Delhi Vs Chennai: రన్రేట్ విలువేంటో ధోనీకి తెలుసు.. మేం అక్కడ వెనకబడిపోయాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
చాలా రోజుల తర్వాత మైదానంలో ఎంఎస్ ధోనీ బ్యాటింగ్ను వీక్షించే అవకాశం అభిమానులకు దక్కింది. దిల్లీతో మ్యాచ్లో దూకుడుగా ఆడేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్లో చెన్నైకి తొలి ఓటమి ఎదురైంది. విశాఖపట్నం వేదికగా జరిగిన మ్యాచ్లో దిల్లీ 20 పరుగుల తేడాతో గెలిచింది. ఎంఎస్ ధోనీ 16 బంతుల్లోనే 37 పరుగులు చేయడం వల్ల ఓటమి అంతరం తగ్గింది. ఈ సీజన్లో తొలిసారి బ్యాటింగ్ చేసిన ధోనీ అభిమానులను అలరించాడు. మహీ ముందే బ్యాటింగ్కు వచ్చుంటే చెన్నై విజయం సాధించే అవకాశం ఉండేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. దీనిపై చెన్నై ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందించాడు.
‘‘ధోనీ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. తీవ్రమైన గాయం నుంచి కోలుకుని వచ్చాక.. ఇలాంటి ఆటతీరును ఊహించలేదు. దూకుడైన బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. క్లిష్టమైన మ్యాచ్లోనూ మాకు సానుకూల అంశం ఇదే. అతడి వల్లే కేవలం 20 పరుగుల తేడాతోనే మ్యాచ్ను కోల్పోయాం. రన్రేట్ ఎంత ముఖ్యమో ధోనీకి తెలుసు. దానికి అతడు ఆడిన విధానమే నిదర్శనం. ఈ ఓటమిపై సమీక్షించుకుంటాం. బ్యాటింగ్లో మేం ఆరంభంలోనే వెనుకబడ్డాం. బౌలింగ్లోనూ మొదట్లో ఎక్కువ పరుగులిచ్చాం. డేవిడ్ వార్నర్, రిషభ్ పంత్ దూకుడుగా ఆడటంతో దిల్లీ భారీ స్కోరు సాధించగలిగింది’’ అని ఫ్లెమింగ్ వ్యాఖ్యానించాడు.
కాలమే సమాధానం చెబుతుంది: రవిశాస్త్రి
చెన్నై కెప్టెన్సీని ధోనీ వదిలేయడంపై భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దిల్లీతో చెన్నై మ్యాచ్కు అతడు కామెంటేటర్గా వ్యవహరించాడు. ‘‘ధోనీకిదే చివరి సీజన్ అని చెబుతున్నారు. అది అతడి శరీరం, ఫిట్నెస్పై ఆధారపడి ఉంటుంది. ఈ సీజన్ మొత్తం ఆడతాడా? కొన్ని మ్యాచ్లకే పరిమితం అవుతాడా? అనేది కాలమే చెబుతుంది. కెప్టెన్సీ త్యజించడంలోనూ ధోనీ చాలా ముందు చూపుతో వ్యవహరించాడు. గతంలో జడేజా మాదిరిగా కాకుండా.. ఈసారి రుతురాజ్ విషయంలో పూర్తిస్వేచ్ఛ ఇచ్చేలా కెప్టెన్సీని వదిలేశాడు. ఎలాంటి ఒత్తిడి లేకుండా కొత్త కెప్టెన్ నిర్ణయాలు తీసుకుంటున్నాడు’’ అని రవిశాస్త్రి వెల్లడించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
టెస్టుల్లో సచిన్ తెందూల్కర్ అత్యధిక పరుగుల రికార్డును ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ (Joe Root) బ్రేక్ చేసే అవకాశముందని భారత మాజీ వికెట్కీపర్ దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) అభిప్రాయపడ్డాడు. -
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
Paris Olympics 2024: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో షూటర్లు సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా నిరాశపర్చారు. -
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ