Bengaluru Vs Rajasthan: మా స్పెషాలిటీ చూపించలేకపోయాం.. ‘ఇంపాక్ట్’ రూల్తో ఆ స్కోరు సరిపోదు: డుప్లెసిస్
Bengaluru Vs Rajasthan: కీలక ఎలిమినేటర్లో రాజస్థాన్ చేతిలో బెంగళూరు ఓటమిపాలై టోర్నీ నుంచి బయటకొచ్చింది. ఈ సందర్భంగా తమ ప్లేయర్ల ఆటతీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన కెప్టెన్ డుప్లెసిస్ మరో 20 పరుగులు చేసుండాల్సిందని అభిప్రాయపడ్డాడు.
అహ్మదాబాద్: ఐపీఎల్-17లో బెంగళూరు కథ ముగిసింది. ఎలిమినేటర్లో రాజస్థాన్ టీమ్ చేతిలో ఓటమి చవిచూసింది. ‘‘ఈసారి కప్ మనదే’’ అన్న ఆ జట్టు అభిమానులకు మళ్లీ నిరాశే మిగిలింది. పరాజయంపై ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డెప్లెసిస్ (Faf du Plessis) స్పందించాడు. విజయం కోసం మరికొన్ని పరుగులు చేసుండాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఏదేమైనా తమ జట్టు గొప్ప పోరాట పటిమను ప్రదర్శించిందని ఆటగాళ్లను కొనియాడాడు.
‘‘పిచ్పై మంచు ప్రభావం ఉండటంతో.. మరికొన్ని పరుగులు చేసుండాల్సిందని అనుకున్నాం. మంచి స్కోరుకు 20 పరుగుల దూరంలో ఆగిపోయినట్లు అనిపించింది. మా టీమ్ అద్భుతంగా పోరాడింది. పిచ్ను పరిశీలిస్తే ఎవరైనా దీంట్లో 180 మంచి స్కోరని అంచనా వేస్తారు. కానీ, ఇంపాక్ట్ ప్లేయర్ వంటి మార్పుల నేపథ్యంలో ఈ సీజన్లో సాధారణ స్కోర్తో సరిపెట్టుకుంటే కుదరదు. అయినప్పటికీ మా ప్లేయర్ల పట్ల నాకు చాలా గర్వంగా ఉంది. వరుసగా ఆరు విజయాలు అంత సులభమైన విషయం కాదు. అంతలా పుంజుకోవాలంటే చాలా శ్రమించాల్సి ఉంటుంది. కానీ, మరో 20 పరుగులు చేయడంలో మాత్రం ఈరోజు మా ప్రత్యేకతను నిలబెట్టుకోలేకపోయాం’’ అని మ్యాచ్ అనంతరం డుప్లెసిస్ అన్నాడు.
దినేశ్ కార్తిక్..ఆ ఎల్బీ నాటౌటా?
టీమ్లో అందరూ ఫిట్గా లేరు: సంజూ
తమ ప్లేయర్లలో కొంత మంది పూర్తి ఫిట్నెస్తో లేరని రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ (Sanju Samson) తెలిపాడు. బెంగళూరుపై గెలుపుతో వారంతా తిరిగి ఫామ్లోకి వచ్చారని వెల్లడించాడు. ‘‘అన్ని రోజులూ ఒకేలా ఉండవని క్రికెట్తో పాటు జీవితం మాకు నేర్పింది. తిరిగి పుంజుకోవడం చాలా ముఖ్యం. మా ఆటతీరుపై నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ ఘనత ప్లేయర్లకే దక్కుతుంది. కుమార సంగక్కర, సపోర్టింగ్ స్టాఫ్ సహకారం మరువలేనిది. అశ్విన్, ఆవేశ్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. బ్యాటింగ్లో అంతా యువకులే అయినప్పటికీ గొప్పగా ఆడారు. మాలో అందరూ ఫిట్గా లేరు. డ్రెస్సింగ్ రూమ్లో కొంత మంది దగ్గుతూ, ఇబ్బంది పడ్డారు. కానీ, ఇప్పుడు అందరం పుంజుకున్నాం’’ అని శాంసన్ వెల్లడించాడు.
మ్యాచ్ విషయానికి వస్తే కీలక ఎలిమినేటర్లో రాజస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దూకుడుగానే ఆట ప్రారంభించిన బెంగళూరు ప్లేయర్లు భారీ స్కోర్ చేయడంలో మాత్రం విఫలమయ్యారు. 20 ఓవర్లలో 8 వికెట్లకు 172 పరుగులు చేసింది. రజత్ పటీదార్ (34), విరాట్ (33), మహిపాల్ లొమ్రార్ (32) ఫర్వాలేదనిపించారు. అశ్విన్ (2/19), అవేష్ ఖాన్ (3/44), బౌల్ట్ (1/16) ప్రత్యర్థిని కట్టడి చేశారు. ఛేదనలో రాజస్థాన్ 6 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. యశస్వి జైస్వాల్ (45), రియాన్ పరాగ్ (36) రాణించారు. సిరాజ్ (2/33) మెరిశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు