్రికెటర్ బ్రయాన్ లారా అభిప్రాయపడ్డాడు. -
భారత్కు ఏడు స్వర్ణాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు మరో ఏడు పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు. పోటీల చివరిరోజు ప్రీతి (54 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ఆకాశ్ గోర్కా (60 కేజీలు), పూనమ్ (57 కేజీలు), ప్రాచి (63 కేజీలు), ముస్కాన్ (75 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు) ఫైనల్లో విజయాలు అందుకున్నారు. -
బంగ్లాదే సిరీస్
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్ను బంగ్లాదేశ్ మరో రెండు మ్యాచ్లు ఉండగానే సొంతం చేసుకుంది. మంగళవారం మూడో టీ20లో 9 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది. -
కేకేఆర్ ఆటగాళ్ల ఇక్కట్లు
ప్రతికూల వాతావరణం కారణంగా కోల్కతా నైట్రైడర్స్ ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. లఖ్నవూ నుంచి కోల్కతా వెళ్లాల్సిన క్రికెటర్ల ప్రత్యేక విమానాన్ని పదే పదే మళ్లించడంతో వారు ఒక రాత్రి వారణాసిలో గడపాల్సి వచ్చింది. -
ఒత్తిడిలోనూ రోహిత్ మంచి నిర్ణయాలు
ఒత్తిడి సమయాల్లోనూ కెప్టెన్ రోహిత్ శర్మ మంచి నిర్ణయాలు తీసుకుంటాడని భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అన్నాడు. టీ20 ప్రపంచకప్లో భారత్కు రోహిత్ కీలకమవుతాడని తెలిపాడు. -
సమవుజ్జీల సమరం
11 మ్యాచ్లు.. 6 విజయాలు.. 5 ఓటములు.. 12 పాయింట్లు. ఇప్పటి వరకు ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్, లఖ్నవూ సూపర్ జెయింట్స్ జట్ల ప్రదర్శన ఇది. స్వల్ప నెట్ రన్రేటు తేడాతో పాయింట్ల పట్టికలో నాలుగు, అయిదు స్థానాల్లో ఉన్న సమవుజ్జీలు మరో పోరుకు సిద్ధమయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్