IPL 2024: ఐపీఎల్పై బెంగళూరు నీటి కరవు ఎఫెక్ట్ .. ‘చిన్నస్వామి’కి శుద్ధిచేసిన జలాలు..!
నీటి కరవుతో అల్లాడుతున్న బెంగళూరులో ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణ సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో చిన్నస్వామి స్టేడియంకు నీటి సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది.
ఇంటర్నెట్డెస్క్: బెంగళూరులో ఐపీఎల్ (IPL) మ్యాచ్లకు నీటి కష్టాలు తప్పడంలేదు. ఈ నగరంలోని ప్రజల అవసరాలకే నీరు లభించని వేళ ఐపీఎల్లో భాగంగా నిర్వహించే ఒక్కో మ్యాచ్కు 75,000 లీటర్ల నీటి అవసరం ఉంది. ఈ మేరకు కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ మేనేజ్మెంట్ బోర్డ్ విన్నపంపై ది బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (బీడబ్ల్యూఎస్ఎస్బీ) కీలక నిర్ణయం తీసుకొంది. ఈ నేపథ్యంలో వేస్ట్వాటర్ను శుద్ధి చేసి చిన్నస్వామి స్టేడియంకు సరఫరా చేయాలని నిర్ణయించారు. ఈ నీటిని కబ్బన్ పార్క్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి తీసుకోనున్నారు. దీనిపై బీడబ్ల్యూఎస్ఎస్బీ ఛైర్మన్ రామ్ ప్రసాద్ మనోహర్ మాట్లాడుతూ శుద్ధి చేసిన నీటిని మాత్రమే తాము సరఫరా చేస్తున్నామని సమర్థించుకొన్నారు. కావేరీ నది, భూగర్భ జలాలను వాడటంలేదన్నారు.
ఈ ఏడాది వర్షాభావం, భూగర్భ జలాలు తగ్గిపోవడం, నగరంలో భారీగా నిర్మాణాలు పెరగడంతో నీరు భూమిలోకి చేరే మార్గాలు తగ్గిపోవడం వంటివి బెంగళూరులో నీటి సమస్యకు ప్రధాన కారణాలు. ఫలితంగా నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ ఎరుగని రీతిలో నీటి సంక్షోభాన్ని నగరం ఎదుర్కొంటోంది. వైట్ఫీల్డ్, కేఆర్ పురం, ఎలక్ట్రానిక్స్ సిటీ, ఆర్ఆర్ నగర్, కేంగేరీ, సీవీ రామన్ ప్రాంతాల్లో సమస్య తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో నీటి వినియోగంపై ఓ వైపు ఆంక్షలు విధిస్తోన్న అధికారులు.. పొదుపు మార్గం అనుసరించాలని పౌరులకు సూచిస్తున్నారు.
ఐపీఎల్ టాప్ హీరోలు.. ఈ రికార్డులకు చేరువగా!
ప్రస్తుతం నగరం రోజుకు 50 కోట్ల లీటర్ల నీటి కొరతను ఎదుర్కొంటోందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇటీవలే పేర్కొన్నారు. వాస్తవానికి బెంగళూరు రోజుకు 260 కోట్ల లీటర్ల నీటిని వాడుతుంది. నగరంలో ఉన్న 14,000 బోర్వెల్స్లో 6,900 ఎండిపోయాయి. దీంతో నగరంలో కార్ వాషింగ్, గార్డెన్లకు, నిర్మాణాలకు తాగునీటిని వాడటంపై నిషేధం విధించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి