T20 World Cup 2024: టాప్ వికెట్ టేకర్ జస్ప్రీత్ బుమ్రా.. టాప్ స్కోరర్ ట్రావిస్ హెడ్: పాంటింగ్
టీమ్ఇండియా స్టార్ పేసర్ బుమ్రాపై భారీ అంచనాలు ఉన్నాయని, వాటిని అందుకోగల సత్తా అతడికి ఉందని ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ వ్యాఖ్యానించాడు.
ఇంటర్నెట్ డెస్క్: జూన్ 2 నుంచి టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) ప్రారంభం కానుంది. ఈసారి విజేత ఎవరు అనేది పక్కనపెడితే.. మొత్తం 20 జట్లు బరిలో నిలిచాయి. ఇందులో సగం జట్ల నుంచి ఏవైనా సంచలనాలు నమోదైతే టోర్నీ ఆసక్తికరంగా మారడం ఖాయం. హాట్ ఫేవరెట్లుగా భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాతోపాటు విండీస్ కూడా ఉంది. ఇక మెగా సంగ్రామంలో అత్యధిక వికెట్లు తీసే బౌలర్, ఎక్కువ పరుగులు చేసే బ్యాటర్ ఎవరనేది ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ వెల్లడించాడు.
‘‘టోర్నీలో ఎక్కువ వికెట్లు తీసే బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah). అతడి ప్రదర్శన ఆ స్థాయిలో ఉంది. ఐపీఎల్లోనూ టాప్-3లో నిలిచాడు. గత కొన్నేళ్లుగా నిలకడైన ఆటతీరుతో రాణిస్తున్నాడు. కొత్త బంతితో ఇరువైపులా స్వింగ్ చేయగల సమర్థుడు. డెత్ ఓవర్లలోనూ వికెట్లు తీస్తాడు. అందుకే, అతడి వైపు మొగ్గు చూపా. ఇక అత్యధిక పరుగులు సాధించే బ్యాటర్ల జాబితాలో ట్రావిస్ హెడ్ ఉంటాడని అనుకుంటున్నా. ఐపీఎల్ చివర్లో మినహా మిగతా అంతటా దూకుడుగా పరుగులు రాబట్టాడు. ఈసారి అతడు టాప్ స్కోరర్ అవుతాడు’’ అని పాంటింగ్ విశ్లేషించాడు.
భారత్లో నేర్చుకున్న వాటిని అమలుచేస్తాం: బట్లర్
డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న ఇంగ్లాండ్ జట్టు ఈసారి కూడా విజేతగా నిలిచేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే గత కొన్ని అంతర్జాతీయ మ్యాచుల్లో ఓటములను చవిచూసిన తర్వాత ఆ జట్టుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో ఆ జట్టు సారథి జోస్ బట్లర్ స్పందిస్తూ.. ‘‘ద్వైపాక్షిక సిరీసుల్లో మేం సరైన ప్రదర్శన చేయలేదు. స్వేచ్ఛగా ఆడటంపై ఉన్న సందిగ్ధతను తొలగించుకుని పూర్తి స్పష్టత తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆటగాళ్లు ఫ్రీడమ్తో ఆడేందుకు అవకాశం ఇవ్వాలి. అన్నిసార్లూ ఇది వర్కౌట్ కాకపోవచ్చు. కానీ, పరిస్థితికి తగ్గట్టుగా ఆటతీరు విషయంలో క్లారిటీతో ఉండాలి. భారత్లో వన్డే ప్రపంచకప్, ఐపీఎల్ వంటి టోర్నీలను ఆడాం. అక్కడ చాలా విషయాలను నేర్చుకున్నాం. ఈసారి వాటిని అమలుచేసేందుకు ప్రయత్నించి ఫలితాలను రాబడతాం’’ అని బట్లర్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..