Rishabh Pant: రిషభ్ పంత్కు జరిమానా విధించాల్సిందే: ఆడమ్ గిల్క్రిస్ట్
లఖ్నవూతో మ్యాచ్లో దిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) అంపైర్లతో వాగ్వాదానికి దిగడం సరైంది కాదని మాజీ క్రికెటర్ గిల్క్రిస్ట్ వ్యాఖ్యానించాడు.
ఇంటర్నెట్ డెస్క్: లఖ్నవూతో నిన్న జరిగిన మ్యాచ్లో దిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) అంపైర్తో స్వల్ప వాగ్వాదానికి దిగాడు. ఇషాంత్ శర్మ బౌలింగ్లో (4వ ఓవర్) దేవదుత్ పడిక్కల్ బంతిని ఎదుర్కొన్నాడు. లెగ్సైడ్ వెళ్లడంతో ఫీల్డ్ అంపైర్ వైడ్గా సిగ్నల్ ఇచ్చాడు. పంత్ వెంటనే రివ్యూ కోసం అడిగినట్లు కనిపించింది. సమీక్షలో వైడ్గానే నిర్ధరణ అయింది. ఆ తర్వాత తాను రివ్యూ అడగలేదని అంపైర్తో పంత్ చర్చించాడు. దీనిపై ఆసీస్ మాజీ వికెట్ కీపర్, కామెంటేటర్ ఆడమ్ గిల్క్రిస్ట్ స్పందిస్తూ.. పంత్ చర్యలపై అసహనం వ్యక్తం చేశాడు.
‘‘ఫీల్డ్ అంపైర్లకు మ్యాచ్పై మరింత నియంత్రణ అవసరం. ఏ ఫార్మాట్లోనైనా తప్పదు. ఇంకాస్త సమర్థవంతంగా విధులను నిర్వర్తించాలంటే అంపైర్లకు అధికారం ఉండాలి. పంత్ రివ్యూ అడిగాడా? లేదా? అనేది ఇక్కడ వివాదంగా మారింది. వారి మధ్య సమాచార లోపం జరిగింది. దాని కోసం నాలుగు నిమిషాల పాటు చర్చించాల్సిన అవసరం లేదు. పంత్ అయినా, వేరొక ప్లేయర్ ఫిర్యాదు చేసినా అంపైర్ మాత్రం ‘ఇది ముగిసిపోయింది’ అనే సమాధానం ఇచ్చేలా ఉండాలి. అలాగే మాట్లాడుతూ ఉంటే ప్లేయర్లకు జరిమానా విధించాలి’’ అని గిల్క్రిస్ట్ వ్యాఖ్యానించాడు.
కాస్త రిలీఫ్ ఇచ్చే విజయం: పంత్
‘‘వరుసగా రెండు మ్యాచ్లు ఓడిపోవడంతో నిరాశకు గురయ్యాం. ఎలాగైనా గెలిచి తీరాలనే నిర్ణయంతో బరిలోకి దిగాం. ఛాంపియన్గా ఆడాలని మ్యాచ్కు ముందే అనుకున్నాం. బౌలింగ్ విషయంలో వ్యక్తిగతంగా బాధ్యత తీసుకోవాలని చెప్పాం. జట్టు కాంబినేషన్పై చర్చిస్తూనే ఉంటాం. సరైన తుది జట్టుతోనే బరిలోకి దిగాం. కొందరు ఆటగాళ్లకు గాయాలు కావడం మమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తోంది. వచ్చిన అవకాశాన్ని ఫ్రేజర్ చక్కగా వినియోగించుకున్నాడు. కొత్త వన్డౌన్ బ్యాటర్ వచ్చేశాడు. టోర్నీలో ఇలాంటి ఆటతీరే కొనసాగిస్తాడని ఆశిస్తున్నాం’’ అని పంత్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముంబయి కథ ముగిసె!
ఐపీఎల్-17లో ఇక ముంబయి ఇండియన్స్ అభిమానులకు ఫలితాల గురించి బెంగ లేదు! ప్లేఆఫ్స్ సమీకరణాల గురించి వాళ్లు బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన పని లేదు! ఈ సీజన్లో ముంబయి కథ ముగిసినట్లే. -
వన్డేలు, టీ20ల్లో భారత్ నం.1
ఐసీసీ ర్యాంకింగ్స్లో భారత జట్టు వన్డేలు, టీ20ల్లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. కానీ టెస్టుల్లో మాత్రం నంబర్వన్ ర్యాంకు టీమ్ఇండియా చేజారింది. ఆస్ట్రేలియా తిరిగి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. -
అమెరికా జట్టులో మనోళ్లదే జోరు
టీ20 ప్రపంచకప్ కోసం శుక్రవారం ప్రకటించిన అమెరికా జట్టులో భారత సంతతి ఆటగాళ్లే ఎక్కువగా ఉన్నారు. 15 మంది ఆటగాళ్ల జాబితాలో ఏడుగురికి భారత మూలాలుండటం విశేషం. -
రెండో టైటిల్ ఎవరికో?
గతేడాది సెప్టెంబర్లో ఆరంభం.. ఆరు నెలలకు పైగా ఫుట్బాల్ వినోదం.. 12 జట్లు.. అలరించిన 138 మ్యాచ్లు. ఇంత సుదీర్ఘంగా సాగిన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) పదో సీజన్లో ఆఖరి సమరానికి సమయం ఆసన్నమైంది. -
విదేశాల్లో పోటీలకు జ్యోతి
పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించే దిశగా విదేశాల్లో పోటీల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ సంచలన స్ప్రింటర్ జ్యోతి యర్రాజికి అనుమతి లభించింది. జ్యోతితో పాటు లాంగ్జంప్ అథ్లెట్ శైలి సింగ్ ప్రతిపాదనలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. -
ఐపీఎల్లో అదే నా పాత్ర
ఆరంభంలో వికెట్లు కోల్పోయిన జట్టు ఇన్నింగ్స్ను నిర్మించడమే తన పాత్ర కర్తవ్యమని సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి చెప్పాడు. రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో 35/2తో కష్టాల్లో పడ్డ జట్టును 76 పరుగుల అజేయ ఇన్నింగ్స్తో నితీశ్ ఆదుకున్న సంగతి తెలిసిందే. -
ఇష్టమైన ఆటగాడిగా నితీశ్
తనకు ఇష్టమైన క్రికెటర్లలో ఒకడిగా సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఆటగాడు నితీశ్ రెడ్డి మారుతున్నాడని ఆస్ట్రేలియా దిగ్గజ ఆల్రౌండర్ షేన్ వాట్సన్ పేర్కొన్నాడు. ‘‘కచ్చితంగా చూడగలిగే నాకిష్టమైన ఆటగాళ్లలో ఒకడిగా నితీశ్ మారుతున్నాడు. -
ప్రపంచ రిలే బరిలో ‘లక్ష్య’ జ్యోతిక
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే టోర్నీలో భారత జట్టు తన అదృష్టం పరీక్షించుకోనుంది. శనివారం ప్రారంభమయ్యే ఈ పోటీల్లో పారిస్ ఒలింపిక్స్ బెర్తే లక్ష్యంగా భారత బృందం బరిలో దిగుతుంది. -
రింకుకు ఇది ఆరంభమే: గంగూలీ
టీ20 ప్రపంచకప్కు ఎంపిక కానంత మాత్రాన బాధపడక్కర్లేదని రింకు సింగ్కు ఇది ఆరంభం మాత్రమేనని భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. ‘‘టీ20 ప్రపంచకప్లో ఎక్కువ మ్యాచ్లు జరిగేది వెస్టిండీస్లో. -
బంగ్లాదే తొలి టీ20
తంజిద్ హసన్ (67 నాటౌట్; 47 బంతుల్లో 8×4, 2×6) సత్తా చాటడంతో జింబాబ్వేతో టీ20 సిరీస్లో బంగ్లాదేశ్ బోణీ కొట్టింది. శుక్రవారం తొలి టీ20లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
తాజా వార్తలు (Latest News)
-
ముందు మీరు రాయ్బరేలీలో గెలవండి.. రాహుల్కు సలహా ఇచ్చిన చెస్ దిగ్గజం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం