DC vs RCB: సిరాజ్పై మా ‘మాస్టర్ ప్లాన్’అదే: డేవిడ్ వార్నర్
బెంగళూరుపై విజయం సాధించిన దిల్లీ క్యాపిటల్స్ (DC vs RCB) పాయింట్ల పట్టికలో ఒక అడుగు ముందుకేసింది. చివరి స్థానం నుంచి 9వ స్థానంలోకి చేరింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2023 సీజన్లో (IPL 2023) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై దిల్లీ క్యాపిటల్స్ (DC vs RCB) ప్రతీకార విజయం నమోదు చేసింది. ఆర్సీబీ నిర్దేశించిన 182 పరుగుల టార్గెట్ను కేవలం మూడు వికెట్లను మాత్రమే కోల్పోయి 16.4 ఓవర్లలోనే ఛేదించింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ఫిలిప్ సాల్ట్ (87: 45 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్లు) వీరవిహారం చేశాడు. ఈ మ్యాచ్ సందర్భంగా సాల్ట్, ఆర్సీబీ పేసర్ మహమ్మద్ సిరాజ్ మధ్య చిన్నపాటి కవ్వింపు వ్యవహారం చోటు చేసుకుంది. అయితే, సహచరులు ఇరువురికి సర్ది చెప్పడంతో వాగ్వాదం జరగకుండా అడ్డుకోగలిగారు. మ్యాచ్ అనంతరం ఇదే విషయంపై దిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ స్పందించాడు. సిరాజ్ మాస్టర్ ప్లాన్ వెనుక ఉన్న సీక్రెట్ను వెల్లడించాడు.
‘‘బెంగళూరు నిర్దేశించిన లక్ష్యం ఛేదించదగినదేనని నేను భావించా. రెండో ఇన్నింగ్స్లో బంతి ఎక్కువగా జారిపోవడం వల్ల బౌలర్లకు ఇబ్బందిగా మారింది. మా బ్యాటర్ ఫిలిప్ సాల్ట్ దూకుడుగా ఆడటంతో విజయం సాధించగలిగాం. మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ను ఆడేందుకు పక్కా ప్రణాళికతో బరిలోకి దిగాం. ఈ సీజన్లో చాలా అద్భుతంగా బౌలింగ్ వేస్తున్నాడు. అతడు ఎక్కువగా బౌల్డ్ చేయడం, ఎల్బీ రూపంలో వికెట్లు తీస్తాడు. అందుకే అతడి లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్ గతిని తప్పించాలని భావించాం. ఇందులో సక్సెస్ అయ్యాం. స్పీడెస్టర్ ఆన్రిచ్ నోకియా లేకపోయినా మా సీనియర్ బౌలర్ ఇషాంత్ శర్మ నేతృత్వంలోని బౌలింగ్ దళం అద్భుతంగా రాణించింది. ఖలీల్, ఇషాంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ వికెట్లు తీస్తూ బెంగళూరుపై ఒత్తిడి పెంచారు. సరైన సమయంలోనే ఫామ్లోకి వచ్చామని భావిస్తున్నా. తదుపరి మ్యాచ్లో చెన్నైతోనూ ఇదే ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం’’ అని వార్నర్ తెలిపాడు.
ధోనీతో సమంగా వార్నర్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో దిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో 8 పాయింట్లతో 9వ స్థానంలో కొనసాగుతోంది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ మాత్రం తన ఫామ్ను కొనసాగిస్తూ పరుగులు చేస్తున్నాడు. పది మ్యాచుల్లో నాలుగు అర్ధశతకాలతో 330 పరుగులు చేసిన వార్నర్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా బెంగళూరుతో మ్యాచ్లో 14 బంతుల్లో 22 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఇప్పటివరకు ఐపీఎల్లో ఆర్సీబీపై 31 మ్యాచుల్లో సెంచరీ, నాలుగు అర్ధశతకాల సాయంతో 839 పరుగులు సాధించిన వార్నర్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీని సమం చేశాడు. ధోనీ కూడా 31 ఇన్నింగ్స్ల్లో 41.90 సగటుతో 839 పరుగులు చేశాడు. వీరిద్దరి తర్వాత ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ (785 పరుగులు), చెన్నై బ్యాటర్ అంబటి రాయుడు (714 పరుగులు) ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు.
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?