IPL 2024: ఐపీఎల్ టాప్ హీరోలు.. ఈ రికార్డులకు చేరువగా!
ఐపీఎల్ (IPL) సందడి మొదలుకానుంది. అభిమానులకు క్రికెట్ మజాతోపాటు క్రికెటర్లు తమ వ్యక్తిగత రికార్డులను మెరుగుపర్చుకునేందుకు ఈ టోర్నీ కీలకంగా మారనుంది.
ఈ ఏడాది ఐపీఎల్లో (IPL 2024) ఏయే రికార్డులు బద్ధలవుతాయో ఇప్పుడు చెప్పడం కష్టం. అయితే మన స్టార్ క్రికెటర్లు కొంతమంది కీలక మైలురాళ్లకు దగ్గరలో ఉన్నారు. ఆ వివరాలు మీ కోసం.
- ‘ఆరు’ కొట్టే జట్టులో: టీమ్ఇండియా మాజీ కెప్టెన్, సీఎస్కే సారథి ఎంఎస్ ధోనీ (MS Dhoni) అరుదైన ఘనతకు చేరువగా ఉన్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఆరుసార్లు ట్రోఫీ సాధించిన జట్టు ఏదీ లేదు. సీఎస్కే, ముంబయి ఇండియన్స్ ఐదేసి సార్లు ఛాంపియన్గా నిలిచాయి. రోహిత్ నాయకత్వంలో ముంబయి ఐదుసార్లు విజేతగా నిలిచింది. ఇప్పుడు వీరిద్దరూ ఐపీఎల్ జట్లకు సారథులుగా వ్యవహరించడం లేదు. కానీ, గెలిచిన జట్టులో సభ్యులుగా ఉండే అవకాశం వీరిద్దరికి ఉంది. ఇప్పటికే ఐపీఎల్లో 250 మ్యాచ్లు ఆడిన తొలి ఆటగాడిగా ధోనీ నిలిచాడు. మరో 43 పరుగులు చేస్తే.. సీఎస్కే జట్టు తరఫున 5వేల పరుగులు చేసిన బ్యాటర్గా అవతరిస్తాడు.
- అత్యధిక స్కోరర్గా కోహ్లీయేనా?: మెగా టోర్నీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ (Virat Kohli).. మరో అరుదైన రికార్డుకు చేరువగా ఉన్నాడు. ప్రస్తుతం 237 మ్యాచుల్లో 7,263 పరుగులతో ఉన్న కోహ్లీ.. మరో 737 పరుగులు చేస్తే.. 8 వేలు చేసిన ఏకైక బ్యాటర్గా నిలుస్తాడు. గత 16 సీజన్లలో ఒక్కసారి కూడా ఛాంపియన్గా నిలవలేకపోయిన ఆర్సీబీ ఇప్పుడైనా విజేతగా నిలుస్తుందేమో చూడాలి. అలా గెలిచినా ఇదీ రికార్డు అవుతుంది. కోహ్లీ ఈ సీజన్లో మరో 13 మ్యాచ్లు ఆడితే 250 మ్యాచ్ల్లో పాల్గొన్న క్రికెటర్గా అవతరిస్తాడు.
- 7 వేల క్లబ్లోకి వస్తారా?: ఐపీఎల్లో ధోనీ తర్వాత అత్యంత విజయవంతమైన కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma). ఈసారి ముంబయి జట్టు సారథిగా కాకుండా బ్యాటర్గా బరిలోకి దిగబోతున్నాడు. ఐపీఎల్లో 243 మ్యాచ్లు ఆడిన రోహిత్ 6,211 పరుగులు చేశాడు. మరో 789 పరుగులు చేస్తే 7 వేల క్లబ్లోకి వస్తాడు. అలాగే ఏడు మ్యాచ్లు ఆడితే చాలు 250 మ్యాచ్లు ఆడిన బ్యాటర్ల జాబితాలోకి చేరతాడు. శిఖర్ ధావన్ (6,617), డేవిడ్ వార్నర్ (6,397) కూడా ఈ లిస్ట్లో చేరే అవకాశాలు లేకపోలేదు.
- టీ20ల్లో నంబర్ వన్.. సూర్య: ముంబయి బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (Surya Kumar Yadav) ప్రస్తుతం టీ20ల్లో టాప్ ర్యాంకర్. దాదాపు నెలన్నర తర్వాత మైదానంలోకి దిగబోతున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్లో 139 మ్యాచ్లు ఆడిన సూర్య 3,249 పరుగులు చేశాడు. మరో 751 చేస్తే 4 వేల క్లబ్లోకి వస్తాడు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ (3,888), మనీశ్ పాండే (3,808), జోస్ బట్లర్ (3,223) కూడా నాలుగు వేల పరుగులు జాబితాలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
- ఈసారి సెంచరీలు చేస్తారా?: కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ఇప్పటివరకు 101 మ్యాచ్లు ఆడాడు. అయితే ఒక్క సెంచరీ కూడా చేయలేదు. మొత్తం 2,776 పరుగులు చేసిన అయ్యర్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 96. మరో 224 పరుగులు చేస్తే 3 వేల క్లబ్లోకి చేరతాడు. ఆర్సీబీ బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్వెల్ మరో 281 పరుగులు చేస్తే 3 వేల పరుగులు చేసిన బ్యాటర్గా మారతాడు. ఇతడి అత్యధిక స్కోరు కూడా 95 కావడం విశేషం.
- చాహల్.. 200 వికెట్లు తీస్తాడా?: ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ యుజ్వేంద్ర చాహల్ (Chahal). ఇప్పటివరకు 145 మ్యాచుల్లో 187 వికెట్లు పడగొట్టాడు. మరో 13 తీస్తే 200 క్లబ్లోకి వస్తాడు. ద్విశతక వికెట్లు సాధించిన ఏకైక బౌలర్గా అవతరిస్తాడు. స్టార్ పేసర్ బుమ్రా మరో ఐదు వికెట్లు తీస్తే 150 పడగొట్టిన బౌలర్గా మారతాడు. ప్రస్తుతం బుమ్రా 120 మ్యాచుల్లో 145 వికెట్లు తీశాడు. గుజరాత్ స్పిన్నర్ రషీద్ ఖాన్ కూడా 150కి 11 వికెట్ల దూరంలో ఉన్నాడు.
- డాట్ బాల్స్లో పోటాపోటీ..: ఎక్కువ డాట్బాల్స్ వేసిన బౌలర్ భువనేశ్వర్ కుమార్ (Bhuvneswar Kumar). ఇప్పటివరకు 160 మ్యాచుల్లో 1,534 బంతులను డాట్లుగా వేశాడు. ఆ తర్వాత సునీల్ నరైన్ (1,478), రవిచంద్రన్ అశ్విన్ (1,477) ఉన్నారు. మరో 25 బంతులను డాట్లుగా వేస్తే 1500+ జాబితాలో చేరతారు. ఆ ఘనత సాధించిన ముగ్గురు బౌలర్లుగా మారతారు. అలాగే భువీ 12 మెయిడిన్ ఓవర్లు విసిరాడు. ఈ జాబితాలో మాజీ పేసర్ ప్రవీణ్ కుమార్ టాప్. అతడు 14 మెయిడిన్లు చేశాడు. భువనేశ్వర్ మరో 3 ఓవర్లలో పరుగులేమీ ఇవ్వకపోతే అగ్రస్థానంలోకి వస్తాడు.
- మరో 4 క్యాచ్లు పడితే..: ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అత్యధిక క్యాచ్లు అందుకొన్న ప్లేయర్గా అవతరించాలంటే మరో నాలుగు అందుకోవాలి. ప్రస్తుతం ఈ రికార్డు సురేశ్ రైనా (Suresh Raina) పేరిట ఉంది. 205 మ్యాచుల్లో 109 క్యాచ్లు పట్టాడు. విరాట్ (106), కీరన్ పొలార్డ్ (103) ఉండగా.. రోహిత్ శర్మ (98), రవీంద్ర జడేజా (97), ధావన్ (96) సెంచరీకి చేరువగా ఉన్నారు.
- ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
తాజా వార్తలు (Latest News)
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్