Ruturaj Gaikwad: ఒత్తిడేం లేదు.. కెప్టెన్సీని ఆస్వాదించా: రుతురాజ్ గైక్వాడ్
ఐపీఎల్ 17వ సీజన్ (IPL 2024) అద్భుతంగా మొదలైంది. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై విజయంతో ఈ సిరీస్ను మొదలుపెట్టింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై బోణీ కొట్టింది. చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్లో బెంగళూరుపై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్సీ చేపట్టిన తొలి మ్యాచ్లోనే జట్టును గెలిపించాడు రుతురాజ్ గైక్వాడ్. మ్యాచ్ సమయంలో ఎలాంటి ఒత్తిడికి గురి కాలేదని.. సీనియర్ల సహకారం బాగుందని తెలిపాడు.
‘‘ఆట మొత్తం మా నియంత్రణలోనే ఉంది. తొలి మూడు ఓవర్లలో మేం భారీగా పరుగులు ఇచ్చినా తర్వాత పుంజుకున్నాం. స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు తీసుకున్నాం. మ్యాక్స్వెల్, డుప్లెసిస్ను ఔట్ చేయడమే టర్నింగ్ పాయింట్. బెంగళూరు మిడిలార్డర్ బ్యాటర్లు దూకుడుగా ఆడారు. ఆ జట్టు భారీ స్కోరు చేయకుండా.. 15 పరుగులు తక్కువకే కట్టడి చేయగలిగాం. సీనియర్లు ఉన్న జట్టును ఎలా నడిపిస్తాడో అని చాలామంది అనుకొని ఉంటారు. నేను మాత్రం కెప్టెన్సీని ఆస్వాదించా. ఎక్కడా ఒత్తిడికి గురి కాలేదు. సారథ్యం ఎలా నిర్వర్తించాలనేది అనుభవమే. మహీ భాయ్ మద్దతు ఉందక్కడ. మా జట్టులోని ప్రతి ఒక్కరూ స్ట్రోక్ ప్లేయర్లు. అజింక్య రహానె అద్భుతంగా ఆడాడు. ప్రతి ఒక్కరికీ తమ పాత్ర ఏంటో తెలుసు. టాప్ -3 బ్యాటర్లలో ఒకరు 15వ ఓవర్ వరకూ క్రీజ్లో ఉంటే ఛేదన మరింత తేలికవుతుంది’’ అని రుతురాజ్ తెలిపాడు.
మరో 20 పరుగులు చేయాల్సింది: డుప్లెసిస్
‘‘ఆరు ఓవర్ల తర్వాత బ్యాటింగ్లో కాస్త తగ్గాల్సి ఉంటుంది. చెన్నై బౌలర్లు మిడిల్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేశారు. మరీ ముఖ్యంగా స్పిన్నర్లు మమ్మల్ని కట్టడి చేశారు. కనీసం మరో 15 నుంచి 20 పరుగులు చేస్తే బాగుండేది. పిచ్ బాగానే ఉంది. తొలి 10 ఓవర్లలో త్వరగా వికెట్లను కోల్పోయాం. ఛేదనలోనూ ప్రత్యర్థి బ్యాటర్లు మాపై ఆధిక్యం ప్రదర్శించారు. ఇక్కడ తొలుత బ్యాటింగ్ చేయడం మంచిదే. గత ఏడాది గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తుంది. దినేశ్ కార్తిక్ సూపర్గా ఆడాడు. ఇటీవల ఎక్కువగా క్రికెట్ ఆడని అతడు.. తొలి మ్యాచ్లోనే దూకుడైన ప్రదర్శన చేశాడు. కుర్రాడు అనుజ్ రావత్ ఆకట్టుకున్నాడు’’ అని బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ తెలిపాడు.
మరికొన్ని విశేషాలు..
- ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన శివమ్ దూబె ఈ మ్యాచ్లో 28 బంతుల్లో 34 పరుగులు చేశాడు. అతడికి బెంగళూరుపై మంచి రికార్డు ఉంది. మొత్తం నాలుగు మ్యాచుల్లో 227 పరుగులు రాబట్టాడు.
- ఐపీఎల్ సీజన్ ప్రారంభ మ్యాచుల్లో బెంగళూరుకు ఇది నాలుగో ఓటమి. మొత్తం ఐదు మ్యాచుల్లో తలపడగా.. ఒకే ఒక్కసారి మాత్రమే గెలిచింది. 2021 సీజన్లో ముంబయిపై 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మిగతా నాలుగింటిలోనూ పరాజయమే.
- చెపాక్ స్టేడియంలో చెన్నై X బెంగళూరు జట్లు 9 మ్యాచుల్లో తలపడగా.. 8 మ్యాచుల్లో చెన్నై గెలిచింది. కేవలం ఒక్క దాంట్లోనే (2008 సీజన్లో) బెంగళూరు విజయం సాధించడం గమనార్హం.
- ఐపీఎల్లో ఒక జట్టుపై అత్యధిక విజయాలు నమోదు చేసిన రెండో జట్టుగా చెన్నై నిలిచింది. బెంగళూరుపై 21 మ్యాచుల్లో చెన్నై విజయం సాధించింది. కోల్కతాపై ముంబయి 23 విజయాలతో ముందుంది.
- ఒక్క హాఫ్ సెంచరీ లేకుండా.. ఎక్కువ పరుగులు నమోదైన తొలి మ్యాచ్గా చెన్నై-బెంగళూరు పోరు నిలిచింది. ఈ మ్యాచ్లో 349 పరుగులు నమోదు కావడం విశేషం. టాప్ స్కోరర్ బెంగళూరు బ్యాటర్ అనుజ్ రావత్ (48).
- దినేశ్ కార్తిక్ - అనుజ్ రావత్ కలిసి ఆరో వికెట్కు 95 పరుగులు జోడించారు. ఐపీఎల్లో బెంగళూరుకు ఈ వికెట్కు రెండో అత్యధిక భాగస్వామ్యం. అంతకుముందు 2022లో షహబాజ్తో కలిసి కార్తిక్ 97 పరుగులు జోడించాడు. చెన్నై జట్టుపై ఆరో వికెట్కు ఇదే అత్యధికం కావడం విశేషం.
- చెన్నై తరఫున ఐపీఎల్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేసిన రెండో బౌలర్గా ముస్తాఫిజర్ రహ్మాన్ (4/29) నిలిచాడు. 2009లో షాదాబ్ జకాతి (4/24) బెస్ట్ బౌలింగ్ వేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఉనికి కోసమే దిల్లీలో జగన్ డ్రామాలు : కేశినేని చిన్ని
-
బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధమా?: సీఎం రేవంత్రెడ్డి
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్