Olympic Games 2028: ఆ ఆనందం దక్కుతుందా..? ఒలింపిక్స్లో ఆ స్టార్లు ఆడేనా?
ఒలింపిక్స్లో (Olympic Games) క్రికెట్ను చూస్తామనే ఆనందం ఒక వైపు ఉన్నా.. ఇప్పుడున్న సీనియర్లను మెగా సంబరంలో చూస్తామా..? లేదా అనే సందిగ్ధత ప్రతి అభిమాని మదిలో మెదిలే ప్రశ్న.
ఒలింపిక్స్లో (Olympic Games) క్రికెట్, స్క్వాష్! నిజంగా మన క్రీడాకారులకు ఇది శుభవార్తే. దశాబ్దాల నిరీక్షణకు తెరదించిన సమయమిది. 2028 లాస్ఏంజెలెస్ ఒలింపిక్స్ ఆరంభమయ్యే నాటికి ఇప్పుడు ఆడుతున్న క్రీడాకారుల్లో ఎంతమంది ఉంటారు? ముఖ్యంగా భారత సూపర్స్టార్ విరాట్ కోహ్లికి ఈ అవకాశం చిక్కుతుందా అనేది సందేహం!
విరాట్ కోహ్లి ప్రస్తుత వయసు 34 ఏళ్లు. 2028 లాస్ఏంజెలెస్ ఒలింపిక్స్ నాటికి 39 ఏళ్లు పూర్తవుతాయి. అప్పటివరకు కోహ్లి కెరీర్ను కొనసాగించడమే ఎక్కువ. ఒకవేళ ఆడినా టీ20 ఫార్మాట్లో కొనసాగుతాడా అనేది కూడా అనుమానం. అందుకే ఒలింపిక్స్లో ఈ స్టార్ ఆటగాడు జట్టులో ఉంటాడా అనే అనుమానాలున్నాయి. లాస్ఏంజెలెస్ ఒలింపిక్స్లో అయిదు క్రీడలను చేర్చిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ.. ఆ పోస్టర్లో క్రికెట్కు విరాట్ కోహ్లినే గుర్తుగా పెట్టింది. కోహ్లితో పాటు కొంతమంది సీనియర్ క్రికెటర్లకు కూడా 2028 ఒలింపిక్స్లో ఆడడం అంత తేలికేం కాదు. కానీ ఏ ఆటగాడికైనా ఒలింపిక్స్లో ఆడడం పెద్ద కల. క్రికెటర్లకు ఆ అవకాశం ఎప్పుడూ లేదు. ఇలాంటి అరుదైన అవకాశాన్ని కోహ్లి మరి ఒడిసిపడతాడో లేదో చూడాలి. అయితే ఫిట్నెస్కు మారుపేరు అయిన విరాట్ అంతర్జాతీయ క్రికెట్లో మరో మూడేళ్లు కచ్చితంగా కొనసాగే అవకాశం ఉంది. విపరీతమైన షెడ్యూల్ కారణంగా అలసిపోతున్న ఈ భారత స్టార్.. మున్ముందు అన్ని ఫార్మాట్లలో ఆడతాడా అనేది కీలకం. ముఖ్యంగా వేగం అవసరమైన టీ20ల్లో కొనసాగుతాడా అనేది ముఖ్యం. కోహ్లి ఒక్కడికే కాదు రోహిత్కు 41 ఏళ్లు, సూర్యకుమార్కు 37 ఏళ్లు, పాండ్యకు 34 ఏళ్లు వచ్చేస్తాయి అప్పటికి. మరి వీరిలో ఎందరు లాస్ఏంజెలస్ విమానం ఎక్కుతారో భవిష్యత్తే తేల్చాలి.
స్క్వాష్లో ఆ ముగ్గురు
భారత స్క్వాష్లో సౌరభ్ ఘోషల్, దీపిక పల్లికల్, జోష్న చిన్నప్ప వెటరన్ స్టార్లు. వీళ్లిద్దరిది కూడా విరాట్ లాంటి పరిస్థితే. ఒలింపిక్స్లో స్క్వాష్ను చేర్చడం కోసం ఏళ్ల తరబడి పోరాటం సాగుతోంది. ఇన్నాళ్లకు ఈ కల ఫలించింది. అయితే భారత్లో స్క్వాష్కు పర్యాయపదంగా నిలిచిన సౌరభ్ ఘోషల్, దీపిక పల్లికల్లకు లాస్ఏంజెలెస్ ఒలింపిక్స్ వరకు కొనసాగడం కత్తిమీద సామే. ప్రస్తుతం సౌరభ్ ఘోషల్ వయసు 37 ఏళ్లు.. జోష్నకు 37 ఏళ్లు.. దీపికకు 32 ఏళ్లు వచ్చేశాయి. మరో అయిదేళ్ల పాటు కెరీర్ను కొనసాగించాలంటే వీళ్లిద్దరికి అంత సులభం కాదు. ఇటీవల ఆసియా క్రీడల్లో పతకాలు గెలిచి సత్తా చాటిన సౌరభ్, దీపిక, జోష్న.. కెరీర్ చరమాంకంలో ఉన్నారు. వీరితో పాటు హరీందర్పాల్ సింగ్ కూడా చిన్నోడేం కాదు. అతడికి 39 ఏళ్లు. ఈ నేపథ్యంలో 2028 ఒలింపిక్స్ వరకు కొనసాగడం పెద్ద సవాల్.
దీపికకు ఇంకా కష్టం
దీపిక తల్లి అయిన తర్వాత పునరాగమనం చేసి ఆసియా క్రీడల్లో పతకం సాధించి సత్తా చాటింది. సౌరభ్ కూడా ఇదే తన చివరి క్రీడలు అన్నట్లుగా సంకేతాలు ఇచ్చాడు. అయితే స్క్వాష్ను ఒలింపిక్స్లో చేరుస్తున్నామన్న వార్త ఈ వెటరన్ క్రీడాకారుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ఎందుకంటే ఎందరో స్క్వాష్ స్టార్లు ఒలింపిక్స్లో ఆడాలన్న కల తీరకుండానే రిటైర్ అయ్యారు. ఎనిమిదిసార్లు ప్రపంచ ఛాంపియన్ నికోల్ డేవిడ్ (మలేసియా) ఇందుకు ఉదాహరణ. ఈ నేపథ్యంలో 2028 వరకు కెరీర్ను కొనసాగించేందుకు పునరాలోచన చేస్తున్నట్లు ఘోషల్ చెప్పాడు. సౌరభ్ సంగతి పక్కనపెడితే దీపక మున్ముందు కనిపిస్తుందా అనేది ఆసక్తికరం. ఇక ఆసియా క్రీడల్లో డబుల్స్లో రాణించినా వెటరన్ జోష్న కూడా కెరీర్ ముగించే దశలోనే ఉంది. ఆమెకు కూడా 2028 ఒలింపిక్స్లో ఆడడం అంత సులభం కాదు. ఈ మరి వెటరన్లు కెరీర్లు కొనసాగిస్తారా.. లేక 2028 ఒలింపిక్స్కు ముందే ముగిస్తారా అనేది చూడాలి.
-ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండుసార్లు విమానం దారి మళ్లింపు.. కోల్కతా ఆటగాళ్లకు తప్పని తిప్పలు
కోల్కతా నైట్రైడర్స్ (Kolkata Knight Riders) ఆటగాళ్లు ప్రయాణిస్తున్న ఛార్టర్డ్ విమానాన్ని ప్రతికూల వాతావరణం కారణంగా రెండుసార్లు దారి మళ్లించారు. -
సన్రైజర్స్పై సూర్యప్రతాపం
ఐపీఎల్-17లో 11 మ్యాచ్లాడి ఎనిమిది ఓడి ఇప్పటికే దాదాపుగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబయి ఇండియన్స్.. ఇప్పుడు వేరే జట్ల అవకాశాలను దెబ్బ తీసే పనిలో పడింది. ముందుగా ఆ జట్టు సన్రైజర్స్ హైదరాబాద్కు ఝలక్ ఇచ్చింది. -
‘లక్ష్య’ జ్యోతిక అదుర్స్
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే పోటీలు. ఒలింపిక్స్లో అర్హత సాధించడానికి భారత్కు ఇదే చివరి అవకాశం. తీవ్ర ఒత్తిడిలో బరిలో దిగింది మహిళల జట్టు. ఆరంభంలో పోటీ చూస్తే ఒలింపిక్స్కు అర్హత కష్టమే అనిపించింది. అయితే.. రెండో లెగ్లో బ్యాటన్ అందుకున్న తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ కథ మార్చేసింది. -
ఇది హైబ్రిడ్ రకం!
హైబ్రిడ్ కూరగాయలు, హైబ్రిడ్ పండ్ల గురించి వింటుంటాం.. చూస్తుంటాం! కానీ ఇప్పుడు ‘హైబ్రిడ్ పిచ్’ అనే కొత్త మాట తెరపైకి వచ్చింది. పిచ్లో హైబ్రిడ్ ఏంటి..? అని ఆశ్చర్యం కలుగుతోందా? అదే విశేషం. -
43 ఏళ్ల వయసులో.. పొట్టి కప్పులో
అత్యంత పెద్ద వయసులో టీ20 ప్రపంచకప్లో ఆడిన ఆటగాడిగా ఉగాండా ఆఫ్స్పిన్నర్ ఫ్రాంక్ సుబుగా రికార్డు సృష్టించనున్నాడు. టోర్నీ కోసం సోమవారం ఉగాండా క్రికెట్ సంఘం ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో 43 ఏళ్ల సుబుగాకు చోటు దక్కింది. -
టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ జెర్సీ ఇదే
టీ20 ప్రపంచకప్ కోసం టీమ్ఇండియా అధికారిక టీ20 జెర్సీని బీసీసీఐ సోమవారం ఆవిష్కరించింది. జెర్సీ నీలం, నారింజ రంగుల్లో ఉంది. టోర్నీ జూన్ 2న ఆరంభం కానుంది. -
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
మైదానంలో సునీల్ నరైన్ చాలా కామ్గా సీరియస్గా ఉండటాన్ని ఫ్యాన్స్ గమనించే ఉంటారు. వికెట్లు తీసినా పెద్దగా ఆవేశపడకుండా.. ప్రశాంతంగా కనిపిస్తాడు. దీనిపై అతడి సహచరులు చెప్పిన ఆసక్తికర విషయాలు.. -
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
టీ20 వరల్డ్కప్నకు సంబంధించి టీమిండియా జెర్సీని అడిడాస్ ఆవిష్కరించింది. మే 7 నుంచి స్టోర్లలో లభిస్తాయని వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘దయచేసి మా దేశానికి రండి’.. భారతీయులను వేడుకుంటున్న మాల్దీవులు
-
రూ.10వేల లంచం కేసును లాగితే.. బయటపడిన నోట్ల గుట్టలు..!
-
రెండుసార్లు విమానం దారి మళ్లింపు.. కోల్కతా ఆటగాళ్లకు తప్పని తిప్పలు
-
వైఎస్ షర్మిలపై కేసు నమోదు
-
పన్నూ కేసులో అమెరికా ఆశలపై నీళ్లుజల్లిన చెక్ రిపబ్లిక్ కోర్టు..!
-
ఆ హీరోని అనుకున్నారు.. అల్లు అర్జున్ను ఫైనల్ చేశారు: 20 ఏళ్ల ‘ఆర్య’ విశేషాలివీ..