Dhoni-Jadeja: జడ్డూను అదే బాధించిందేమో.. వారి మధ్య వివాదాల్లేవు: సీఎస్కే సీఈవో
ధోనీ - జడేజా మధ్య (Dhoni - Jadeja) సోదరభావం ఉంటుంది. గురు శిష్యుల అనుబంధమూ కనిపిస్తుంది. కానీ, ఇటీవల ఐపీఎల్ 2023 (IPL 2023) సందర్భంగా వారి మధ్య జరిగిన స్వల్ప చర్చను విభేదాలుగా నెట్టింట ప్రచారం జరిగింది. తాజాగా దీనిపై సీఎస్కే సీఈవో స్పందించారు.
ఇంటర్నెట్ డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఎంఎస్ ధోనీ, స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (MSD -Jaddu) మధ్య ఎలాంటి వివాదాలు లేవని సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ స్పష్టం చేశారు. అయితే, జడేజాను మాత్రం ఓ విషయం బాధపెట్టి ఉండొచ్చని తన అభిప్రాయంగా చెప్పారు. తన ఔట్ కోసం సీఎస్కే అభిమానులు ప్రార్థిస్తుంటారని, ధోనీ బ్యాటింగ్ను చూడాలనేదే వారి ఆకాంక్షగా జడేజా గతంలో పేర్కొన్నాడు. తాజాగా సీఎస్కే సీఈవో ఇదే విషయంపై స్పందించారు.
‘‘జడేజా బౌలింగ్ సూపర్బ్. అందులో ఎలాంటి అనుమానం లేదు. అయితే, సీఎస్కే బ్యాటింగ్ లైనప్ రుతురాజ్, కాన్వే, మొయిన్, రహానెతో టాప్ ఆర్డర్ ఉంటుంది. జడేజా బ్యాటింగ్కు వచ్చేసమయానికి కేవలం 10 బంతులే ఉంటాయి. అలాంటి వేళ ఒక్కోసారి క్లిక్ అవ్వొచ్చు. లేకపోతే కొట్టకుండా ఔటయ్యే అవకాశాలూ ఉన్నాయి. అతడి తర్వాత ధోనీ బ్యాటింగ్కు వస్తాడని జడేజాకూ తెలుసు. ఓ రెండు లేదా మూడు బంతులు ఎదుర్కొంటాడు. స్టేడియంలోని ప్రేక్షకులు ధోనీని ఆహ్వానించేందుకు జడేజా త్వరగా ఔటై పోవాలని కోరుకొని ఉంటారు. ఇదే జడేజాకు బాధ కలిగించే అవకాశముంది. జడ్డూనే కాదు మరే ఇతర ఆటగాడికైనా ఇలాంటి పరిస్థితే ఉంటుంది. దాంతో కాస్త ఒత్తిడికి గురి కావడం సహజం. అయితే, దీనిపై జడేజా ఎలాంటి ఫిర్యాదు చేయలేదనేది మనం గమనించాలి. తన ట్వీట్లోనూ ఇలాంటి అర్థం వచ్చేలా ఎప్పుడూ పోస్టులు పెట్టలేదు.
గేమ్లో ఇవన్నీ సాధారణం. దిల్లీతో మ్యాచ్ తర్వాత అభిమానులు చాలా వీడియోలను చూసి ఉంటారు. నేనేదో జడేజాను శాంతింపజేయడానికి ప్రయత్నించానని అనుకున్నారు. కానీ, అక్కడ అదేం జరగలేదు. కేవలం మ్యాచ్ గురించి మాత్రమే మాట్లాడా. అంతేకానీ, మరే ఇతర విషయాలు మా మధ్య చర్చకు రాలేదు. జట్టు వాతావరణం ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికీ తెలుసు. డ్రెస్సింగ్ రూమ్లో ఏం జరింగిందనేది బయటకు ఎవరూ వెల్లడించరు. మాకైతే ఎలాంటి సమస్య కనిపించలేదు. ధోనీ పట్ల జడేజాకూ ఎప్పుడూ గౌరవభావమే ఉంది. ఫైనల్ తర్వాత కూడా కప్ను ధోనీకి అంకితం చేసినట్లు జడేజా ఇంటర్వ్యూల్లోనూ చెప్పాడు’’ అని కాశీ విశ్వనాథం వెల్లడించారు.
అప్పుడేం జరిగిందంటే..?
ఐపీఎల్ 2023 సీజన్ సందర్భంగా దిల్లీతో మ్యాచ్లో ధోనీ, జడేజా మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు అప్పట్లో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో మరోసారి వారి మధ్య విభేదాలు తలెత్తినట్లు కామెంట్లు వచ్చాయి. ‘కర్మ అనేది తప్పదు. వెంటనే కావచ్చు.. లేదా కాస్త ఆలస్యంగానైనా తిరిగి వస్తుంది’ అని జడేజా పోస్టు పెట్టాడు. అయితే, ఫైనల్లో జడేజానే వరుసగా సిక్స్, ఫోర్ కొట్టి సీఎస్కేకు ఐదో టైటిల్ను అందించాడు. దీంతో జడేజాను ఎత్తుకుని మరీ ధోనీ సంబరాలు జరిపాడు. అలాగే కప్ను కూడా జడేజాతోపాటు ఐపీఎల్కు వీడ్కోలు పలికిన అంబటిరాయుడుతో కలిసి అందుకోవడం సంచలనంగా మారింది. దీంతో వీరి మధ్య ఎలాంటి వివాదాలు లేవని తేలిపోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.