Rajasthan Vs Bengaluru: ‘విరాట్’ ప్లాన్తో బెంగళూరుపై ఒత్తిడి తెస్తాం: యుజ్వేంద్ర చాహల్
వరుసగా రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో కిందికి దిగజారిన బెంగళూరును రాజస్థాన్ జట్టు తన సొంత మైదానంలో ఢీకొట్టేందుకు సిద్ధమైంది. ఈక్రమంలో చాహల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్లో సొంత మైదానం వేదికగా బెంగళూరుతో రాజస్థాన్ తలపడనుంది. హ్యాట్రిక్ విజయాలతో ఉత్సాహంగా ఉన్న రాజస్థాన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవాలనే లక్ష్యంతో ఉంది. ఈ క్రమంలో బెంగళూరును (Rajasthan Vs Bengaluru) ఎలా అడ్డుకుంటారనే ప్రశ్నకు రాజస్థాన్ స్పిన్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ (Chahal) ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ఒకప్పుడు చాహల్ కూడా బెంగళూరు తరఫున ఆడిన సంగతి తెలిసిందే. అలాగే స్టార్ క్రికెటర్లు ధోనీ, విరాట్, రోహిత్ ఎక్కడికెళ్లినా అభిమానులు బ్రహ్మరథం పడతారని.. అలా అందరికీ సాధ్యం కాదని చాహల్ వ్యాఖ్యానించాడు. బెంగళూరుతో మ్యాచ్కు ముందు ప్రెస్ కాన్ఫరెన్స్లో చాహల్ మాట్లాడాడు.
‘‘ఈ మ్యాచ్లో బెంగళూరును ఒత్తిడికి గురి చేయాలంటే విరాట్ కోహ్లీ (Virat Kohli) వికెట్ అత్యంత కీలకం. అతడిని త్వరగా ఔట్ చేస్తేనే మేం మ్యాచ్పై పట్టు సాధించే అవకాశం ఉంటుంది. మా సొంత మైదానంలో మ్యాచ్ ఆడబోతున్నాం. అయితే ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి స్టార్లు ఎక్కడికెళ్లినా ప్రేక్షకులు మద్దతుగా నిలుస్తారు. ఫ్యాన్స్ మా టికెట్లను కూడా కొనేయాలని చూస్తారు. కానీ, మేం మాత్రం ఇవ్వం (నవ్వుతూ)’’ అని చాహల్ వ్యాఖ్యానించాడు.
టీ20 ప్రపంచ కప్లో యశస్వి ఉండాల్సిందే: చోప్రా
ఐపీఎల్లో యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) ఫామ్ను చూడకుండా వచ్చే టీ20 ప్రపంచ కప్లో చోటు కల్పించాలని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సెలక్టర్లకు సూచించాడు. ఈ సీజన్లో యశస్వి మూడు మ్యాచుల్లో కేవలం 39 పరుగులు మాత్రమే చేశాడు. ‘‘వరల్డ్ కప్లో విరాట్తో కలిసి రోహిత్ ఇన్నింగ్స్ను ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అలా ఎప్పుడూ జరగదు. ఏప్రిల్ 30వ తేదీ వరకు యశస్వి పరుగులు చేయలేడనుకుందాం. కేవలం ఏడెనిమిది మ్యాచ్లను పరిగణనలోకి తీసుకొని యశస్విని పక్కన పెడతారా? అప్పుడు ఆ నిర్ణయం అన్యాయమే అవుతుంది. యశస్విని తప్పనిసరిగా తీసుకోవాలి. ఆరంభ ఓవర్లలో రోహిత్తో కలిసి శుభారంభం ఇస్తాడు’’ అని చోప్రా తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
మ్యాచ్ జరుగుతున్నప్పుడు పెద్దగా ఆందోళన పడని రుతురాజ్ టాస్ సమయంలో మాత్రం ఒత్తిడికి గురయ్యాడట. ఇదే విషయాన్ని స్వయంగా చెన్నై కెప్టెన్ వెల్లడించాడు. -
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
ఐపీఎల్లో ఇప్పటికే ఎన్నో మెరుపు ఇన్నింగ్స్లు ఆడిన గ్లెన్ మ్యాక్స్వెల్ (Glenn Maxwell) ఈసారి కూడా అలాగే అలరిస్తాడని ఫ్యాన్స్ ఆశించారు. కానీ మ్యాక్సీ పేలవ ఫామ్తో లీగ్ మధ్యలో తనకు తానుగా బ్రేక్ తీసుకుని షాక్ ఇచ్చాడు. -
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
T20 World Cup: టీ20 ప్రపంచకప్ కోసం భారత ఆటగాళ్లకు అమితాబ్ బచ్చన్ సందేశమిచ్చారు. తన కొత్త సినిమా ‘కల్కి’లోని అశ్వత్థామ అవతారంలో క్రికెటర్లలో ప్రేరణ నింపారు. -
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
MS Dhoni: బుధవారం పంజాబ్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై ఓడిపోయింది. అయితే, ధోనీ మాత్రం ఇప్పటి వరకు తన పేరిట ఉన్న ఓ రికార్డును ఈ మ్యాచ్తో మరింత పదిలం చేసుకున్నాడు. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
-
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
-
భానుడి ప్రతాపం.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్నెట్స్..
-
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
-
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
-
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్