IPL 2024: కోహ్లీనే తక్కువ పరుగులు ఇస్తాడేమో.. బెంగళూరు 11 మంది బ్యాటర్లతో ఆడాలి: క్రిష్
ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరు విజయాలబాట పట్టాలంటే.. జట్టు, ప్రణాళికల్లో మార్పులు అవసరమని భారత మాజీ క్రికెటర్ కీలక సూచనలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో బెంగళూరు బౌలింగ్ను ఊచకోత కోస్తూ ఎస్ఆర్హెచ్ 287/3 స్కోరు చేసింది. భారీగా పరుగులు ఇచ్చిందంటూ ఆర్సీబీ బౌలింగ్ దళంపై తీవ్ర విమర్శలు రేగాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఐపీఎల్లో బెంగళూరు విజయం సాధించాలంటే అందరూ బ్యాటర్లే ఉండాలని.. విరాట్తో బౌలింగ్ చేయిస్తే ఉత్తమమని వ్యాఖ్యానించాడు. ఇప్పుడున్న బౌలర్ల కంటే కోహ్లీ నయమని పేర్కొన్నాడు.
‘‘రీస్ టోప్లీను బాదేశారు.. లాకీ ఫెర్గూసన్ను కూడా హడలెత్తించారు. ఐపీఎల్లో వీరిద్దరూ పెద్దగా ఆకట్టుకోలేదు. కోల్కతా నుంచి బెంగళూరుకు ఫెర్గూసన్ వచ్చినా ప్రయోజనం లేదు. విల్ జాక్స్ మాత్రమే ఇప్పుడున్న వారిలో అత్యుత్తమ బౌలర్. అందుకే, బెంగళూరు మొత్తం 11 మంది బ్యాటర్లతో బరిలోకి దిగడం బెటర్. డుఫ్లెసిస్ రెండు ఓవర్లు, కామెరూన్ గ్రీన్ 4 ఓవర్లు వేయాలి. విరాట్ కూడా కొత్త పాత్ర పోషించాలి. రెగ్యులర్ బౌలర్ల కంటే అతడే తక్కువ పరుగులు ఇస్తాడని భావిస్తున్నా. గతంలోనూ మెరుగ్గానే బౌలింగ్ చేశాడు. కాబట్టి, అతడూ నాలుగు ఓవర్లు వేయాలి. చిన్నస్వామి స్టేడియంలో విరాట్ను చూస్తుంటే చాలా బాధేసింది. బంతి స్టాండ్స్వైపు వెళ్తుంటే కోహ్లీ వాటిని నిరాసక్తిగా చూస్తూ ఉండిపోయాడు. బ్యాటింగ్కు వచ్చినప్పుడు చాలా ఆగ్రహంతో కనిపించాడు. హెడ్, క్లాసెన్, అబ్దుల్ సమద్ తమ బౌలింగ్ను తుత్తునీయలు చేయడంతో తట్టుకోలేకపోయాడు’’ అని శ్రీకాంత్ వ్యాఖ్యానించాడు.
ఐపీఎల్లో బెంగళూరు ఏడు మ్యాచులను ఆడింది. మరో ఏడు ఆడాల్సి ఉంది. కేవలం ఒక్క విజయంతో 2 పాయింట్లు సాధించిన బెంగళూరు పట్టికలో అట్టడుగున ఉంది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ప్రతి మ్యాచ్లోనూ బెంగళూరు విజయం సాధించాల్సిందే. ఒక్కటి ఓడినా దాదాపు నిష్క్రమించినట్లే. ఒకవైపు జట్టు ఓడిపోతున్నా.. వ్యక్తిగతంగా విరాట్ కోహ్లీ మాత్రం అదరగొట్టేస్తున్నాడు. ప్రస్తుతం అతడే ఆరెంజ్ క్యాప్ హోల్డర్. ఏడు మ్యాచుల్లో 361 పరుగులు చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
Paris Olympics 2024: ఒలింపిక్స్ వేడుకలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో జరిగిన పొరపాటుపై నిర్వాహకులు క్షమాపణలు కోరారు. -
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
టెస్టుల్లో సచిన్ తెందూల్కర్ అత్యధిక పరుగుల రికార్డును ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ (Joe Root) బ్రేక్ చేసే అవకాశముందని భారత మాజీ వికెట్కీపర్ దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) అభిప్రాయపడ్డాడు. -
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
Paris Olympics 2024: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో షూటర్లు సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా నిరాశపర్చారు. -
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!