David Warner: ఆ క్యాప్ నాకెంతో సెంటిమెంట్.. దయచేసి ఇచ్చేయండి.. డేవిడ్ వార్నర్ విజ్ఞప్తి
వీడ్కోలు టెస్టు ముంగిట ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (David Warner)కు ఓ షాక్ తగిలింది.
ఇంటర్నెట్ డెస్క్: జనవరి 3వ తేదీ నుంచి సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా, పాకిస్థాన్ మధ్య చివరి టెస్టు ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్తో ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ (David Warner) టెస్టు కెరీర్కు వీడ్కోలు పలుకుతున్నాడు. ఈ మ్యాచ్ ముంగిట వార్నర్కు షాక్ తగిలింది. అతడి బ్యాగీ గ్రీన్ క్యాప్ (టెస్టుల్లో ధరించే క్యాప్)ని పొగొట్టుకున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు.
‘‘మెల్బోర్న్ నుంచి సిడ్నీ వచ్చే క్రమంలో లగేజ్ నుంచి నా బ్యాక్ప్యాక్ను (బ్యాగ్)ని ఎవరో తీసుకున్నారు. అందులో నా పిల్లల వస్తువులు ఉన్నాయి. నా బ్యాగీ గ్రీన్ క్యాప్ కూడా ఉంది. అది నాకెంతో సెంటిమెంట్. దానిని ధరించి నా చివరి మ్యాచ్ ఆడాలనుకుంటున్నా. కావాలని ఎవరైనా బ్యాక్ప్యాక్ను తీసుకుంటే వారికి మరో బ్యాక్ప్యాక్ ఇస్తాను. మిమ్మల్ని ఎలాంటి ఇబ్బందికి గురిచేయను. ఎయిర్పోర్ట్, హోటల్ సిబ్బందిని కూడా అడిగాను. సీసీటీవీ ఫుటేజీలు కూడా పరిశీలించాం. ఎక్కడ దాని జాడ దొరకలేదు. దయచేసి నా బ్యాగీ గ్రీన్ క్యాప్ని తిరిగి ఇస్తే ఎంతో ఆనందిస్తా’’ అని వార్నర్ విజ్ఞప్తి చేశాడు.
తన సొంత మైదానం సిడ్నీలో బుధవారం పాకిస్థాన్తో ఆరంభమయ్యే మూడో టెస్టుతో సుదీర్ఘ ఫార్మాట్ నుంచి వైదొలగుతున్నట్లు గతంలోనే వెల్లడించిన వార్నర్.. వన్డేలకూ గుడ్ బై చెబుతున్నట్లు సోమవారం ప్రకటించాడు. భారత్లో ఆడిన వన్డే ప్రపంచకప్ ఫైనలే తనకు 50 ఓవర్ల ఫార్మాట్లో చివరి మ్యాచ్ అని పేర్కొన్నాడు. కానీ, జట్టుకు అవసరమైతే 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉంటానని పేర్కొన్నాడు.
నేను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలర్ అతడే
చివరి టెస్టు ఆడనున్న వార్నర్ తన కెరీర్లో ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ ఎవరో వెల్లడించాడు. సౌతాఫ్రికా పేస్ దిగ్గజం డేల్ స్టెయిన్ను ఎదుర్కోవడంలో చాలా ఇబ్బందులు పడినట్లు పేర్కొన్నాడు. ‘‘నా టెస్టు కెరీర్లో ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలర్ డేల్ స్టెయిన్. 2016-17లో గబ్బా వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ నాకింకా గుర్తుంది. ఈ మ్యాచ్ మొదటి సెషన్లో స్టెయిన్ నిప్పులు చెరిగాడు. బౌన్సర్లు వేసి నాతోపాటు షాన్ మార్ష్ను కూడా భయపెట్టాడు. సెషన్లో 45 నిమిషాలపాటు మాకు చుక్కలు చూపించాడు. మార్ష్ నా దగ్గరకు వచ్చి ‘‘స్టెయిన్ బౌలింగ్లో ఆడలేకపోతున్నా. అతడిని మనం ఎలా ఎదుర్కోవాలో నాకైతే తెలీదు’’ అని చెప్పాడు. స్టెయిన్ నా బ్యాక్సైడ్ ఎక్కువగా బంతులు వేశాడు. ఓ బంతి భుజానికి కూడా తగిలింది’’ అని వార్నర్ వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
T20 World Cup 2024: న్యూయార్క్ ఎంపైర్ స్టేట్ భవనంపై టీమ్ఇండియా పేర్లు
జూన్ 2 నుంచి టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2024) ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నీ కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ భారత జట్టును ఎంపిక చేసింది. కెప్టెన్గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్గా హార్దిక్ పాండ్య వ్యవహరిస్తారు. న్యూయార్క్లోని ఎంపైర్ స్టేట్ భవనంపై టీమ్ఇండియా సభ్యుల పేర్లను ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియోను మీరూ చూడండి.
-
టీ20 ప్రపంచకప్.. సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు ఇవే..
జూన్ 2 నుంచి టీ20 ప్రపంచకప్ 2024 ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ కోసం ఇంగ్లాండ్, సౌతాఫ్రికా తమ జట్లను ప్రకటించాయి. -
టీ20 ప్రపంచకప్.. భారత జట్టు ఇదే
జూన్ 2 నుంచి టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2024) ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నీ కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ భారత జట్టును ఎంపిక చేసింది. -
యువ రోహిత్ను చూశారా.. బర్త్డే గిఫ్ట్గా టీనేజ్ ఫొటో షేర్ చేసిన తల్లి పుర్ణిమ
భారత క్రికెట్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని కెప్టెన్గా ఎదిగిన రోహిత్ శర్మ (Rohit Sharma) పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా హిట్మ్యాన్కు ప్రముఖులు, ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు. -
లఖ్నవూ సూపర్ జెయింట్స్కు గుడ్న్యూస్.. ముంబయికి చావోరేవో
లఖ్నవూకు శుభవార్త. గాయం కారణంగా పలు మ్యాచ్లకు దూరమైన మయాంక్ యాదవ్ (mayank yadav) ఫిట్నెస్ సాధించాడు. -
సునీల్ నరైన్ను టీమ్ మీటింగ్లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్
కోల్కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తమ జట్టు ఓపెనర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్ బ్యాటింగ్ తీరు, టీమ్ మీటింగ్ల పట్ల వీరు ఎలా వ్యవహరిస్తారనే ఆసక్తికర విషయాలు వివరించాడు. -
ఎవరా 15!.. నేడు సెలక్షన్ కమిటీ సమావేశం
టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్నా భారత జట్టుపై ఇంకా స్పష్టత లేదు. చాలా స్థానాలకు ఆటగాళ్ల మధ్య పోటీ ఉండడంతో ఎన్నో ఊహాగానాలు. ఈ అనిశ్చితికి తెరపడడానికి ఎంతో సమయం లేదు. -
కోల్కతా కుమ్మేసింది
కోల్కతా అదరగొట్టింది. ఆల్రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ దిల్లీ క్యాపిటల్స్ను చిత్తుగా ఓడించింది. వరుణ్, అరోరా, హర్షిత్ సూపర్ బౌలింగ్తో దిల్లీని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన నైట్రైడర్స్.. సాల్ట్ జోరుతో స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. -
క్వార్టర్స్లో భారత్
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఇప్పటికే భారత అమ్మాయిలు క్వార్టర్స్ఫైనల్స్లో ప్రవేశించగా.. తాజాగా థామస్ కప్లో పురుషుల జట్టు కూడా తుది ఎనిమిదిలో చోటు దక్కించుకుంది. -
పారిస్కు ఏడుగురు షట్లర్లు
పారిస్ ఒలింపిక్స్లో భారత్ నుంచి ఏడుగురు షట్లర్లు పోటీపడబోతున్నారు. ఒలింపిక్ క్రీడల అర్హత ర్యాంకింగ్ ప్రకారం పి.వి.సింధు (మహిళల సింగిల్స్), హెచ్ఎస్.ప్రణయ్, లక్ష్యసేన్ (పురుషుల సింగిల్స్), సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి (పురుషుల డబుల్స్), అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో (మహిళల డబుల్స్) ఈ మెగా ఈవెంట్ బరిలో నిలిచారు. -
జ్యోతి @ 2
ఆర్చరీ ప్రపంచకప్లో మూడు పసిడి పతకాలతో సత్తా చాటిన తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ.. కెరీర్లో అత్యుత్తమ ర్యాంకు సాధించింది. -
టీ20 ప్రపంచకప్కు కివీస్ జట్టిదే
కేన్ విలియమ్సన్ నాలుగోసారి టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్కు నాయకత్వం వహించనున్నాడు. వేలి గాయం నుంచి కోలుకుంటున్న ఓపెనర్ డెవోన్ కాన్వేకు కూడా 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కింది. -
ఛాంపియన్స్ ట్రోఫీకి మూడు వేదికలు
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ఇండియా పాకిస్థాన్కు వెళ్తుందో లేదో తెలియదు.. అసలు ఆ టోర్నీ పాకిస్థాన్లోనే జరుగుతుందో లేదో తెలియదు కానీ.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాత్రం ఆ టోర్నీ కోసం ఏర్పాట్లు చేసుకుంటుంది.
తాజా వార్తలు (Latest News)
-
వివేకా హత్య తర్వాత అవినాష్.. జగన్కు ఫోన్ చేసి ఏం మాట్లాడారు?: సునీత
-
సేల్స్ తగ్గాయన్న ఫ్రస్ట్రేషన్.. సీనియర్ ఎగ్జిక్యూటివ్లపై వేటు వేసిన మస్క్
-
కెనడాలో విదేశీ విద్యార్థులకు నిరాశ.. ఇక వారానికి గరిష్ఠంగా 24 గంటలే పని!
-
అమిత్ షా నకిలీ వీడియోల కేసు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే పీఏ అరెస్టు
-
భార్య దారుణ హత్య.. భారతీయుడికి జీవిత ఖైదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM