World Cup: ప్రపంచకప్లో మేటి జట్లను కంగుతినిపించిన చిన్న జట్లు..
ప్రపంచకప్లో ఇంగ్లాండ్ (England)కు గట్టి షాక్. పసికూన అఫ్గానిస్థాన్ చేతిలో ఓ జట్టు ఓటమిపాలైంది. గతంలోనూ పెద్ద జట్లు చిన్న టీమ్ల చేతిలో ఓడిన సందర్భాలున్నాయి. వాటిపై లుక్కేద్దాం.
ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్లో కొన్నిసార్లు అసాధ్యాలు సుసాధ్యం అవుతాయి. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన జట్లూ మేటి జట్లకు షాకిస్తాయి. ప్రస్తుతం జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో అదే జరిగింది. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన ఇంగ్లాండ్ (England)ను ఇప్పుడిప్పుడే బలమైన జట్టుగా ఎదుగుతున్న అఫ్గానిస్థాన్ (Afghanistan) చిత్తుగా ఓడించింది. దీంతో వన్డే ప్రపంచకప్ (World Cup)లో.. టెస్టులు ఆడే 11 దేశాలతో ఓటమిపాలైన తొలి జట్టుగా ఇంగ్లిష్ జట్టు అనవసరపు రికార్డును మూటగట్టుకుంది. మరి ప్రపంచకప్లో ఇప్పటివరకు పెద్ద జట్లను కంగుతినిపించిన చిన్న టీమ్ల గురించి తెలుసుకుందాం.
మొదటి దెబ్బ మనదే
ప్రపంచకప్ చరిత్రలో పెద్ద జట్టును ఓడించిన మొదటి జట్టు టీమ్ఇండియా (Team India)నే. 1983లో విశ్వవిజేతగా నిలిచిన భారత్.. ఆ సీజన్లో అండర్డాగ్స్గా బరిలోకి దిగింది. వెస్టిండీస్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలతో పోలిస్తే మన జట్టు బలహీనంగానే ఉంది. వరుసగా రెండుసార్లు ప్రపంచకప్ను సొంతం చేసుకుని ‘హ్యాట్రిక్’పై కన్నేసిన వెస్టిండీస్కు భారత్ షాక్ ఇచ్చింది. గ్రూప్ దశలో విండీస్తో రెండుసార్లు తలపడగా.. మొదటి మ్యాచ్లో భారత్ 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. మరో మ్యాచ్లో మాత్రం విండీస్ 66 పరుగుల తేడాతో గెలుపొందింది. అదే ఎడిషన్ తొలి సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్ను భారత్ 6 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఫైనల్లో వెస్టిండీస్, భారత్ మరోసారి తలపడగా.. భారత్ 43 పరుగుల తేడాతో జయకేతనం ఎగరేసి తొలి ప్రపంచకప్ను ఎగరేసుకుపోయింది.
ఆసీస్కు జింబాబ్వే షాక్
1983లోనే మరో సంచలన విజయం నమోదైంది. పసికూన జింబాబ్వే.. బలమైన ఆస్ట్రేలియాను మట్టికరిపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 60 ఓవర్లలో (అప్పట్లో 60 ఓవర్ల మ్యాచ్ నిర్వహించేవారు) 6 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది.
అనంతరం ఆసీస్ను 226/7కే పరిమితం చేసి చారిత్రాక విజయాన్ని అందుకుంది.
అనామక జట్టు.. విండీస్ చిత్తు..
1996 ప్రపంచకప్లో వెస్టిండీస్ను ఓడించి కెన్యా సంచలనం సృష్టించింది. పుణె వేదికగా జరిగిన మ్యాచ్లో కెన్యా 73 పరుగుల తేడాతో వెస్టిండీస్ను చిత్తుగా ఓడించింది. ప్రపంచకప్ చరిత్రలో టెస్టు హోదా ఉన్న జట్టును నాన్ టెస్టు టీమ్ ఓడించడం ఇదే తొలిసారి. తొలుత బ్యాటింగ్ చేసిన కెన్యా 49.3 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌట్ కాగా.. లక్ష్యఛేదనలో వెస్టిండీస్ 93 పరుగులకే కుప్పకూలింది.
పాక్, భారత్పై
1996 ప్రపంచకప్లో తన కంటే బలమైన పాకిస్థాన్ జట్టును బంగ్లాదేశ్ కంగుతినిపించింది. మొదట బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేయగా.. బంగ్లా బౌలర్ల ధాటికి పాక్ 161 పరుగులకే చేతులేత్తేసింది. బంగ్లాదేశ్.. 2007లో టీమ్ఇండియాకూ షాకిచ్చింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో బంగ్లా ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 49.3 ఓవర్లలో 191 పరుగులకు ఆలౌటైంది. సౌరభ్ గంగూలీ (66), యువరాజ్ సింగ్ (47) మాత్రమే రాణించారు. ఈ లక్ష్యాన్ని బంగ్లా 9 బంతులు మిగిలుండగా ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
దంచికొట్టినా.. ఐర్లాండ్ వదల్లేదు
2011 ప్రపంచకప్లో ఇంగ్లాండ్పై ఐర్లాండ్ సంచలన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యాన్ని ఐర్లాండ్ ఎనిమిది వికెట్లు కోల్పోయి ఐదు బంతులు మిగిలుండగానే ఛేదించింది. కెవిన్ ఓబ్రియన్ (113; 63 బంతుల్లో 13 ఫోర్లు, 6 సిక్స్లు) మెరుపు శతకం బాదాడు. అతడు 50 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకుని రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా ఆటగాడు మార్క్రమ్ శ్రీలంకపై 49 బంతుల్లో సెంచరీ చేసే వరకు ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు అతడి పేరు మీదే ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు