Chennai vs Lucknow: చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది.
నాలుగు రోజుల కిందట.. వరుసగా రెండు విజయాలతో జోష్ మీదుంది చెన్నై. లఖ్నవూలో అడుగుపెట్టిన ఆ జట్టుకు అనూహ్యంగా ఓటమి ఎదురైంది. కేఎల్ రాహుల్ సేన అలవోకగా గెలిచింది. ఇప్పుడు మరోసారి ఇరు జట్లూ తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఈసారి సొంతమైదానం చెపాక్ వేదికగా చెన్నై దూకుడుగా ఆడే అవకాశాలున్నాయి. మరి లఖ్నవూ ఏమాత్రం తట్టుకోగలదో చూడాలి.
ఐపీఎల్ 17వ సీజన్లో చెన్నై - లఖ్నవూ జట్ల మధ్య మళ్లీ మ్యాచ్ వచ్చేసింది. వీటి మధ్య జరిగిన గత పోరులో లఖ్నవూ విజయం సాధించింది. ప్లేఆఫ్స్ రేసులో ముందుకుపోవాలంటే ప్రతీ మ్యాచూ కీలకమే. పాయింట్ల పట్టికలో నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఎవరు గెలిస్తే వారి స్థానం ఇంకాస్త మెరుగయ్యే అవకాశం ఉంది. బలాబలాలపరంగా ఇరు జట్లూ సమానంగానే ఉన్నా.. సొంత మైదానం కావడంతో చెన్నై జట్టే ఫేవరెట్గా నిలుస్తుందనడంలో సందేహం లేదు.
రచిన్.. రిజ్వీ గాడిలో పడాలి
చెన్నై బ్యాటింగ్ విభాగంలో ప్రభావం చూపని వారు ఇద్దరే. ఓపెనర్ రచిన్ రవీంద్ర, సమీర్ రిజ్వీ. గత వన్డే ప్రపంచకప్లో న్యూజిలాండ్ తరఫున అదరగొట్టిన రచిన్ ఈ ఐపీఎల్ సీజన్లో జట్టుకు బలంగా మారతాడని అంతా ఆశించారు. డేవన్ కాన్వే లేని లోటును ఓపెనర్గా తీరుస్తాడని భావించారు. కానీ, రచిన్ నుంచి ఒక్క మంచి ఇన్నింగ్స్ కూడా రాకపోవడం గమనార్హం. దూకుడుగా ఆడే క్రమంలో చెత్త షాట్లకు వికెట్లను సమర్పించేస్తున్నాడు. యువ బ్యాటర్ సమీర్ రిజ్వీ కూడా తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం లేదు. గత మ్యాచ్లో అజింక్య రహానె ఫర్వాలేదనిపించి ఫామ్లోకి వచ్చాడు. ఇక ఎంఎస్ ధోనీ, జడ్డూ సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జడ్డూ కీలక ఇన్నింగ్స్లతో జట్టుకు అండగా నిలుస్తుంటే.. ధనాధన్ షాట్లతో ధోనీ వీరవిహారం చేస్తున్నాడు. చివరి ఓవర్లలో అత్యధిక స్ట్రైక్రేట్తో పరుగులు రాబడుతూ ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తించాడు.
పదును తగ్గిన తుషార్ బౌలింగ్
గత సీజన్లో అత్యుత్తమ బౌలింగ్తో చెన్నై జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించిన తుషార్ పాండే.. ఈసారి కాస్త ఇబ్బందిపడుతున్నాడు. బౌలింగ్ లయను అందుకొని డెత్ ఓవర్లలో పరుగులను నియంత్రించాలి. ఆరంభంలో ముస్తాఫిజుర్ చెలరేగిపోయాడు. ఇప్పుడు మాత్రం ధారాళంగా పరుగులు ఇచ్చేస్తున్నాడు. రవీంద్ర జడేజా, పతిరన, దీపక్ చాహర్ లఖ్నవూతో మ్యాచ్లో ఆకట్టుకున్నారు. మరోసారి వారినుంచి ఇలాంటి ప్రదర్శనే పునరావృతం కావాలనేది అభిమానుల ఆకాంక్ష. లఖ్నవూ ఓపెనింగ్ జోడీ డికాక్, కేఎల్ రాహుల్ను త్వరగా ఔట్ చేస్తేనే మ్యాచ్పై పట్టు సాధించే అవకాశం ఉంటుంది. గత మ్యాచ్లో డికాక్ ఇచ్చిన క్యాచ్ను నేలపాలు చేయడంతో చెన్నైకి ఇబ్బందులు తప్పలేదు. జడ్డూలా మెరుపు ఫీల్డింగ్ చేస్తేనే విజయం వరించే అవకాశం ఉంది.
లఖ్నవూ కలసికట్టుగా..
కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ కలసికట్టుగా ఆడుతోంది. పేస్ బౌలింగ్లో సీనియర్లు లేకపోయినా.. కుర్రాళ్లే అదరగొట్టేస్తున్నారు. చెన్నైతో జరిగిన మ్యాచ్లో మోసిన్ ఖాన్, మ్యాట్ హెన్రీ బౌలింగ్ ఆకట్టుకుంది. స్పిన్ విభాగం రవి బిష్ణోయ్, కృనాల్ పాండ్యతో ఫర్వాలేదనిపిస్తోంది. చెపాక్ పిచ్తో స్పిన్నర్లకు కాస్త సహకారం లభించనున్న నేపథ్యంలో వీరిద్దరూ కీలకపాత్ర పోషించే అవకాశం లేకపోలేదు. ఆల్రౌండర్ స్టాయినిస్ రెండు విభాగాల్లోనూ రాణించడం లఖ్నవూకు అదనపు బలం. ఇప్పటివరకు పెద్దగా ఫామ్లో లేని క్వింటన్ డికాక్ గత మ్యాచ్లో హాఫ్ సెంచరీతో అలరించాడు. కెప్టెన్ కేఎల్ కూడా బ్యాట్ను ఝళింపించాడు. నికోలస్ పూరన్ను చెన్నై బౌలర్లు ఎలా అడ్డుకుంటారో చూడాలి. బ్యాటింగ్ విభాగంలో ఈ ముగ్గురితోపాటు యువ ఆటగాడు ఆయుష్ బదోనిని తక్కువగా అంచనా వేస్తే చెన్నైకి ఇబ్బందులు తప్పవు. ఫాస్టెస్ట్ పేసర్ మయాంక్ యాదవ్ మళ్లీ మైదానంలోకి అడుగుపెడతాడని లఖ్నవూ ఆశలు పెట్టుకుంది. అతడు వస్తే మాత్రం ఆ జట్టు బౌలింగ్ విభాగం మరింత పటిష్ఠంగా మారనుంది.
పిచ్ రిపోర్ట్..
చెన్నై పిచ్ స్పిన్కు సహకారం అందిస్తుంది. పిచ్పై పచ్చిక ఎక్కువగా ఉండదు. అయితే, ఆరంభంలో పేస్ బౌలింగ్ను ఎదుర్కోవడమూ కష్టమే. టాస్ నెగ్గే జట్టు లక్ష్య ఛేదనకే మొగ్గు చూపుతుంది. చెపాక్లో ఎప్పుడూ చెన్నైదే హవా. ఈ సీజన్లో ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఆ జట్టే గెలిచింది.
తుది జట్లు (అంచనా)
చెన్నై: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్య రహానె, మొయిన్ అలీ, శివమ్ దూబె, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్పాండే, ముస్తాఫిజర్ రహ్మాన్, మతీశా పతిరన
లఖ్నవూ: క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్ (కెప్టెన్/వికెట్ కీపర్), దీపక్ హుడా, మార్కస్ స్టాయినిస్, నికోలస్ పూరన్, ఆయుశ్ బదోని, కృనాల్ పాండ్య, మ్యాట్ హెన్రీ, రవి బిష్ణోయ్, మోసిన్ ఖాన్, యశ్ ఠాకూర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
-
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సుకు బైడెన్ హాజరవుతారు: శ్వేత సౌధం