Rishabh Pant: రిషభ్ పంత్కు జరిమానా విధించాల్సిందే: ఆడమ్ గిల్క్రిస్ట్
లఖ్నవూతో మ్యాచ్లో దిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) అంపైర్లతో వాగ్వాదానికి దిగడం సరైంది కాదని మాజీ క్రికెటర్ గిల్క్రిస్ట్ వ్యాఖ్యానించాడు.
ఇంటర్నెట్ డెస్క్: లఖ్నవూతో నిన్న జరిగిన మ్యాచ్లో దిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) అంపైర్తో స్వల్ప వాగ్వాదానికి దిగాడు. ఇషాంత్ శర్మ బౌలింగ్లో (4వ ఓవర్) దేవదుత్ పడిక్కల్ బంతిని ఎదుర్కొన్నాడు. లెగ్సైడ్ వెళ్లడంతో ఫీల్డ్ అంపైర్ వైడ్గా సిగ్నల్ ఇచ్చాడు. పంత్ వెంటనే రివ్యూ కోసం అడిగినట్లు కనిపించింది. సమీక్షలో వైడ్గానే నిర్ధరణ అయింది. ఆ తర్వాత తాను రివ్యూ అడగలేదని అంపైర్తో పంత్ చర్చించాడు. దీనిపై ఆసీస్ మాజీ వికెట్ కీపర్, కామెంటేటర్ ఆడమ్ గిల్క్రిస్ట్ స్పందిస్తూ.. పంత్ చర్యలపై అసహనం వ్యక్తం చేశాడు.
‘‘ఫీల్డ్ అంపైర్లకు మ్యాచ్పై మరింత నియంత్రణ అవసరం. ఏ ఫార్మాట్లోనైనా తప్పదు. ఇంకాస్త సమర్థవంతంగా విధులను నిర్వర్తించాలంటే అంపైర్లకు అధికారం ఉండాలి. పంత్ రివ్యూ అడిగాడా? లేదా? అనేది ఇక్కడ వివాదంగా మారింది. వారి మధ్య సమాచార లోపం జరిగింది. దాని కోసం నాలుగు నిమిషాల పాటు చర్చించాల్సిన అవసరం లేదు. పంత్ అయినా, వేరొక ప్లేయర్ ఫిర్యాదు చేసినా అంపైర్ మాత్రం ‘ఇది ముగిసిపోయింది’ అనే సమాధానం ఇచ్చేలా ఉండాలి. అలాగే మాట్లాడుతూ ఉంటే ప్లేయర్లకు జరిమానా విధించాలి’’ అని గిల్క్రిస్ట్ వ్యాఖ్యానించాడు.
కాస్త రిలీఫ్ ఇచ్చే విజయం: పంత్
‘‘వరుసగా రెండు మ్యాచ్లు ఓడిపోవడంతో నిరాశకు గురయ్యాం. ఎలాగైనా గెలిచి తీరాలనే నిర్ణయంతో బరిలోకి దిగాం. ఛాంపియన్గా ఆడాలని మ్యాచ్కు ముందే అనుకున్నాం. బౌలింగ్ విషయంలో వ్యక్తిగతంగా బాధ్యత తీసుకోవాలని చెప్పాం. జట్టు కాంబినేషన్పై చర్చిస్తూనే ఉంటాం. సరైన తుది జట్టుతోనే బరిలోకి దిగాం. కొందరు ఆటగాళ్లకు గాయాలు కావడం మమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తోంది. వచ్చిన అవకాశాన్ని ఫ్రేజర్ చక్కగా వినియోగించుకున్నాడు. కొత్త వన్డౌన్ బ్యాటర్ వచ్చేశాడు. టోర్నీలో ఇలాంటి ఆటతీరే కొనసాగిస్తాడని ఆశిస్తున్నాం’’ అని పంత్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి