Mumbai Vs Chennai: మా యువ వికెట్ కీపర్ సిక్స్లే కాపాడాయి: రుతురాజ్ గైక్వాడ్
ముంబయిపై రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబె హాఫ్ సెంచరీలు సాధించారు. అయితే, ఇద్దరి ఆటగాళ్ల వల్లే తమ జట్టు గెలిచిందని చెన్నై కెప్టెన్ వ్యాఖ్యానించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్లో చెన్నై వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. వాంఖడే మైదానంలో ముంబయిపై 20 పరుగుల తేడాతో గెలిచింది. ఎంఎస్ ధోనీ (MS Dhoni) చివరి ఓవర్లో హ్యాట్రిక్ సిక్స్లు బాదగా.. బౌలింగ్లో పతిరన నిప్పులు చెరిగాడు. మ్యాచ్ విజయంలో వారిద్దరి పాత్ర కీలకమని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) తెలిపాడు. రుతురాజ్, శివమ్ దూబె హాఫ్ సెంచరీలు సాధించారు. దీంతో పాయింట్ల పట్టికలో చెన్నై మూడో స్థానానికి ఎగబాకింది. మ్యాచ్ అనంతరం చెన్నై కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘‘ముంబయిపై విజయం సాధించడంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. కానీ, మా యువ వికెట్ కీపర్ (ఎంఎస్ ధోనీని ఉద్దేశించి) కొట్టిన మూడు సిక్స్లు జట్టును ఆదుకున్నాయి. ఇలాంటి పిచ్పై మేం చేసిన దానికంటే మరో 15 పరుగులు అవసరమని భావించా. బుమ్రా అద్భుతంగా బౌలింగ్ వేశాడు. లక్ష్య ఛేదనలో బంతితో మేం మెరుగ్గా రాణించాం. హార్డ్ హిట్టర్లున్న ముంబయిని కట్టడి చేయడం సులువేం కాదు. మా యువ మలింగ (పతిరన) మరోసారి పదునైన బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. తుషార్, శార్దూల్ కూడా పరుగులను నియంత్రించారు. మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేస్తే చాలని మ్యాచ్ ముందు అనుకున్నాం. అజింక్యను ఓపెనర్గా పంపించడానికి కారణం ఉంది. వన్డౌన్లో కాస్త ఇబ్బంది పడుతున్నాడు. ఫామ్ దక్కించుకోవడానికి అతడితో ఇన్నింగ్స్ను ప్రారంభించాం. నేను ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయడానికి సిద్ధమే. ఇప్పుడు కెప్టెన్ అయిన తర్వాత మరింత బాధ్యతాయుతంగా ఆడాల్సి ఉంటుంది’’ అని రుతురాజ్ తెలిపాడు.
పవర్ ప్లే సమయంలో ఆందోళన పడ్డా: పతిరన
‘‘ముంబయి ఇండియన్స్ పవర్ ప్లేలో 60+ స్కోరు చేసింది. దీంతో కాస్త ఆందోళనకు గురయ్యా. ఏమాత్రం కంగారు పడకుండా ప్రణాళికలకు కట్టుబడి బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నా. ఈ ప్రదర్శన నాలో ఆత్మవిశ్వాసం పెంచుతుంది. ఫలితం గురించి ఎక్కువగా ఆలోచించను. అనుకున్నట్లుగా బౌలింగ్ వేస్తున్నానా? లేదా? అనేది ముఖ్యం. అలా చేస్తే ఫలితం అనుకూలంగా వస్తుంది. బ్యాటర్ను బట్టి కూడా నా ప్రణాళికలను మార్చుకుంటా. రెండు వారాల కిందట వరకు నేను ఫామ్తో ఇబ్బంది పడ్డా. మేనేజ్మెంట్, సహాయక సిబ్బంది మద్దతుగా నిలిచి ప్రోత్సహించారు’’ అని పతిరన (Patirana) తెలిపాడు. ఈ మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన అతడు 4 ఓవర్లలో 4 వికెట్లు తీసి 28 పరుగులు ఇచ్చాడు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు సొంతం చేసుకున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం