IPL 2024: నెల రోజుల్లో ఐపీఎల్-2024 సీజన్.. గాయాలబారిన కాన్వే, వార్నర్
ఇటీవలే ఐపీఎల్ 2024 (IPL 2024) షెడ్యూల్కు సంబంధించిన 15 రోజుల మ్యాచ్ల వివరాలను నిర్వాహకులు ప్రకటించారు. అయితే, ఇప్పుడు ఆటగాళ్లు గాయాలబారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: భారత్ వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే 15 రోజుల షెడ్యూల్ను ఐపీఎల్ నిర్వాహకులు ప్రకటించారు. ఈ మెగా టోర్నీకి ముందు తమ ప్రధాన ఆటగాళ్లు గాయాలబారిన పడుతుండటం ఆయా ఫ్రాంచైజీల అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. గాయం తిరగబెట్టడంతో టీమ్ఇండియా స్టార్ బౌలర్ మహమ్మద్ షమీ దాదాపు ఐపీఎల్కు దూరమైనట్లే. తాజాగా ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్, న్యూజిలాండ్ బ్యాటర్ డేవన్ కాన్వే కూడా గాయపడినట్లు సమాచారం. ప్రస్తుతం న్యూజిలాండ్లో ఆసీస్ పర్యటన కొనసాగుతోంది. మూడో టీ20 ఆదివారం జరగనుంది. అయితే, వీరిద్దరూ గాయాల కారణంగా ఆ మ్యాచ్లో ఆడటం లేదు. దీంతో ఐపీఎల్ నాటికి కోలుకుని వస్తారా? లేదా? అనేది తెలియడం లేదు.
కాన్వే బొటన వేలికి గాయం..
చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న డేవన్ కాన్వే ఓపెనర్గా సుడిగాలి ఇన్నింగ్స్లు ఆడేస్తాడు. ప్రస్తుతం ఆసీస్తో టీ20 సిరీస్లోని రెండో మ్యాచ్లో ఎడమచేతి బొటనవేలికి గాయమైంది. కివీస్ బౌలర్ ఆడమ్ మిల్నే 140 కి.మీ వేగంతో సంధించిన బంతిని ఆపే క్రమంలో బొటనవేలిని తాకింది. దీంతో మధ్యలోనే మైదానం వీడాడు. అతడికి బదులు ఫిన్ అలెన్ కీపింగ్ బాధ్యతలు చేపట్టాడు. వెల్లింగ్టన్కు వెళ్లి ప్రత్యేక వైద్యుడిని సంప్రదిస్తాడని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. కాన్వే గాయం పరిస్థితిని ఇప్పుడే అంచనా వేయలేమని.. స్కానింగ్ తీసి వైద్యబృందం పరిశీలించాక తగిన నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. కనీసం నాలుగైదు వారాల విశ్రాంతి తీసుకుంటే మాత్రం తొలి ఫేజ్లో చెన్నై ఆడే కొన్ని మ్యాచ్లకు అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం.
గజ్జల్లో నొప్పి కారణంగా వార్నర్ దూరం..
వన్డేలు, టెస్టులకు వీడ్కోలు పలికిన ఆస్ట్రేలియా టాప్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ ప్రస్తుతం టీ20ల్లోనే ఆడుతున్నాడు. ఇటీవల ఇంటర్నేషనల్ లీగ్లోనూ ప్రాతినిధ్యం వహించిన వార్నర్ను కివీస్తో టీ20 సిరీస్కు మేనేజ్మెంట్ ఎంపిక చేసింది. అయితే, రెండో మ్యాచ్ అనంతరం గజ్జల్లో నొప్పి తిరగబెట్టింది. చివరి టీ20కి అందుబాటులో ఉండడని ఆసీస్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. దీంతో ఐపీఎల్లో వార్నర్ ఆడటంపై అనుమానాలు రేకెత్తాయి. దిల్లీ క్యాపిటల్స్ సారథిగా ఉన్న వార్నర్ ఒకవేళ దూరమైతే ఆ జట్టుకు కష్టాలు తప్పవు. మరోవైపు రిషభ్ పంత్ కోలుకుని వస్తాడనే సంబరం దిల్లీకి లేకుండా పోతుంది. అయితే, దాదాపు నెల రోజుల వ్యవధి ఉన్న నేపథ్యంలో వార్నర్ ఐపీఎల్ నాటికి సిద్ధంగా ఉంటాడని దిల్లీ క్యాపిటల్స్ వర్గాలు పేర్కొన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి