Deepika pallikal: ఈ ఛాంపియన్.. క్రికెటర్ భార్య, కవలల అమ్మ
అమ్మయ్యాక కూడా ఆటలో అద్భుతాలు చేయొచ్చని స్క్వాష్ స్టార్ దీపిక పల్లికల్ చాటుతోంది. ఆమె క్రీడా ప్రయాణం తెలుసుకోండి.
స్క్వాష్ స్టార్ దీపిక పల్లికల్
దీపిక పల్లికల్.. స్క్వాష్ క్రీడతో పరిచయం ఉన్న అభిమానులకు బాగా తెలిసిన పేరు ఇది. అలాగే క్రికెటర్ దినేశ్ కార్తీక్నూ అనుసరించే వాళ్లకూ ఈ పేరు తెలుసు. అదెలా అంటారా? దినేశ్ కార్తీక్ భార్యనే ఈ దీపిక. ఇప్పుడు ఆసియా క్రీడల్లో మిక్స్డ్ టీమ్లో చారిత్రక పతకంతో మరోసారి తన పేరు మార్మోగేలా చేసింది ఈ స్క్వాష్ దిగ్గజం. ఆటలో అత్యుత్తమ ప్రదర్శనతో సాగుతూ.. మధ్యలో దినేశ్తో ప్రేమాయణం, పెళ్లి.. అనంతరం ఇద్దరు కవలలకు జన్మనివ్వడం.. ఇప్పుడు మళ్లీ దేశానికి పతకాలు అందించడం.. ఇదే దీపిక జీవితం. అమ్మయ్యాక కూడా ఆటలో అద్భుతాలు చేయొచ్చని ఆమె చాటుతోంది.
తల్లి క్రికెటర్..
కేరళలోని కొట్టాయంలో దీపిక జన్మించింది. ఆమె తల్లి సుసాన్ పల్లికల్ భారత మాజీ మహిళా క్రికెటర్. టెస్టుల్లో, వన్డేల్లో దేశానికి ప్రాతినిథ్యం వహించింది. అందుకే దీపిక రక్తంలోనే ఆట ఉందనే చెప్పొచ్చు. స్క్వాష్ను కెరీర్గా ఎంచుకున్న దీపిక అంచెలంచెలుగా ఎదిగింది. 2006లో ప్రొఫెషనల్ కెరీర్ మొదలెట్టిన ఆమె.. ఆరంభంలో ఒడుదొడుకులు ఎదుర్కొంది. 2011 నుంచి నిలకడగా విజయాలు సాధించడం ప్రారంభించింది. భారత స్క్వాష్ సత్తాను ప్రపంచానికి చాటింది. ప్రపంచ మహిళల స్క్వాష్ ర్యాంకింగ్స్లో టాప్-10లో చోటు దక్కించుకున్న తొలి భారత క్రీడాకారిణి దీపికనే. ఆటలోనే కాదు పోరాటంలోనూ ఆమె వెనక్కి తగ్గదు. జాతీయ ఛాంపియన్షిప్లో పురుషులతో సమానంగా మహిళలకు నగదు బహుమతి ఇవ్వాలని దీపిక పట్టుబట్టింది. ఈ డిమాండ్తో 2012 నుంచి 2015 వరకు జాతీయ ఛాంపియన్షిప్లో ఆడలేదు. 2016లో పురుషులతో పాటు మహిళలకు సమానంగా నగదు బహుమతి ఇస్తామని ప్రకటించడంతో జాతీయ ఛాంపియన్షిప్లో పోటీపడీ విజేతగానూ నిలిచింది. 32 ఏళ్ల దీపిక 2012లో అర్జున, 2014లో పద్మశ్రీ పురస్కారం అందుకుంది.
దినేశ్తో ప్రేమ..
దినేశ్, దీపిక ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీళ్ల ప్రేమాయణం జిమ్లో మొదలైంది. ఇద్దరూ ఒకే జిమ్కు వెళ్లేవాళ్లు. దీపికతో తొలి చూపులోనే దినేశ్ ప్రేమలో పడిపోయాడు. మొదట స్నేహితులుగా మొదలై.. అనంతరం ప్రేమికులుగా మారారు. 2013లో నిశ్చితార్థం చేసుకున్నారు. 2015 ఆగస్టులో పెళ్లి చేసుకున్నారు. 2021 అక్టోబర్లో కవలలు కబీర్, జియాన్కు దీపిక జన్మనిచ్చింది. 2018 నుంచి తల్లి కావడానికి ప్రయత్నించిన దీపిక ఆటకు నాలుగేళ్ల పాటు దూరంగా ఉంది. ఫెర్టిలిటీ చికిత్స తీసుకుంది. ఈ సమయంలో ఖాళీగా ఉండలేక ఇంటీరియర్ డిజైనింగ్ వ్యాపారాన్ని కూడా నెలకొల్పింది. తిరిగి 2022లో ఆటలో అడుగుపెట్టింది. తల్లిగా మారిన తర్వాత మళ్లీ ఆటలోకి రావడం అంత సులువు కాదు. శారీరకంగా జరిగే మార్పులను తట్టుకుని, ఆటకు తగ్గట్లుగా ఫిట్నెస్ సాధించడమే సవాలే. కానీ దీపిక ఆత్మవిశ్వాసంతో సాగింది. సవాళ్ల ప్రయాణంలో ముందడుగు వేసింది. తిరిగి మునుపటి జోరు అందుకుంది.
నిరుడు ప్రపంచ డబుల్స్ ఛాంపియన్షిప్స్లో రెండు స్వర్ణాలు (మహిళల డబుల్స్, మిక్స్డ్) గెలిచి ఔరా అనిపించింది. ఈ ప్రపంచ డబుల్స్ ఛాంపియన్షిప్స్లో ఆమె 2016లో మిక్స్డ్ డబుల్స్లో రజతం, మహిళల డబుల్స్లో కాంస్యం, 2017 మహిళల డబుల్స్లో కాంస్యం కూడా గెలిచింది. 2022 కామన్వెల్త్ క్రీడల్లో మిక్స్డ్ డబుల్స్ కాంస్యంతో సత్తాచాటింది. ఈ క్రీడల్లో గతంలోనే ఆమె ఓ స్వర్ణం, రెండు రజతాలు నెగ్గింది. ఇప్పుడు ఆసియా క్రీడల్లో తొలిసారి ప్రవేశపెట్టిన మిక్స్డ్ డబుల్స్లో హరిందర్తో కలిసి ఛాంపియన్గా నిలిచి చరిత్ర సృష్టించింది. దీని కంటే ముందు ఓ రజతం, నాలుగు కాంస్యాలు కూడా ఆమె ఖాతాలో ఉన్నాయి. దీపిక, దినేశ్ ఒకరికొకరు అండగా నిలుస్తూ, ప్రోత్సహించుకుంటూ సాగుతున్నారు. దినేశ్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు దీపిక మద్దతుగా నిలిచింది. దీంతో ఐపీఎల్లో రాణించిన అతను మళ్లీ టీమ్ఇండియాలోకి రాగలిగాడు. ఇప్పుడు దినేశ్ ప్రోత్సాహంతో దీపిక అదరగొడుతోంది. తల్లి, భర్త క్రికెటర్లయినప్పటికీ దీపికకు మొదట్లో ఈ ఆటంటే ఇష్టం ఉండేది కాదు. కానీ, ఇప్పుడు భర్త కోసం మ్యాచ్ల చూస్తోంది. ‘‘ఎన్నో త్యాగాలు చేశాం. కానీ కలలను త్యాగం చేయాలని కాదు. పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత కూడా తిరిగి ఆటలోకి రావొచ్చు. పోటీల కోసం పిల్లలను వదిలి వచ్చామనే బాధ ఉంటుంది. కానీ తప్పదు. అమ్మ సరదా కోసం కాదు.. దేశానికి పతకం అందించడానికి చైనాకు వెళ్లిందని పిల్లలు పెద్దయ్యాక తెలుసుకుంటారు’’ అని దీపిక గర్వంగా చెబుతోంది.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు