ఇప్పటి వరకు ధోనీ మాకేం చెప్పలేదు: రిటైర్మెంట్పై చెన్నై ఫ్రాంచైజీ!
డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై ప్లేఆఫ్స్కు చేరలేదు. దీంతో ధోనీ ఆటను చూసే అవకాశం కోల్పోయామనే బాధ అభిమానుల్లో ఉంది. అయితే, అతడి భవితవ్యంపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఉత్కంఠ నెలకొంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2024 సీజన్లో చెన్నై లీగ్ స్టేజ్కే పరిమితమైంది. కీలక మ్యాచ్లో సీఎస్కేపై బెంగళూరు విజయం సాధించడంతో టోర్నీ నుంచి నిష్క్రమించక తప్పలేదు. ఈ మ్యాచ్లో ఎంఎస్ ధోనీ (MS Dhoni) దూకుడుగా ఆడి జట్టును గెలిపించే ప్రయత్నం చేసినా కుదరలేదు. ఈ సీజన్ తర్వాత క్రికెట్కు వీడ్కోలు పలుకుతాడని అంతా భావిస్తున్నప్పటికీ.. ధోనీ మాత్రం ఇంకా స్పందించలేదు. ఇదే విషయాన్ని చెన్నై క్రికెట్ వర్గాలు మరోసారి స్పష్టం చేశాయి.
‘‘ధోనీ ఇప్పటి వరకు అతడి భవితవ్యం గురించి మాట్లాడలేదు. వైదొలుగుతానని ఎప్పుడూ చెప్పలేదు. మేనేజ్మెంట్తో తన నిర్ణయం వెల్లడించేందుకు కాస్త సమయం తీసుకుంటాడని అనుకుంటున్నాం. ప్రస్తుత సీజన్లో అతడు వికెట్ల మధ్య పరుగెత్తడంలో ఎక్కడా ఇబ్బంది పడినట్లు అనిపించలేదు. వచ్చే సీజన్లో ఇంపాక్ట్ రూల్ను ఉపయోగించుకుని ధోనీని కేవలం బ్యాటింగ్కే దిగేలా చూడాలని అభిమానులు కోరుతున్నారు. కానీ, ‘కెప్టెన్ కూల్’ ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడో తెలియదు. ఈ సీజన్ ఇప్పుడే ముగిసింది. అతడితో మాట్లాడేందుకు సరైన సమయం కోసం వేచి చూస్తున్నాం. జట్టు ప్రయోజనాల కోసమే ఎప్పుడూ ఆలోచించే వ్యక్తి ధోనీ. కాబట్టి, ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మాకు ఇబ్బంది లేదు’’ అని సీఎస్కే వర్గాలు తెలిపాయి.
బంతిని మార్చడం వల్లే..
బెంగళూరు యశ్ దయాళ్ వేసిన ఇన్నింగ్స్ 20వ ఓవర్ తొలి బంతిని ధోనీ భారీ సిక్స్గా మలిచాడు. 110 మీటర్ల దూరం కొట్టాడు. ఇదే ఆర్సీబీ విజయానికి కారణమైందనే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఆ బంతి కనిపించకపోవడంతో దాని స్థానంలో వేరే బాల్ను ఆర్సీబీ తీసుకుంది. దయాళ్కు పట్టు దొరకడంతో తర్వాత బంతికే ధోనీ క్యాచ్ ఔట్గా పెవిలియన్కు చేరాడు. ధోనీ ఔట్ కావడంపై సీఎస్కే అధికారి స్పందిస్తూ.. ‘‘భారీ సిక్స్ కొట్టడంతో మరొక బంతిని తీసుకోవడం జరిగింది. ఆ బాల్కు తేమ లేకపోవడంతో బౌలర్కు పట్టుదొరికింది. దీంతో బ్యాటర్ హిట్టింగ్ చేయడం కష్టంగా మారింది’’ అని పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.