IND vs ENG: ముగిసిన రెండో రోజు ఆట.. భారత్ 219/7.. ఇంగ్లాండ్కు కలిసొచ్చిన ‘అంపైర్స్ కాల్’
రాంచీలో నాలుగో టెస్టు రెండోరోజు ఆట ముగిసింది. ఇంగ్లాండ్ బౌలింగ్లో ఆధిపత్యం ప్రదర్శించింది.
ఇంటర్నెట్ డెస్క్: రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో (IND vs ENG) టీమ్ఇండియా పోరాడుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్లో ఏడు వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. క్రీజ్లో కుల్దీప్ యాదవ్ (17*), ధ్రువ్ జురెల్ (30*) ఉన్నారు. వీరిద్దరూ ఎనిమిదో వికెట్కు ఇప్పటికే 106 బంతుల్లో 42 పరుగులు జోడించారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (73) మరోసారి తన ఫామ్ను కొనసాగిస్తూ హాఫ్ సెంచరీ చేశాడు. శుభ్మన్ గిల్ (38) ఫర్వాలేదనిపించాడు. రోహిత్ శర్మ (2), రజత్ పటీదార్ (17), రవీంద్ర జడేజా (12), సర్ఫరాజ్ ఖాన్ (14), రవిచంద్రన్ అశ్విన్ (1) విఫలమయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో బషీర్ 4 వికెట్లు, టామ్ హార్ట్లీ 2, అండర్సన్ ఒక వికెట్ తీశారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 353 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ ఇంకా 134 పరుగుల వెనకంజలో ఉంది.
ఇంగ్లాండ్కు కలిసొచ్చిన ‘అంపైర్స్ కాల్’
గత టెస్టులో తమ బ్యాటర్ జాక్ క్రాలే ‘అంపైర్స్ కాల్’ వల్ల ఔట్ కావడంపై అసహనం వ్యక్తం చేసిన ఇంగ్లాండ్కు ఈ మ్యాచ్లో మాత్రం బాగా కలిసొచ్చింది. టీమ్ఇండియా ముగ్గురు బ్యాటర్లు ఇలానే పెవిలియన్కు చేరాల్సి వచ్చింది. మరి ఈసారి ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఎలా స్పందిస్తాడో చూడాలి.
- రోహిత్ శర్మ త్వరగానే పెవిలియన్కు చేరినప్పటికీ.. రెండో వికెట్కు యశస్వితో కలిసి గిల్ 82 పరుగులు జోడించాడు. మంచి ఊపులో ఉన్నప్పుడు ‘అంపైర్స్ కాల్’ వల్ల గిల్ ఔట్ కావాల్సి వచ్చింది. బషీర్ వేసిన (24.1వ ఓవర్) బంతిని ఆడే క్రమంలో గిల్ ప్యాడ్లను తాకింది. ఇంగ్లాండ్ ఆటగాళ్లు అప్పీలు చేయడంతో ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇచ్చేశాడు. దీనిపై భారత్ డీఆర్ఎస్ తీసుకుంది. అక్కడ ఇంపాక్ట్లో ‘అంపైర్స్ కాల్’ రావడంతో గిల్ నిరాశగా పెవిలియన్కు చేరాడు.
- మరో యువ ఆటగాడు రజత్ పటీదార్ కూడా ఇలానే ఔటయ్యాడు. బషీర్ బౌలింగ్లోనే (34.3వ ఓవర్) ఎల్బీ అయ్యాడు. అదీనూ ‘అంపైర్స్ కాల్’ వల్ల భారత్ వికెట్ను నష్టపోవాల్సి వచ్చింది.
- రవిచంద్రన్ అశ్విన్ను టామ్ హార్ట్లీ (55.2వ ఓవర్) ఎల్బీ చేశాడు. భారత్ డీఆర్ఎస్ తీసుకుంది. బంతి లెగ్స్టంప్ చివరిన తాకడంతో ‘అంపైర్స్ కాల్’ అని సమీక్షలో వచ్చింది. అయితే, ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇవ్వడంతో అశ్విన్ పెవిలియన్ బాట పట్టకతప్పలేదు.
ఓలీ రాబిన్సన్ హాఫ్ సెంచరీ..
ఓవర్నైట్ 302/7 స్కోరుతో రెండో రోజును ప్రారంభించిన ఇంగ్లాండ్ ఆరంభంలో బాగానే ఆడింది. ఓలీ రాబిన్సన్ (58) హాఫ్ సెంచరీ సాధించాడు. రవీంద్ర జడేజా ఈ జోడీని విడగొట్టాడు. చివరి మూడు వికెట్లను జడ్డూనే తీయడం విశేషం. క్రీజ్లో ఒకవైపు జో రూట్ (122*) పాతుకు పోయాడు. బషీర్ (0), అండర్సన్ (0) డకౌట్గా పెవిలియన్కు చేరారు. దీంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 353 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో జడేజా 4, ఆకాశ్ దీప్ 3, సిరాజ్ 2, అశ్విన్ ఒక వికెట్ తీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
యశ్ ‘టాక్సిక్’లో బాలీవుడ్ భామ.. ఆ విషయం తాను చెప్పలేదంటూ పోస్ట్
-
ఎవరినీ కించపరచడం మా ఉద్దేశం కాదు.. ‘డబుల్ ఇస్మార్ట్’ పాటపై మణిశర్మ క్లారిటీ
-
కార్గిల్ పోరు వేళ యుద్ధ భూమిలో మోదీ.. పాతికేళ్ల నాటి ఫొటోలు వైరల్
-
రివ్యూ: పురుషోత్తముడు.. రాజ్తరుణ్ ఖాతాలో హిట్ పడిందా?
-
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
-
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు