IPL 2024: సంబరాల్లో బెంగళూరు.. ధోనీతో కరచాలనం చేసేందుకూ సమయం లేదా?: మాజీలు
ఉత్కంఠ పరిస్థితుల్లో ప్లేఆఫ్స్కు చేరుకున్న బెంగళూరు ఆటగాళ్లు సంబరాలు ఆకాశాన్నంటాయి. ఈ క్రమంలో చెన్నై ప్లేయర్లతో కరచాలనం చేసేందుకు కాస్త సమయం తీసుకోవడం చర్చనీయాంశమైంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2024 సీజన్లో సంచలన విజయంతో బెంగళూరు ప్లేఆఫ్స్కు చేరుకుంది. చివరి ఓవర్లో 18 పరుగులు చేస్తే చెన్నై నాకౌట్కు వెళ్లే అవకాశం ఉంది. కానీ ఆర్సీబీ బౌలర్ యశ్ దయాళ్ ఏడు పరుగులే ఇచ్చి ఎంఎస్ ధోనీ (MS Dhoni) వికెట్ను తీశాడు. దీంతో సంబరాల్లో మునిగిపోయిన బెంగళూరు ఆటగాళ్లు.. చెన్నై ప్లేయర్లతో కరచాలనం చేసేందుకూ కాస్త సమయం తీసుకున్నారు. మ్యాచ్ ముగిసిన తర్వాత ధోనీ మైదానంలోకి వచ్చి వారి కోసం వేచి చూశాడు. అయితే, ఎంతకూ రాకపోవడంతో అక్కడున్న వారికి షేక్హ్యాండ్ ఇచ్చి డగౌట్కు వెళ్లిపోయాడు. దీంతో సోషల్ మీడియాలో ఎంఎస్డీ తీరును ప్రశ్నిస్తూ కొందరు కామెంట్లు చేశారు. ఆ తర్వాత ధోనీ వద్దకు విరాట్ వెళ్లినట్లు వీడియోలు ట్రెండింగ్గా మారాయి. అయితే, ఈ విషయంలో ఆర్సీబీ ఆటగాళ్లు సంబరాలను కాసేపు పక్కన పెట్టి కరచాలనం ఇచ్చేందుకు వెళ్లి ఉంటే బాగుండేదని మాజీ క్రికెటర్ మైకెల్ వాన్తోపాటు క్రికెట్ విశ్లేషకుడు హర్షా భోగ్లే వ్యాఖ్యానించారు.
‘‘నేను మ్యాచ్ అయిన తర్వాత కూడా అంతా చూశా. ఆర్సీబీ జట్టు చాలా ఎంజాయ్ చేసింది. అభిమానులకు చేతులు ఊపుతూ సంతోషించారు. ఇప్పుడేమీ వారు ఐపీఎల్ టైటిల్ను గెలిచిన స్థితిలో లేరు. కానీ, ప్లేఆఫ్స్కు అర్హత సాధించడంతో ముందుడుగు వేసినట్లు ఆనందపడ్డారు. టోర్నీ నుంచి దాదాపు నిష్క్రమించే ప్రమాదం నుంచి బయపడటంతో సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. కానీ, ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లతో కరచాలనం చేసే సమయం కూడా లేనట్లుంది. ఇప్పుడు వారు చేసిన దానికి పశ్చాత్తాప పడతారా? ధోనీకిదే చివరి మ్యాచ్ అయ్యేదేమో? ఎవరికి తెలుసు. ఆటగాళ్లందరూ అతడి చుట్టూ చేరి ఒక్కక్షణం కరచాలనం చేసి ఉంటే బాగుండేది. అక్కడ దిగ్గజ క్రికెటర్ మీ కోసం వేచి చూశాడు. ఒక్కసారి అతడిని కలిశాక.. మీ సంబరాలు చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది. అయితే, ఆర్సీబీ ప్లేయర్గా మీరు అతడి వీడ్కోలును కోరుకోకపోయినా.. కనీసం మ్యాచ్ ముగిసిన తర్వాత గౌరవార్థం కరచాలనం చేసి ఉన్నా మర్యాదగా ఉండేది’’ అని మైకెల్ వాన్ వ్యాఖ్యానించాడు.
ఎలాంటి సందర్భమైనా కరచాలనం చేయాల్సిందే: భోగ్లే
‘‘నేను అక్కడ ఏం జరిగిందో గమనించలేదు. కానీ, మీరు వరల్డ్ కప్ ఫైనల్లో విజేతగా నిలిచినా సరే.. మీ భావోద్వేగాలను ప్రదర్శించడంలో తప్పేంలేదు. కానీ, ప్రత్యర్థి ఆటగాళ్లతో మర్యాదపూర్వకంగా కరచాలనం చేయాలి. క్రికెట్ గొప్పదనాన్ని తెలిపేందుకు ఇదొక మార్గం. మ్యాచ్లోనే పోరాడుతాం.. మేం విరోధులం కాదు అని తెలియజేసేందుకే ఈ కరచాలనం సంస్కృతిని తీసుకొచ్చారు. ఒక్కసారి ఆ ప్రక్రియ ముగిసిన తర్వాత మీ సంబరాలను ఎంతసేపైనా నిర్వహించుకోవచ్చు’’ అని భోగ్లే తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
Paris Olympics 2024: ఒలింపిక్స్ వేడుకలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో జరిగిన పొరపాటుపై నిర్వాహకులు క్షమాపణలు కోరారు. -
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
టెస్టుల్లో సచిన్ తెందూల్కర్ అత్యధిక పరుగుల రికార్డును ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ (Joe Root) బ్రేక్ చేసే అవకాశముందని భారత మాజీ వికెట్కీపర్ దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) అభిప్రాయపడ్డాడు. -
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
Paris Olympics 2024: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో షూటర్లు సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా నిరాశపర్చారు. -
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్