MS Dhoni: ధోనీకి ఎప్పుడేం చేయాలో తెలుసు: చెన్నై కోచ్
‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ (MS Dhoni) ఈ సీజన్లో హిట్టింగ్ చేస్తూ సిక్స్లు, ఫోర్లు బాదేశాడు. మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా ధోనీ ఆట కోసమే అభిమానులు స్టేడియాలకు హోరెత్తారు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2024 సీజన్లో ఎంఎస్ ధోనీ (MS Dhoni) ఆటతీరు అభిమానులను అలరించింది. చెన్నై ప్లేఆఫ్స్కు చేరుకోవడంలో విఫలమైనప్పటికీ ఎంఎస్డీ క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ప్రతి స్టేడియంలోనూ అతడి కోసమే అభిమానులు వచ్చేవారంటే అతిశయోక్తికాదు. అయితే, ఈ సీజన్ తర్వాత ధోనీ క్రికెట్కు వీడ్కోలు పలుకుతాడనే ఊహాగానాలు విపరీతంగా వచ్చాయి. బెంగళూరుతో మ్యాచ్ అనంతరం నిర్ణయాన్ని వెల్లడిస్తాడని అంతా భావించారు. కానీ, ధోనీ మాత్రం స్పందించలేదు. ఈ క్రమంలో ‘కెప్టెన్ కూల్’ భవితవ్యంపై సీఎస్కే బౌలింగ్ కోచ్ ఎరిక్ సైమన్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. 2010 నుంచి ధోనీతో పరిచయం ఉందని.. గేమ్ను అర్థం చేసుకోవడంలో అతడిని మించిన వారెవరూ లేరని తెలిపాడు.
‘‘ధోనీతో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు జట్టును కాపాడే కీలక ఇన్నింగ్స్లు ఆడిన సందర్భాలెన్నో చూశాం. అతడు క్రీజ్లో ఉన్నాడంటే మ్యాచ్ విజయం సాధించే స్థితిలో మేమున్నట్లేనని డగౌట్లో కూర్చొని అనుకొనేవాళ్లం. జట్టులో ఆత్మవిశ్వాసం నింపడంలో ధోనీకి మించినవారెవరూ ఉండరు. గేమ్ను ఎప్పటికప్పుడు అర్థం చేసుకోవడంలో ముందుంటాడు. గొప్ప క్రికెటర్లు అందరూ అలా చేయగలిగినప్పటికీ.. దానిని ఆచరణలో పెట్టాలంటే మాత్రం ధోనీకే సాధ్యం. యువ క్రికెటర్లకు ఎల్లవేళలా మద్దతుగా నిలుస్తాడు.
ప్రతి మ్యాచ్ సమయంలోనూ ధోనీ భవితవ్యంపై చర్చ కొనసాగుతోంది. వినడానికి చాలా క్రేజీ ఉంటుంది. ఎంఎస్డీకి ఎప్పుడు ఏం చేయాలో తెలుసు. ఈ సీజన్కు ముందు ప్రి సెషన్ ప్రాక్టీస్ సమయంలోనూ అతడి బ్యాటింగ్ను చూశా. బంతిని హిట్టింగ్ చేయడంలో ఉత్సాహం చూపించాడు. ఇదే ఆటతీరును టోర్నీలోని మ్యాచుల్లోనూ చూశాం. కాబట్టి, అతడు తన భవిష్యత్తుపై పూర్తి అవగాహనతో ఉంటాడు. తప్పకుండా నిర్ణయం తీసుకుంటాడు’’ అని ఎరిక్ వెల్లడించాడు. ఈ సీజన్లో ధోనీ 14 మ్యాచుల్లో 161 పరుగులు సాధించాడు. దాదాపు ఇవన్నీ సిక్స్లు, ఫోర్లు రూపంలో వచ్చినవే కావడం గమనార్హం. తాజాగా బెంగళూరుతో చివరి లీగ్ మ్యాచ్లోనూ 13 బంతుల్లోనే 25 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు