Hyderabad Vs Chennai: రనౌట్ అప్పీలుపై వెనక్కి.. ధోనీని ఆలస్యంగా రప్పించేందుకేనా..?
సొంతమైదానంలో చెన్నైపై హైదరాబాద్ అద్భుత విజయం సాధించింది. అయితే, పాట్ కమిన్స్ తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశమైంది.
ఇంటర్నెట్ డెస్క్: ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో చెన్నై స్టార్ బ్యాటర్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) చివరి ఓవర్లో క్రీజ్లోకి వచ్చాడు. కేవలం రెండు బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. అయితే, అతడు ఇంకాస్త ముందుగానే బ్యాటింగ్కు వచ్చే అవకాశం ఉండేదని.. హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ (Pat Cummins) నిర్ణయం వల్లే అలా జరగలేదని సోషల్ మీడియాలో చర్చకు తెరలేచింది. భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ పెట్టిన పోస్టు వైరల్గా మారింది. ఇంతకీ అసలేం జరిగిందంటే?
హైదరాబాద్ పేసర్ భువనేశ్వర్ కుమార్ (Bhuvneswar Kumar) ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేశాడు. నాలుగో బంతిని రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఎదుర్కొన్నాడు. అద్భుతమైన యార్కర్ సంధించడంతో లెగ్సైడ్ ఆడే క్రమంలో బౌలర్ వద్దకే బంతి వెళ్లింది. ఈ క్రమంలో రన్ కోసం జడ్డూ కాస్త ముందుకు పరిగెత్తాడు. అయితే, భువీ బంతిని తీసుకొని స్ట్రైకర్ వికెట్ల వైపు విసిరాడు. అప్పుడే జడేజా వికెట్లను కవర్ చేసేలా వెనక్కి వెళ్లాడు. దీంతో బంతి జడేజాను తాకి పక్కకు వెళ్లింది. బ్యాటర్ ఉద్దేశపూర్వకంగా బంతిని అడ్డుకుంటే.. రనౌట్ అప్పీల్కు ఛాన్స్ ఉంది. వికెట్ కీపర్ క్లాసెన్, బౌలర్ భువీ ఇందు కోసం ప్రయత్నించినా.. కమిన్స్ మాత్రం వద్దని ఆగిపోయాడు. దీంతో ఫెయిర్ప్లే పాయింట్లు హైదరాబాద్ ఖాతాలో పడినప్పటికీ.. ధోనీ క్రీజులోకి రాకుండా ఉండేందుకే ఇలా చేశాడని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
‘‘అప్పీలును వెనక్కి తీసుకోవడంపై పాట్ కమిన్స్కు కొన్ని ప్రశ్నలు వేస్తున్నా. ఇబ్బంది పడుతున్న జడేజాను క్రీజ్లోనే ఉంచేందుకు ఇలాంటి వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నాడా? లేకపోతే ధోనీని అప్పుడే క్రీజ్లోకి రాకుండా చేయడానికి ఇలా చేశాడా? ఒకవేళ టీ20 ప్రపంచ కప్లో విరాట్ కోహ్లీ చేస్తే.. కమిన్స్ ఇలానే స్పందిస్తాడా?’’ అని మహమ్మద్ కైఫ్ ట్వీట్ చేశాడు. కొందరు కైఫ్కు మద్దతుగా పోస్టులు పెడుతుండగా.. మరికొందరు హైదరాబాద్ నిర్ణయాన్ని వెనకేసుకొస్తున్నారు. ఒకవేళ అప్పీలు చేసి ఉంటే థర్డ్ అంపైర్ రనౌట్గా ప్రకటించే అవకాశం లేకపోలేదు. అప్పుడు ఇన్నింగ్స్ చివరి ఓవర్లో వచ్చిన ధోనీ.. ఇంకాస్త ముందుగా 19వ ఓవర్లోనే బ్యాటింగ్కు దిగేవాడు. వైజాగ్ తరహా మెరుపులను చూసి ఉండేవాళ్లమని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..