Virat Kohli: బ్యాటింగ్ ఆర్డర్ను బట్టే స్ట్రైక్రేట్..: కోహ్లీ ఇన్నింగ్స్పై లారా కీలక వ్యాఖ్యలు
ఒక్కడే బ్యాటింగ్ భారం మోస్తున్న విరాట్ కోహ్లీ.. బెంగళూరు సాధిస్తున్న స్కోరులో అగ్రభాగం అతడిదే. కొన్నిసార్లు నెమ్మదిగా ఆడుతుండటంపై విమర్శలూ ఎదుర్కోవాల్సిన పరిస్థితి.
ఇంటర్నెట్ డెస్క్: రాజస్థాన్తో మ్యాచ్లో సెంచరీ సాధించినా విరాట్ కోహ్లీ (Virat Kohli) మాత్రం సోషల్ మీడియాలో ట్రోలింగ్కు గురికావాల్సి వచ్చింది. తక్కువ స్ట్రైక్రేట్తో పరుగులు చేశాడని.. టీ20ల్లో అలా ఆడటం సరైంది కాదని కామెంట్లు చేశారు. ఐపీఎల్లో రెండో అత్యంత నెమ్మదైన సెంచరీగా (67 బంతుల్లో) ఇది నిలిచింది. ప్రస్తుత సీజన్లో ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా కొనసాగుతున్న ఆటగాడు కోహ్లీనే. ఐదు మ్యాచుల్లో 316 పరుగులతో ఇతర బ్యాటర్లకు చాలా దూరంలోనే ఉన్నాడు. కోహ్లీ ఆటతీరుపై వస్తున్న విమర్శలపై వెస్టిండీస్ స్టార్ బ్రియాన్ లారా స్పందించాడు. గణాంకాలు కంటే అతడి ఇన్నింగ్స్ అత్యంత విలువైందని వ్యాఖ్యానించాడు. వచ్చే పొట్టి కప్లో కోహ్లీ ఉండాల్సిందేనని స్పష్టం చేశాడు.
‘‘స్ట్రైక్రేట్ అనేది ఏ స్థానంలో బ్యాటింగ్కు వచ్చామనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఓపెనర్గా వచ్చినవారి స్ట్రైక్రేట్ 130-140 మధ్యలో ఉన్నా గొప్పదే. అదే మిడిలార్డర్లో వస్తే మాత్రం 150+ ఉండాల్సిందే. ఐపీఎల్లో ఇన్నింగ్స్ చివర్లో చాలామంది బ్యాటర్లు 200+ స్ట్రైక్రేట్తో పరుగులు రాబడుతున్నారు. ఇక విరాట్ కోహ్లీ విషయానికొస్తే.. అతడు ఓపెనర్గా 130 స్ట్రైక్రేట్తో ప్రారంభిస్తున్నాడు. చివరికి 160 దగ్గరగా వస్తున్నాడు. ఒక్క ఆటగాడు మాత్రమే రాణిస్తే మ్యాచ్ గెలవడం కష్టం. జట్టులోని మిగతావారూ భాగస్వామ్యం అందించాలి. బెంగళూరు జట్టులో అదే లోపించింది. బౌలింగ్ కూడా బలంగా లేదు.
టీ20 ప్రపంచ కప్లో భారత్ జట్టులో విరాట్ కోహ్లీ తప్పకుండా ఉండాలి. అయితే, ఓపెనర్గా రోహిత్తో కోహ్లీ ఇన్నింగ్స్ను ప్రారంభించొద్దు. రోహిత్తో కలిసి యువ బ్యాటర్ను పంపించాలి. అప్పుడే వారి దూకుడును ప్రత్యర్థులపై ప్రదర్శించే అవకాశం ఉంటుంది. అనుభవం కలిగిన ప్లేయర్లు మిడిలార్డర్లో ఉండటం అత్యంత కీలకం. సీనియర్ ఆటగాళ్లందరూ టాప్లోనే ఉంటే జట్టు సమతూకంగా ఉండదు. త్వరగా వారు ఔటైతే ఆ ప్రభావం కుర్రాళ్ల ప్రదర్శనపై పడుతుంది. అందుకే, విరాట్ కోహ్లీ వన్డౌన్లో వస్తే అతడి నుంచి మంచి ఇన్నింగ్స్లను మనం ఆశించొచ్చు’’ అని లారా తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
-
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సుకు బైడెన్ హాజరవుతారు: శ్వేత సౌధం
-
రివ్యూ: ‘రాయన్’.. ధనుష్ 50వ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా?
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
-
యశ్ ‘టాక్సిక్’లో బాలీవుడ్ భామ.. ఆ విషయం తాను చెప్పలేదంటూ పోస్ట్