IND vs AUS: 32 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్
ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానున్న బోర్డర్-గావస్కర్ ట్రోఫీని ఐదు టెస్టుల సిరీస్గా నిర్వహించనున్నారు.
ఇంటర్నెట్ డెస్క్ : ఆస్ట్రేలియా-భారత్ల మధ్య ఎంతో ప్రతిష్ఠాత్మక సిరీస్ బోర్డర్ గావస్కర్ ట్రోఫీ. ఈ ఏడాది చివర్లో జరగనున్న ఈ సిరీస్లో మార్పు చోటుచేసుకుంది. ఐదు టెస్టుల సిరీస్గా దీన్ని నిర్వహించనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు తాజాగా ప్రకటించింది. ఇప్పటివరకూ ఎక్కువగా నాలుగు టెస్టుల సిరీస్గా దీన్ని నిర్వహించారు. ఇలా రెండు జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ నిర్వహించడం 32 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.
‘‘1991-92 తర్వాత తొలిసారి భారత్-ఆస్ట్రేలియా ఐదు టెస్టుల సిరీస్లో తలపడనున్నాయి. పొడిగించిన బోర్డర్ గావస్కర్ ట్రోఫీ షెడ్యూల్ను త్వరలోనే విడుదల చేస్తాం’ అని క్రికెట్ ఆస్ట్రేలియా, బీసీసీఐ సంయుక్తగా ఎక్స్లో పోస్టు చేశాయి.
ఈ ఏడాది నవంబర్లో బోర్డర్ గావస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. పెర్త్లో తొలి టెస్టు జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత రెండు మ్యాచ్లకు ఆడిలైడ్, బ్రిస్బేన్లు వేదికలు కానున్నట్లు సమాచారం. బాక్సింగ్ డే టెస్టు మెల్బోర్న్ వేదికగా.. చివరి టెస్టు సిడ్నీలో జరిగే అవకాశం ఉన్నట్లు ఆస్ట్రేలియా మీడియా పేర్కొంది.
ఈ రెండు జట్ల మధ్య జరిగిన గత నాలుగు సిరీస్ల్లో టీమ్ఇండియానే వరుసగా విజేతగా నిలిచింది. ఇందులో రెండు సిరీస్ల్లో ఆసీస్ను వారి సొంత గడ్డపైనే ఓడించడం విశేషం. అయితే.. గత ఏడాది లండన్లో జరిగిన WTC ఫైనల్లో మాత్రం భారత్ను ఆస్ట్రేలియా ఓడించి గదను ఎగరేసుకుపోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.