World Cup: ప్రపంచకప్లో మేటి జట్లను కంగుతినిపించిన చిన్న జట్లు..
ప్రపంచకప్లో ఇంగ్లాండ్ (England)కు గట్టి షాక్. పసికూన అఫ్గానిస్థాన్ చేతిలో ఓ జట్టు ఓటమిపాలైంది. గతంలోనూ పెద్ద జట్లు చిన్న టీమ్ల చేతిలో ఓడిన సందర్భాలున్నాయి. వాటిపై లుక్కేద్దాం.
ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్లో కొన్నిసార్లు అసాధ్యాలు సుసాధ్యం అవుతాయి. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన జట్లూ మేటి జట్లకు షాకిస్తాయి. ప్రస్తుతం జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో అదే జరిగింది. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన ఇంగ్లాండ్ (England)ను ఇప్పుడిప్పుడే బలమైన జట్టుగా ఎదుగుతున్న అఫ్గానిస్థాన్ (Afghanistan) చిత్తుగా ఓడించింది. దీంతో వన్డే ప్రపంచకప్ (World Cup)లో.. టెస్టులు ఆడే 11 దేశాలతో ఓటమిపాలైన తొలి జట్టుగా ఇంగ్లిష్ జట్టు అనవసరపు రికార్డును మూటగట్టుకుంది. మరి ప్రపంచకప్లో ఇప్పటివరకు పెద్ద జట్లను కంగుతినిపించిన చిన్న టీమ్ల గురించి తెలుసుకుందాం.
మొదటి దెబ్బ మనదే
ప్రపంచకప్ చరిత్రలో పెద్ద జట్టును ఓడించిన మొదటి జట్టు టీమ్ఇండియా (Team India)నే. 1983లో విశ్వవిజేతగా నిలిచిన భారత్.. ఆ సీజన్లో అండర్డాగ్స్గా బరిలోకి దిగింది. వెస్టిండీస్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలతో పోలిస్తే మన జట్టు బలహీనంగానే ఉంది. వరుసగా రెండుసార్లు ప్రపంచకప్ను సొంతం చేసుకుని ‘హ్యాట్రిక్’పై కన్నేసిన వెస్టిండీస్కు భారత్ షాక్ ఇచ్చింది. గ్రూప్ దశలో విండీస్తో రెండుసార్లు తలపడగా.. మొదటి మ్యాచ్లో భారత్ 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. మరో మ్యాచ్లో మాత్రం విండీస్ 66 పరుగుల తేడాతో గెలుపొందింది. అదే ఎడిషన్ తొలి సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్ను భారత్ 6 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఫైనల్లో వెస్టిండీస్, భారత్ మరోసారి తలపడగా.. భారత్ 43 పరుగుల తేడాతో జయకేతనం ఎగరేసి తొలి ప్రపంచకప్ను ఎగరేసుకుపోయింది.
ఆసీస్కు జింబాబ్వే షాక్
1983లోనే మరో సంచలన విజయం నమోదైంది. పసికూన జింబాబ్వే.. బలమైన ఆస్ట్రేలియాను మట్టికరిపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 60 ఓవర్లలో (అప్పట్లో 60 ఓవర్ల మ్యాచ్ నిర్వహించేవారు) 6 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది.
అనంతరం ఆసీస్ను 226/7కే పరిమితం చేసి చారిత్రాక విజయాన్ని అందుకుంది.
అనామక జట్టు.. విండీస్ చిత్తు..
1996 ప్రపంచకప్లో వెస్టిండీస్ను ఓడించి కెన్యా సంచలనం సృష్టించింది. పుణె వేదికగా జరిగిన మ్యాచ్లో కెన్యా 73 పరుగుల తేడాతో వెస్టిండీస్ను చిత్తుగా ఓడించింది. ప్రపంచకప్ చరిత్రలో టెస్టు హోదా ఉన్న జట్టును నాన్ టెస్టు టీమ్ ఓడించడం ఇదే తొలిసారి. తొలుత బ్యాటింగ్ చేసిన కెన్యా 49.3 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌట్ కాగా.. లక్ష్యఛేదనలో వెస్టిండీస్ 93 పరుగులకే కుప్పకూలింది.
పాక్, భారత్పై
1996 ప్రపంచకప్లో తన కంటే బలమైన పాకిస్థాన్ జట్టును బంగ్లాదేశ్ కంగుతినిపించింది. మొదట బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేయగా.. బంగ్లా బౌలర్ల ధాటికి పాక్ 161 పరుగులకే చేతులేత్తేసింది. బంగ్లాదేశ్.. 2007లో టీమ్ఇండియాకూ షాకిచ్చింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో బంగ్లా ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 49.3 ఓవర్లలో 191 పరుగులకు ఆలౌటైంది. సౌరభ్ గంగూలీ (66), యువరాజ్ సింగ్ (47) మాత్రమే రాణించారు. ఈ లక్ష్యాన్ని బంగ్లా 9 బంతులు మిగిలుండగా ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
దంచికొట్టినా.. ఐర్లాండ్ వదల్లేదు
2011 ప్రపంచకప్లో ఇంగ్లాండ్పై ఐర్లాండ్ సంచలన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యాన్ని ఐర్లాండ్ ఎనిమిది వికెట్లు కోల్పోయి ఐదు బంతులు మిగిలుండగానే ఛేదించింది. కెవిన్ ఓబ్రియన్ (113; 63 బంతుల్లో 13 ఫోర్లు, 6 సిక్స్లు) మెరుపు శతకం బాదాడు. అతడు 50 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకుని రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా ఆటగాడు మార్క్రమ్ శ్రీలంకపై 49 బంతుల్లో సెంచరీ చేసే వరకు ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు అతడి పేరు మీదే ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!