IPL Final Match: ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్.. ఈ తారల సందడి చూశారా..?
చెన్నై వేదికగా జరిగిన ఐపీఎల్ ఫైనల్లో కోల్కతా ఛాంపియన్ నిలిచింది. ఈమ్యాచ్కు పలువురు సినీ తారలు హాజరై సందడి చేశారు.
చెన్నై: ఐపీఎల్ ఫైనల్లో హైదరాబాద్ను 8 వికెట్ల తేడాతో ఓడించి మూడోసారి ఛాంపియన్గా కోల్కతా అవతరించింది. దీంతో రెండు నెలలకు పైగా సాగిన మెగా టోర్నీ ముగిసింది. ఫైనల్ మ్యాచ్కు పలువురు సినీ తారలు హాజరై సందడి చేశారు. టాలీవుడ్ అగ్రహీరో వెంకటేశ్, జాన్వీ కపూర్, రాజ్కుమార్ రావు, అనన్య పాండే, మహేశ్వరీ తదితరులు తళుక్కున మెరిసి అభిమానుల్లో జోష్ నింపారు. ఇక కోల్కతా టీమ్ యాజమాని షారుఖ్ ఖాన్, అతడి సతీమణి గౌరీ ఖాన్, కూతురు సుహానా ఖాన్, జుహీ చావ్లా తమ జట్టును ఆద్యంతం ఉత్సాహపరిచారు. కోల్కతా బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్లు కొట్టినప్పడు చప్పట్లతో మద్దతు తెలిపారు.
చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో హైదరాబాద్ తేలిపోయింది. ఈ సీజన్లో బ్యాటింగ్లో అద్భుతాలు చేసి అలరించిన సన్రైజర్స్.. ఫైనల్లో కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 10.3 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆ జట్టులో వెంకటేశ్ అయ్యర్ (52*) అర్ధశతకంతో మెరుపులు మెరిపించాడు. రహమనుల్లా గుర్జాబ్ (39) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేపాల్ను చిత్తు చేసిన బంగ్లాదేశ్.. సూపర్-8కి అర్హత
తన చివరి లీగ్ మ్యాచ్లో విజయం సాధించిన బంగ్లాదేశ్ టీ20 ప్రపంచ కప్ సూపర్-8కి అర్హత సాధించింది. -
గంభీరే టీమ్ఇండియా కోచ్!
టీమ్ఇండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ త్వరలోనే కొత్త పాత్రలో కనిపించబోతున్నాడు! భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా అతని ఎంపిక ఖాయమైందని తెలిసింది. బీసీసీఐ అధికారికంగా ప్రకటించడమే మిగిలింది. -
గండాలు దాటి.. గట్టెక్కిన ఇంగ్లాండ్
వర్షం ఆగాలి.. మ్యాచ్ సాగాలి.. ఇంగ్లాండ్ జట్టుతో పాటు ఆ దేశ అభిమానులూ కోరుకున్నది ఇదే. ఒకవేళ వాన కారణంగా నమీబియాతో మ్యాచ్ రద్దయితే ఇంగ్లాండ్ ఇంటి ముఖం పట్టేదే. -
స్మృతి శతకం
భారత మహిళల క్రికెట్ జట్టుకు అదిరే విజయం! స్మృతి మంధాన శతకం..బంతితో శోభన, దీప్తి విజృంభణతో హర్మన్ప్రీత్ బృందం దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్లో ఘనంగా బోణీ కొట్టింది. -
ఆసీస్ అజేయంగా..
7 ఓవర్లలో 89 పరుగులు! ఇదీ స్కాట్లాండ్తో మ్యాచ్లో ఆస్ట్రేలియా విజయ సమీకరణం. చిన్నజట్టే అయినా స్కాట్లాండ్ బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేస్తూ.. బ్యాటర్లను కట్టడి చేశారు. దీంతో పొట్టి కప్లో మరో సంచలనం తప్పదేమో అనిపించింది. -
ఇటలీ శుభారంభం
యూరో కప్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇటలీ శుభారంభం చేసింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన గ్రూప్- బి మ్యాచ్లో ఆ జట్టు 2-1 తేడాతో అల్బేనియాను ఓడించింది. -
భజన్కు పారిస్ కోటా
భారత యువ ఆర్చర్ భజన్ కౌర్ పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాన్ని గెలిచింది. క్వాలిఫయర్స్ టోర్నీలో మహిళల రికర్వ్ సింగిల్స్లో స్వర్ణం సాధించిన ఆమె.. ఈ క్రమంలో దేశానికి కోటా స్థానాన్ని అందించింది. -
సంక్షిప్తవార్తలు(4)
టోక్యో ఒలింపిక్స్ కాంస్య విజేత లవ్లీనా బోర్గోహెయిన్ మరోసారి అంతర్జాతీయ వేదికపై మెరిసింది. చెక్ రిపబ్లిక్లో జరిగిన గ్రాండ్ ప్రి ఉస్తి నాద్ లేబం టోర్నీలో ఆమె రజతం సొంతం చేసుకుంది. -
అతడికి సెలవులు పొడిగించండి.. జీతం పెంచండి: ఒరాకిల్ సంస్థకు విజ్ఞప్తులు
అమెరికా తరఫున ఆడుతున్న భారత సంతతి ఆటగాడు నేత్రావల్కర్ ప్రదర్శనపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. -
కోహ్లీ ఆటతీరుపై ఎలాంటి ఆందోళన లేదు.. మద్దతుగా నిలిచిన బ్యాటింగ్ కోచ్
టీ20 ప్రపంచకప్లో విరాట్ కోహ్లీ పేలవ ప్రదర్శనపై పలువురు విమర్శలు గుప్పిస్తుండగా.. అతడికి బ్యాటింగ్ కోచ్ మద్దతుగా నిలిచాడు.