Rajasthan Vs Bengaluru: ‘విరాట్’ ప్లాన్తో బెంగళూరుపై ఒత్తిడి తెస్తాం: యుజ్వేంద్ర చాహల్
వరుసగా రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో కిందికి దిగజారిన బెంగళూరును రాజస్థాన్ జట్టు తన సొంత మైదానంలో ఢీకొట్టేందుకు సిద్ధమైంది. ఈక్రమంలో చాహల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్లో సొంత మైదానం వేదికగా బెంగళూరుతో రాజస్థాన్ తలపడనుంది. హ్యాట్రిక్ విజయాలతో ఉత్సాహంగా ఉన్న రాజస్థాన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవాలనే లక్ష్యంతో ఉంది. ఈ క్రమంలో బెంగళూరును (Rajasthan Vs Bengaluru) ఎలా అడ్డుకుంటారనే ప్రశ్నకు రాజస్థాన్ స్పిన్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ (Chahal) ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ఒకప్పుడు చాహల్ కూడా బెంగళూరు తరఫున ఆడిన సంగతి తెలిసిందే. అలాగే స్టార్ క్రికెటర్లు ధోనీ, విరాట్, రోహిత్ ఎక్కడికెళ్లినా అభిమానులు బ్రహ్మరథం పడతారని.. అలా అందరికీ సాధ్యం కాదని చాహల్ వ్యాఖ్యానించాడు. బెంగళూరుతో మ్యాచ్కు ముందు ప్రెస్ కాన్ఫరెన్స్లో చాహల్ మాట్లాడాడు.
‘‘ఈ మ్యాచ్లో బెంగళూరును ఒత్తిడికి గురి చేయాలంటే విరాట్ కోహ్లీ (Virat Kohli) వికెట్ అత్యంత కీలకం. అతడిని త్వరగా ఔట్ చేస్తేనే మేం మ్యాచ్పై పట్టు సాధించే అవకాశం ఉంటుంది. మా సొంత మైదానంలో మ్యాచ్ ఆడబోతున్నాం. అయితే ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి స్టార్లు ఎక్కడికెళ్లినా ప్రేక్షకులు మద్దతుగా నిలుస్తారు. ఫ్యాన్స్ మా టికెట్లను కూడా కొనేయాలని చూస్తారు. కానీ, మేం మాత్రం ఇవ్వం (నవ్వుతూ)’’ అని చాహల్ వ్యాఖ్యానించాడు.
టీ20 ప్రపంచ కప్లో యశస్వి ఉండాల్సిందే: చోప్రా
ఐపీఎల్లో యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) ఫామ్ను చూడకుండా వచ్చే టీ20 ప్రపంచ కప్లో చోటు కల్పించాలని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సెలక్టర్లకు సూచించాడు. ఈ సీజన్లో యశస్వి మూడు మ్యాచుల్లో కేవలం 39 పరుగులు మాత్రమే చేశాడు. ‘‘వరల్డ్ కప్లో విరాట్తో కలిసి రోహిత్ ఇన్నింగ్స్ను ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అలా ఎప్పుడూ జరగదు. ఏప్రిల్ 30వ తేదీ వరకు యశస్వి పరుగులు చేయలేడనుకుందాం. కేవలం ఏడెనిమిది మ్యాచ్లను పరిగణనలోకి తీసుకొని యశస్విని పక్కన పెడతారా? అప్పుడు ఆ నిర్ణయం అన్యాయమే అవుతుంది. యశస్విని తప్పనిసరిగా తీసుకోవాలి. ఆరంభ ఓవర్లలో రోహిత్తో కలిసి శుభారంభం ఇస్తాడు’’ అని చోప్రా తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?