ఐపీఎల్ 2024: చెలరేగిన కోహ్లీ.. ఖాతా తెరిచిన బెంగళూరు
పంజాబ్తో జరిగిన మ్యాచ్లో బెంగళూరు 4 వికెట్ల తేడా గెలిచి బోణీ కొట్టింది. విరాట్ కోహ్లీ (77: 49 బంతుల్లో) అర్ధశతకంతో చెలరేగగా, చివర్లో డీకే(28), లామ్రోర్ (17*) జట్టును విజయతీరాలకు చేర్చారు.
బెంగళూరు:ఐపీఎల్ (IPL 2024) 17వ సీజన్లో బెంగళూరు (Bengaluru) ఖాతా తెరిచింది. పంజాబ్ (Punjab)తో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 4 వికెట్ల తేడాతో గెలిచింది. 177 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన బెంగళూరు 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విరాట్ కోహ్లీ (77; 49 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్లు) చెలరేగి ఆడాడు. చివర్లో కాస్త ఉత్కంఠ ఏర్పడినా.. దినేశ్ కార్తిక్ (28*; 10 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లు), మహిపాల్ లామ్రోర్ (17*; 8 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడి నాలుగు బంతులు మిగిలుండగానే బెంగళూరును విజయతీరాలకు చేర్చారు. పంజాబ్ బౌలర్లలో కగిసో రబాడ 2, హర్ప్రీత్ బ్రార్ 2, హర్షల్ పటేల్, సామ్ కరన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
కింగ్ మెరుపులు.. చివర్లో ఉత్కంఠ
177 పరుగుల లక్ష్యఛేదనలో డుప్లెసిస్ (3), కామెరూన్ గ్రీన్ (3), మ్యాక్స్వెల్ (3) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. కానీ, విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. రెండుసార్లు జీవదానం లభించిన తర్వాత మరింత చెలరేగాడు. అతడు 31 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. సెంచరీ చేసేలా కనిపించిన కోహ్లీ.. హర్షల్ పటేల్ వేసిన 16 ఓవర్లో రెండు ఫోర్లు బాది అదే ఓవర్లో చివరి బంతికి హర్ప్రీత్ బ్రార్కు చిక్కాడు. సామ్ కరన్ వేసిన తర్వాతి ఓవర్లోనే అనుజ్ రావత్ (11) ఔటయ్యాడు. దీంతో బెంగళూరు శిబిరంలో ఆందోళన మొదలైంది. చివరి రెండు ఓవర్లలో 23 పరుగులు అవసరం కాగా.. అర్ష్దీప్ వేసిన 18 ఓవర్లో మహిపాల్ లామ్రోర్ వరుసగా సిక్స్, ఫోర్ బాదాడు. హర్షల్ పటేల్ వేసిన 19 ఓవర్లో దినేశ్ కార్తిక్ ఫోర్, సిక్స్ రాబట్టాడు. దీంతో విజయ సమీకరణం 6 బంతుల్లో 10గా మారగా.. సిక్స్, ఫోర్తో కార్తిక్ ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. కెప్టెన్ శిఖర్ ధావన్ (45: 37 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. ప్రభ్సిమ్రాన్ (25), జితేశ్ శర్మ (27), సామ్ కరన్ (23), శశాంక్ సింగ్ (21) విలువైన పరుగులు చేశారు. బెంగళూరు బౌలర్లలో సిరాజ్, మ్యాక్స్వెల్ తలో రెండు వికెట్లు తీయగా.. యశ్ దయాల్, అల్జారీ జోసెఫ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?