Mumbai Indians: హార్దిక్.. అంత వీజీ కాదు
గత రెండు సీజన్లలో గుజరాత్ టైటాన్స్కు కెప్టెన్గా ఉన్న హార్దిక్ పాండ్య (Hardik Pandya) తిరిగి ముంబయి ఇండియన్స్కు చేరుకుని కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు.
గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ (IPL)లోకి అడుగుపెట్టిన తొలి సీజన్లోనే విజేతగా నిలిచింది. జట్టు అంత గొప్పగా కనిపించకపోయినా.. నిలకడైన ప్రదర్శనతో టైటిల్ గెలిచింది. రెండో సీజన్లోనూ ఫైనల్ చేరి రన్నరప్ అయింది. ఈ ప్రదర్శన వెనక హార్దిక్ పాండ్య (Hardik Pandya) స్ఫూర్తివంతమైన నాయకత్వం ఉందనడంలో సందేహం లేదు. ఆటగాడిగా బ్యాటుతో, బంతితో రాణించడమే కాక.. కెప్టెన్గా జట్టును సమష్టిగా నడిపించి గుజరాత్ను గొప్పస్థాయిలో నిలబెట్టాడు హార్దిక్. కానీ అంతా సాఫీగా సాగిపోతున్న సమయంలో అతను గుజరాత్ను వదిలేసి ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) గూటికి వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. పట్టుబట్టి ముంబయి కెప్టెన్ అయ్యాడు కానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ జట్టును నడిపించడం అతడికి కఠిన సవాలు కాబోతోంది.
గుజరాత్ జట్టును రెండేళ్ల పాటు ఎంత బాగా నడిపించినా.. అక్కడంతా బాగానే ఉన్నా.. తన మాతృ జట్టయిన ముంబయి వైపే హార్దిక్ మనసు లాగింది. 2022 సీజన్కు తనను అట్టిపెట్టుకోకపోవడం రుచించక వేలానికి వెళ్లి గుజరాత్ సొంతమైన హార్దిక్.. కెప్టెన్గా అందరూ ఆశ్చర్యపోయే రీతిలో గుజరాత్ను నడిపించాడు. కొన్నేళ్ల పాటు గుజరాత్తోనే అతడి ప్రయాణం సాగుతుందని అనుకుంటే.. ఉన్నట్లుండి ఈ సీజన్ ముంగిట ముంబయి యాజమాన్యంతో సంప్రదింపులు జరిపి ఆ జట్టు కెప్టెన్ అయిపోయాడు హార్దిక్. ఇది ఎవరూ ఊహించని పరిణామం. కెప్టెన్సీ ఇస్తేనే ముంబయితో కలుస్తాననే ప్రపోజల్ పెట్టి మరీ హార్దిక్ ఆ జట్టులోకి వచ్చినట్లు వార్తలు వచ్చాయి. రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ను సారథిని చేయడం ముంబయి అభిమానులకు రుచించలేదు. కానీ గత రెండు సీజన్లలో ముంబయి పేలవ ప్రదర్శన చేయడం, రోహిత్ కెరీర్ చరమాంకానికి రావడంతో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముంబయి హార్దిక్కే పగ్గాలు అప్పగించింది.
సమన్వయం సాధిస్తాడా?
హార్దిక్ పాండ్యకు ముంబయి జట్టు కొత్త కాదు. ఆరేళ్ల పాటు ఆ జట్టుకు ఆడాడు. అక్కడి సహచరులు, కోచింగ్ సిబ్బంది అతడికి బాగా అలవాటే. కానీ ఇంతకుముందు ఆటగాడిగా ఆ జట్టుకు ఆడటం వేరు. ఇప్పుడు కెప్టెన్గా జట్టుతో సాగడం వేరు. కెప్టెన్గా జట్టుకు అయిదు ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మను తప్పించి హార్దిక్కు పగ్గాలు అందించడం ముంబయి సహచరులకే రుచించలేదు. హార్దిక్ను కెప్టెన్గా ప్రకటించిన సమయంలో జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ లాంటి స్టార్ ఆటగాళ్లు తమ అసంతృప్తిని సోషల్ మీడియా ద్వారా చెప్పకనే చెప్పేశారు. రోహిత్ సైతం ఈ విషయంలో తీవ్ర అసంతృప్తికి గురైనట్లు వార్తలు వచ్చాయి. ఈనేపథ్యంలో మెజారిటీ జట్టు హార్దిక్ను కెప్టెన్గా అంగీకరించట్లేదన్న చర్చ జరిగింది. సహచరుల మద్దతు లేకుండా కెప్టెన్ అయిన హార్దిక్కు వారితో సమన్వయం సాధించి సమష్టిగా జట్టును నడిపించడం సవాలే. ముఖ్యంగా రోహిత్తో అతనెలా డీల్ చేస్తాడన్నది ఆసక్తికరం. రోహిత్ తర్వాత తమకు పగ్గాలు అందుతాయని సూర్యకుమార్, బుమ్రా లాంటి వాళ్లు కూడా ఆశలు పెట్టుకుని ఉండొచ్చు. అలాంటి వారి అసంతృప్తిని చల్లార్చాలి. మరోవైపు కొన్నేళ్లుగా ముంబయి ప్రదర్శన ఆశాజనకంగా లేదు. మలింగ, పొలార్డ్ లాంటి ఆటగాళ్లు ఫామ్ కోల్పోయి జట్టుకు దూరమయ్యాక సమతూకం దెబ్బతింది. ఈసారి తుది జట్టు కూర్పులోనూ నేర్పుగా వ్యవహరించాలి. ఈనేపథ్యంలో జట్టులో సమన్వయం సాధించి సమష్టిగా సత్తా చాటేలా చేయడమే కాక.. ఆటగాడిగా తాను రాణించి జట్టులో స్ఫూర్తి నింపడం హార్దిక్కు అంత తేలికైన విషయం కాదు. మరి ఈ సవాలును అతనెలా అధిగమిస్తాడో చూడాలి.
అభిమానుల సంగతేంటి?
రోహిత్ను కెప్టెన్గా తప్పించడంతో ముంబయి జట్టుకు జరిగిన డ్యామేజీ అంతాఇంతా కాదు. కొన్ని రోజుల వ్యవధిలో సోషల్ మీడియాలో లక్షల మంది ఆ జట్టును అన్ఫాలో చేశారు. ఇప్పటికీ వారి అసంతృప్తి చల్లారట్లేదు. హార్దిక్ కింద రోహిత్ ఆడడాన్ని వాళ్లు అసలు ఊహించుకోలేకపోతున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ముంబయి యాజమాన్యం ఇంకొంచెం పద్ధతిగా డీల్ చేసి ఉండాల్సిందన్న అభిప్రాయం వ్యక్తమైంది. జట్టుకు అయిదు కప్పులు అందించిన రోహిత్ పై ముంబయి యాజమాన్యం అవమానకరంగా వ్యవహరించిందని అభిమానులు బాధ పడుతున్నారు. రోహిత్ కెప్టెన్గా లేని ముంబయిని వాళ్లు ఓన్ చేసుకోలేకపోతున్నారు. ఫలితాలతో సంబంధం లేకుండా గత సీజన్ వరకు లీగ్లో అత్యంత ఆదరణ ఉన్న జట్లలో ఒకటిగా ఉండేది ముంబయి. కానీ ఇప్పుడు ఫాలోయింగ్ బాగా దెబ్బతింది. ఆటగాడిగా రోహిత్ జట్టులో కలిసిపోయి హార్దిక్తో స్నేహపూర్వకంగా ఉంటే.. కెప్టెన్సీ మార్పు సామరస్యపూర్వకంగానే జరిగిందని చెబితే.. అభిమానులు ముంబయికి బాసటగా నిలవాలని కోరితే తప్ప ఒకప్పట్లా ఆ జట్టును ఆదరించడం కష్టమే.
- ఈనాడు క్రీడావిభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు