Mohammed Habib: హబీబ్ అంటే ఒక బ్రాండ్... కోల్కతాను ఊపేసిన హైదరాబాద్ ఫుట్బాల్ దిగ్గజం
ప్రముఖ ఫుట్బాలర్ మహ్మద్ హబీబ్ (Mohammed Habib) గురించి ఇప్పటితరం వాళ్లకు తక్కువగా తెలిసుండొచ్చు. కానీ ఆయన ఘనతలు వింటే ఇలాంటి మేటి ఆటగాడు ఆడుతున్న తరంలో మనం ఎందుకు లేము అనిపిస్తుంది. ఆయన గురించి మరిన్ని విషయాలు మీకోసం.
భారత మాజీ ఫుట్బాలర్, అర్జున అవార్డు గ్రహీత మహ్మద్ హబీబ్ (74) మంగళవారం కన్నుమూశారు. హబీబ్ (Mohammed Habib) స్వస్థలమైన హైదరాబాద్లో ఇదొక మామూలు వార్త. కానీ కోల్కతాలో మాత్రం ఇదొక పెద్ద విషాదం. సాకర్ (Soccer) అంటే పడిచచ్చే బెంగాలీలకు హబీబ్ ఒక సూపర్ స్టార్. 70వ దశకంలో ఆయన విన్యాసాలకు ఊగిపోయిన అప్పటి తరం సాకర్ ప్రియులు.. హబీబ్ ఘనతలను గుర్తు చేసుకుంటూ విషాదంలో మునిగిపోతున్నారు. హబీబ్ ఘనతల గురించి కథలు కథలుగా చెప్పుకుంటూ తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు. ప్రపంచ సాకర్ చరిత్రలోనే అత్యంత గొప్ప ఆటగాళ్లలో ఒకడిగా పేరున్న పీలే సైతం హబీబ్ ఆటపై ప్రశంసలు కురిపించాడంటే ఆయన స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
మనోడు.. పీలే మెచ్చినోడు
అది 1977వ సంవత్సరం. మహ్మద్ హబీబ్ బెంగాల్ క్లబ్ మోహన్ బగాన్కు ఆడుతున్నాడు. ఈ క్లబ్తో స్నేహ పూర్వక మ్యాచ్ ఆడేందుకు న్యూయార్క్కు చెందిన కాస్మోస్ క్లబ్ వచ్చింది. అది ఆషామాషీ జట్టు కాదు. ఆల్ టైం గ్రేట్ పీలేతో పాటు కార్లోస్ ఆల్బర్టో, జార్జియో చినాగ్లియా లాంటి మేటి ఆటగాళ్లతో నిండిన ప్రపంచ స్థాయి జట్టది. మోహన్ బగాన్ ఇండియాలో బెస్ట్ క్లబ్ అయినప్పటికీ.. ప్రపంచ ప్రమాణాలతో పోలిస్తే చాలా దిగువనే ఉంటుంది. ఈ రెండు జట్ల మధ్య పోరు అంటే ఏకపక్షంగా సాగుతుందని.. మోహన్ బగాన్ చిత్తుగా ఓడిపోతుందని విశ్లేషకులు అంచనా వేశారు.
కుల్చా జోడీ ఉంటుందా..? విరాటే అత్యుత్తమం!..
కానీ అంచనాలను తలకిందులు చేస్తూ మోహన్ బగాన్.. కాస్మోస్ క్లబ్కు దీటుగా నిలబడింది. మ్యాచ్ ఆద్యంతం హోరాహోరీగా సాగింది. చివరికి స్కోరు 2-2తో సమమైంది. మ్యాచ్ డ్రా అయింది కానీ.. మోహన్ బగాన్ స్థాయికి ఈ ప్రదర్శన చేయడమంటే గెలుపు కంటే ఎక్కువే. ఈ ఆటలో అత్యంత కీలక పాత్ర పోషించిన ఆటగాళ్లలో మహ్మద్ హబీబ్ ఒకరు. ఆయన ఈ మ్యాచ్లో ఒక గోల్ కూడా కొట్టాడు. మ్యాచ్ అనంతరం పీలే.. హబీబ్ ప్రతిభ గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు. హబీబ్ను వ్యక్తిగతంగా అభినందించాడు. పీలే పొగడటం వల్ల హబీబ్ గొప్పవాడు అయిపోలేదు. ఆయన ఘనతల గురించి చెప్పుకోవడానికి చాలానే ఉంది.
బెంగాల్ దత్తపుత్రుడు
60, 70 దశకాల్లో స్వర్ణయుగం చూసిన భారత ఫుట్బాల్ జట్టులో కీలక సభ్యుడు మహ్మద్ హబీబ్. భారత జట్టుకు 35 మ్యాచ్ల్లో ప్రాతినిధ్యం వహించిన హబీబ్.. 11 గోల్స్ సాధించాడు. 1970 బ్యాంకాక్ ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచిన భారత జట్టులో హబీబ్ సభ్యుడు. హబీబ్ కంటే ముందు, తర్వాత ఎంతోమంది మేటి ఆటగాళ్లున్నప్పటికీ.. భారత ఫుట్బాల్ చరిత్రలోనే అత్యుత్తమ మిడ్ఫీల్డర్గా ఆయన్ని సాకర్ నిపుణులు పరిగణిస్తారంటే తనెంత గొప్ప ఆటగాడో అర్థం చేసుకోవచ్చు. భారత్లో తొలి తరం ప్రొఫెషనల్ ఫుట్బాలర్లలో హబీబ్ ఒకరు. ఆయన 60వ దశకంలోనే క్లబ్ ఫుట్బాల్లో అడుగు పెట్టాడు. 1968లో మోహన్ బగాన్ తరఫున ఆయన క్లబ్ ఫుట్బాల్లోకి అడుగు పెట్టాడు.
ఈస్ట్ బెంగాల్..తదితర స్పోర్టింగ్ క్లబ్లకు కూడా ప్రాతినిధ్యం వహించినప్పటికీ.. మోహన్ బగాన్ తరఫున ఆయన ప్రదర్శనలు, సాధించిన విజయాలు చరిత్రలో నిలిచిపోయేవే. ఎందరో దిగ్గజ ఆటగాళ్లు ఈ జట్టుకు ప్రాతినిధ్యం వహించినప్పటికీ.. మహ్మద్ హబీబ్ తమ క్లబ్కు ఆడటాన్ని ఇప్పటికీ గర్వకారణంగా భావిస్తుంది మోహన్ బగాన్. ఈ క్లబ్తో పాటు ఈస్ట్ బెంగాల్కు అనేక మరపురాని విజయాలను అందించాడు హబీబ్. కేవలం ఆయన ఆట చూడటానికే లక్షల మంది అభిమానులు స్టేడియాలకు తరలి వచ్చేవారంటే అతిశయోక్తి కాదు. కోల్కతా వాసులు ఆయన్ని ముద్దుగా ‘బడే మియా’ అని పిలుచుకునేవారు. ఫుట్బాల్ క్లబ్లు హబీబ్ను దక్కించుకోవడానికి క్లబ్లు ఖాళీ చెక్కులు పట్టుకుని ఆయన వెంట తిరిగేవట. ఒక సందర్భంలో మోహన్ బగాన్ నుంచి అడ్వాన్స్ చెక్కు అందుకున్న హబీబ్ను ఎలాగైనా తమ క్లబ్కు ఆడించాలనే ఉద్దేశంతో ఈస్ట్ బెంగాల్ క్లబ్ ప్రతినిధులు.. కోల్కతా నుంచి హైదరాబాద్లో ఉన్న హబీబ్ కోసం ఇక్కడికి వచ్చి సంప్రదింపులు జరపడం విశేషం.
ఐపీఎల్ భారీ కాంట్రాక్ట్ను వదిలేసిన అక్షయ్..?
పుట్టింది పెరిగింది హైదరాబాద్లో అయినా.. బెంగాల్కు దత్తపుత్రుడిగా మారిపోయిన హబీబ్.. ఓవైపు క్లబ్ ఫుట్బాల్ ఆడుతూనే, మరోవైపు బెంగాల్ జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించాడు. ఆ జట్టుకు నాలుగు సంతోష్ ట్రోఫీలు అందించాడు. ఆటలో సాధించిన పేరు ప్రఖ్యాతుల వల్ల ఎన్నో సంస్థలు హబీబ్కు భారీ జీతాలతో ఉద్యోగాలు ఇవ్వజూపినా హబీబ్ ఒప్పుకోలేదు. కెరీర్ ముగిశాక కోచ్గా మారాడు. మూడు దశాబ్దాల పాటు వివిధ క్లబ్లు, అకాడమీల్లో కోచ్గా పని చేశాడు. కొన్నేళ్ల కిందట ఆయన డెమెన్షియా బారిన పడ్డాడు. ఆ తర్వాత పార్కిన్సన్ బాధితుడిగానూ మారాడు. 74 ఏళ్ల హబీబ్ అనారోగ్యంతో చికిత్స పొందుతూ స్వస్థలమైన హైదరాబాద్లోనే కన్నుమూశారు.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శాంసన్ మెరిసినా.. మురిసింది దిల్లీనే
27 బంతుల్లో 60 పరుగులు చేయాలి. తక్కువేమీ కాదు. కానీ కెప్టెన్ సంజు శాంసన్ నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతుండడంతో రాజస్థాన్ రాయల్స్ రేసులోనే ఉంది. 222 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా.. అప్పుడు ఒత్తిడంతా దిల్లీపైనే. -
ఐపీఎల్.. మళ్లీ భారమేనా?
ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్లో తీరిక లేకుండా మ్యాచ్లు ఆడడం.. ఆ వెంటనే టీ20 ప్రపంచకప్ వేటకు వెళ్లడం.. అలసటకు గురైన ఆటగాళ్లు అక్కడ అంతంతమాత్రంగా ఆడడం.. టీమ్ఇండియా పోరాటం మధ్యలోనే ముగిసిపోవడం.. గత కొన్ని పర్యాయాల నుంచి ఇదే వరస! -
నేడు ఫ్రాన్స్ చేరనున్న ఒలింపిక్ జ్యోతి
ఒలింపిక్ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచే జ్యోతి రిలే.. ఆతిథ్య దేశం ఫ్రాన్స్లో అడుగుపెట్టనుంది. బుధవారం మార్సె దక్షిణ సముద్ర తీర ప్రాంతానికి చేరుకోనుంది. ఏప్రిల్ 16న గ్రీస్లోని ప్రాచీన ఒలింపియాలో మొదలైన ఈ రిలే.. సముద్ర మార్గం గుండా ఏథెన్స్ను దాటి మార్సెకి చేరువైంది. -
వారిద్దరి విషయంలో ద్రవిడ్కు ప్రణాళికలు ఉండాలి
భారత కెప్టెన్ రోహిత్శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి విషయంలో టీమ్ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్కు స్పష్టమైన ప్రణాళికలు ఉండాలని దిగ్గజ క్రికెటర్ బ్రయాన్ లారా అభిప్రాయపడ్డాడు. -
భారత్కు ఏడు స్వర్ణాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు మరో ఏడు పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు. పోటీల చివరిరోజు ప్రీతి (54 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ఆకాశ్ గోర్కా (60 కేజీలు), పూనమ్ (57 కేజీలు), ప్రాచి (63 కేజీలు), ముస్కాన్ (75 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు) ఫైనల్లో విజయాలు అందుకున్నారు. -
బంగ్లాదే సిరీస్
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్ను బంగ్లాదేశ్ మరో రెండు మ్యాచ్లు ఉండగానే సొంతం చేసుకుంది. మంగళవారం మూడో టీ20లో 9 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది. -
కేకేఆర్ ఆటగాళ్ల ఇక్కట్లు
ప్రతికూల వాతావరణం కారణంగా కోల్కతా నైట్రైడర్స్ ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. లఖ్నవూ నుంచి కోల్కతా వెళ్లాల్సిన క్రికెటర్ల ప్రత్యేక విమానాన్ని పదే పదే మళ్లించడంతో వారు ఒక రాత్రి వారణాసిలో గడపాల్సి వచ్చింది. -
ఒత్తిడిలోనూ రోహిత్ మంచి నిర్ణయాలు
ఒత్తిడి సమయాల్లోనూ కెప్టెన్ రోహిత్ శర్మ మంచి నిర్ణయాలు తీసుకుంటాడని భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అన్నాడు. టీ20 ప్రపంచకప్లో భారత్కు రోహిత్ కీలకమవుతాడని తెలిపాడు. -
సమవుజ్జీల సమరం
11 మ్యాచ్లు.. 6 విజయాలు.. 5 ఓటములు.. 12 పాయింట్లు. ఇప్పటి వరకు ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్, లఖ్నవూ సూపర్ జెయింట్స్ జట్ల ప్రదర్శన ఇది. స్వల్ప నెట్ రన్రేటు తేడాతో పాయింట్ల పట్టికలో నాలుగు, అయిదు స్థానాల్లో ఉన్న సమవుజ్జీలు మరో పోరుకు సిద్ధమయ్యాయి.