Olympic Games 2028: ఆ ఆనందం దక్కుతుందా..? ఒలింపిక్స్లో ఆ స్టార్లు ఆడేనా?
ఒలింపిక్స్లో (Olympic Games) క్రికెట్ను చూస్తామనే ఆనందం ఒక వైపు ఉన్నా.. ఇప్పుడున్న సీనియర్లను మెగా సంబరంలో చూస్తామా..? లేదా అనే సందిగ్ధత ప్రతి అభిమాని మదిలో మెదిలే ప్రశ్న.
ఒలింపిక్స్లో (Olympic Games) క్రికెట్, స్క్వాష్! నిజంగా మన క్రీడాకారులకు ఇది శుభవార్తే. దశాబ్దాల నిరీక్షణకు తెరదించిన సమయమిది. 2028 లాస్ఏంజెలెస్ ఒలింపిక్స్ ఆరంభమయ్యే నాటికి ఇప్పుడు ఆడుతున్న క్రీడాకారుల్లో ఎంతమంది ఉంటారు? ముఖ్యంగా భారత సూపర్స్టార్ విరాట్ కోహ్లికి ఈ అవకాశం చిక్కుతుందా అనేది సందేహం!
విరాట్ కోహ్లి ప్రస్తుత వయసు 34 ఏళ్లు. 2028 లాస్ఏంజెలెస్ ఒలింపిక్స్ నాటికి 39 ఏళ్లు పూర్తవుతాయి. అప్పటివరకు కోహ్లి కెరీర్ను కొనసాగించడమే ఎక్కువ. ఒకవేళ ఆడినా టీ20 ఫార్మాట్లో కొనసాగుతాడా అనేది కూడా అనుమానం. అందుకే ఒలింపిక్స్లో ఈ స్టార్ ఆటగాడు జట్టులో ఉంటాడా అనే అనుమానాలున్నాయి. లాస్ఏంజెలెస్ ఒలింపిక్స్లో అయిదు క్రీడలను చేర్చిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ.. ఆ పోస్టర్లో క్రికెట్కు విరాట్ కోహ్లినే గుర్తుగా పెట్టింది. కోహ్లితో పాటు కొంతమంది సీనియర్ క్రికెటర్లకు కూడా 2028 ఒలింపిక్స్లో ఆడడం అంత తేలికేం కాదు. కానీ ఏ ఆటగాడికైనా ఒలింపిక్స్లో ఆడడం పెద్ద కల. క్రికెటర్లకు ఆ అవకాశం ఎప్పుడూ లేదు. ఇలాంటి అరుదైన అవకాశాన్ని కోహ్లి మరి ఒడిసిపడతాడో లేదో చూడాలి. అయితే ఫిట్నెస్కు మారుపేరు అయిన విరాట్ అంతర్జాతీయ క్రికెట్లో మరో మూడేళ్లు కచ్చితంగా కొనసాగే అవకాశం ఉంది. విపరీతమైన షెడ్యూల్ కారణంగా అలసిపోతున్న ఈ భారత స్టార్.. మున్ముందు అన్ని ఫార్మాట్లలో ఆడతాడా అనేది కీలకం. ముఖ్యంగా వేగం అవసరమైన టీ20ల్లో కొనసాగుతాడా అనేది ముఖ్యం. కోహ్లి ఒక్కడికే కాదు రోహిత్కు 41 ఏళ్లు, సూర్యకుమార్కు 37 ఏళ్లు, పాండ్యకు 34 ఏళ్లు వచ్చేస్తాయి అప్పటికి. మరి వీరిలో ఎందరు లాస్ఏంజెలస్ విమానం ఎక్కుతారో భవిష్యత్తే తేల్చాలి.
స్క్వాష్లో ఆ ముగ్గురు
భారత స్క్వాష్లో సౌరభ్ ఘోషల్, దీపిక పల్లికల్, జోష్న చిన్నప్ప వెటరన్ స్టార్లు. వీళ్లిద్దరిది కూడా విరాట్ లాంటి పరిస్థితే. ఒలింపిక్స్లో స్క్వాష్ను చేర్చడం కోసం ఏళ్ల తరబడి పోరాటం సాగుతోంది. ఇన్నాళ్లకు ఈ కల ఫలించింది. అయితే భారత్లో స్క్వాష్కు పర్యాయపదంగా నిలిచిన సౌరభ్ ఘోషల్, దీపిక పల్లికల్లకు లాస్ఏంజెలెస్ ఒలింపిక్స్ వరకు కొనసాగడం కత్తిమీద సామే. ప్రస్తుతం సౌరభ్ ఘోషల్ వయసు 37 ఏళ్లు.. జోష్నకు 37 ఏళ్లు.. దీపికకు 32 ఏళ్లు వచ్చేశాయి. మరో అయిదేళ్ల పాటు కెరీర్ను కొనసాగించాలంటే వీళ్లిద్దరికి అంత సులభం కాదు. ఇటీవల ఆసియా క్రీడల్లో పతకాలు గెలిచి సత్తా చాటిన సౌరభ్, దీపిక, జోష్న.. కెరీర్ చరమాంకంలో ఉన్నారు. వీరితో పాటు హరీందర్పాల్ సింగ్ కూడా చిన్నోడేం కాదు. అతడికి 39 ఏళ్లు. ఈ నేపథ్యంలో 2028 ఒలింపిక్స్ వరకు కొనసాగడం పెద్ద సవాల్.
దీపికకు ఇంకా కష్టం
దీపిక తల్లి అయిన తర్వాత పునరాగమనం చేసి ఆసియా క్రీడల్లో పతకం సాధించి సత్తా చాటింది. సౌరభ్ కూడా ఇదే తన చివరి క్రీడలు అన్నట్లుగా సంకేతాలు ఇచ్చాడు. అయితే స్క్వాష్ను ఒలింపిక్స్లో చేరుస్తున్నామన్న వార్త ఈ వెటరన్ క్రీడాకారుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ఎందుకంటే ఎందరో స్క్వాష్ స్టార్లు ఒలింపిక్స్లో ఆడాలన్న కల తీరకుండానే రిటైర్ అయ్యారు. ఎనిమిదిసార్లు ప్రపంచ ఛాంపియన్ నికోల్ డేవిడ్ (మలేసియా) ఇందుకు ఉదాహరణ. ఈ నేపథ్యంలో 2028 వరకు కెరీర్ను కొనసాగించేందుకు పునరాలోచన చేస్తున్నట్లు ఘోషల్ చెప్పాడు. సౌరభ్ సంగతి పక్కనపెడితే దీపక మున్ముందు కనిపిస్తుందా అనేది ఆసక్తికరం. ఇక ఆసియా క్రీడల్లో డబుల్స్లో రాణించినా వెటరన్ జోష్న కూడా కెరీర్ ముగించే దశలోనే ఉంది. ఆమెకు కూడా 2028 ఒలింపిక్స్లో ఆడడం అంత సులభం కాదు. ఈ మరి వెటరన్లు కెరీర్లు కొనసాగిస్తారా.. లేక 2028 ఒలింపిక్స్కు ముందే ముగిస్తారా అనేది చూడాలి.
-ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
తాజా వార్తలు (Latest News)
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు