Team India: కుర్రాళ్లోయ్ కుర్రాళ్లు.. అరంగేట్రంలో సత్తా చాటుతున్న క్రికెటర్లు
వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని రాణిస్తే జట్టులో స్థానం శాశ్వతమవుతుంది. తొలి మ్యాచ్లోనే అద్భుత ప్రదర్శన చేస్తే గుర్తింపు దక్కించుకోవడం తేలికవుతుంది.
ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్. వ్యక్తిగత కారణాలతో కోహ్లి సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. గాయంతో కేఎల్ రాహుల్ మూడు టెస్టుల్లో ఆడలేదు. శ్రేయస్ కూడా దూరమయ్యాడు. బ్యాటింగ్ ఆర్డర్లో అనుభవలేమి. కానీ సిరీస్లో 2-1తో భారత్దే ఆధిక్యం. ఇక అత్యుత్తమ ఫామ్లో ఉన్న ప్రధాన పేసర్ బుమ్రాకు నాలుగో టెస్టుకు విశ్రాంతినిచ్చారు. అయినా తొలి సెషన్లోనే అయిదు వికెట్లు డౌన్. ఇంగ్లిష్ జట్టుపై ఈ ఆధిపత్యానికి ప్రధాన కారణం భారత యువ ఆటగాళ్లు. ఈ సిరీస్లో అరంగేట్రం చేసిన కుర్రాళ్లు.. అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ సత్తాచాటుతున్నారు. అద్భుత నైపుణ్యాలు ప్రదర్శిస్తూ.. జట్టు భవిష్యత్పై భరోసా కల్పిస్తున్నారు.
వస్తూనే వికెట్ల వేట
అయిదు టెస్టుల సిరీస్లో తొలి మ్యాచ్లో ఓడిన టీమ్ఇండియా.. ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుని వరుసగా రెండు మ్యాచ్ల్లో గెలిచింది. ఈ నేపథ్యంలో వర్క్ లోడ్ మేనేజ్మెంట్ కారణంతో నాలుగో టెస్టుకు బుమ్రాకు జట్టు విశ్రాంతినిచ్చింది. దీంతో యువ పేసర్ ఆకాశ్దీప్కు అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశం వచ్చింది. ఈ పేసర్ వస్తూనే అదరగొట్టాడు. బౌన్స్, స్వింగ్తో ఇంగ్లాండ్ బ్యాటర్లను హడలెత్తించాడు. నిప్పుల్లాంటి బంతులతో చెలరేగాడు. రెండు ఓవర్ల వ్యవధిలో ఇంగ్లాండ్ టాప్-3 బ్యాటర్లను ఔట్ చేసి సత్తాచాటాడు. నిలకడగా ఒకే లెంగ్త్లో బౌలింగ్ చేసి వికెట్లు రాబట్టాడు. తొలి టెస్టు ఆడుతున్నాననే ఒత్తిడి లేకుండా, ఎలాంటి కంగారు లేకుండా ఆకాశ్ గొప్పగా బంతులేశాడు. 27 ఏళ్ల ఈ బెంగాల్ పేసర్ 30 ఫస్ట్క్లాస్ మ్యాచ్ల్లో 23.58 సగటుతో 104 వికెట్లు పడగొట్టడం విశేషం. 28 లిస్ట్- ఎ మ్యాచ్ల్లో 24.50 సగటుతో 42 వికెట్లు, 41 టీ20 మ్యాచ్ల్లో 22.81 సగటుతో 48 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.
బ్యాటింగ్లో అదుర్స్
ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్లో ఆకాశ్దీప్తో కలిసి ఇప్పటికే నలుగురు భారత ఆటగాళ్లు సుదీర్ఘ ఫార్మాట్లో అరంగేట్రం చేశారు. రెండో టెస్టు నుంచి ప్రతి మ్యాచ్లోనూ కనీసం ఓ అరంగేట్ర ఆటగాడు బరిలో దిగాడు. విశాఖలో జరిగిన రెండో టెస్టులో రజత్ పటీదార్ అవకాశం దక్కించుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో 32 పరుగులతో ఆకట్టుకున్నాడు. అత్యున్నత స్థాయిలో ఆడే ప్రతిభ ఉందనే సంకేతాలు పంపించాడు. కానీ ఆ తర్వాత మూడు ఇన్నింగ్స్లో అవకాశాలను వృథా చేసుకున్న అతను.. సత్తాచాటాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇక రాజ్కోట్లో జరిగిన మూడో టెస్టులో సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జూరెల్ టెస్టు టోపీలు అందుకున్నారు. దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్నా అవకాశం దక్కక నిరాశకు లోనైన 26 ఏళ్ల సర్ఫరాజ్.. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వచ్చిన ఛాన్స్ను వదులుకోలేదు. వరుసగా రెండు ఇన్నింగ్స్ల్లోనూ అర్ధశతకాలు సాధించాడు. ఈ ముంబయి ఆటగాడు దూకుడైన బ్యాటింగ్తో అలరించాడు. అరంగేట్ర టెస్టు రెండు ఇన్నింగ్స్ల్లోనూ అర్ధసెంచరీలు సాధించిన నాలుగో భారత ఆటగాడిగా రికార్డు నమోదు చేశాడు. మరోవైపు వికెట్ కీపర్ ధ్రువ్ కూడా ఆకట్టుకున్నాడు. 23 ఏళ్ల ఈ ఉత్తరప్రదేశ్ ఆటగాడు తొలి ఇన్నింగ్స్లో 46 పరుగులు చేశాడు. ఓపికతో క్రీజులో నిలబడి ఉత్తమ పరిణతి ప్రదర్శించాడు. ఇలా కుర్రాళ్లు అరంగేట్రంలోనే అదరగొడుతున్నారు. అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకుంటున్నారు. సంధి దశలో ఉన్న జట్టుకు భరోసా కల్పిస్తున్నారు. యువ ఆటగాళ్ల ప్రదర్శన చూస్తుంటే.. భారత క్రికెట్కు ఢోకా లేదనిపిస్తోంది.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి