ENGLAND: అప్పుడు లంక, ఆసీస్.. ఇప్పుడు ఇంగ్లాండ్.. 1992, 1999 టోర్నీలను మించి ఛాంపియన్ పతనం
వన్డే ప్రపంచకప్లో (ODI World Cup 2023) ఇంగ్లాండ్ కేవలం ఒక్క విజయం, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో అట్టడుగు నుంచి రెండో స్థానంలో ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఈసారి సెమీస్కు చేరుకోవడం దాదాపు కష్టమే.
ప్రపంచకప్ (ODI World Cup 2023) వస్తోందంటే.. ఆటోమేటిగ్గా గత పర్యాయం కప్పు గెలిచిన జట్టు మీద అందరి దృష్టీ నిలుస్తుంది. నాలుగేళ్ల ముందు కప్పు గెలిచిన జట్టుపై.. తర్వాతి టోర్నీలోనూ మంచి అంచనాలుండటం సహజం. మరోసారి కప్పు గెలవకపోయినా.. మెరుగైన ప్రదర్శనను ఆశిస్తారు ఆ జట్టు అభిమానులు. ఐతే ప్రపంచకప్ చరిత్రలో డిఫెండింగ్ ఛాంపియన్ తర్వాతి టోర్నీలో నిరాశపరిచిన సందర్భాలు రెండే. 1992లో ఆస్ట్రేలియా, 1999లో శ్రీలంక అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాయి. సాధారణ ప్రదర్శనతో సెమీస్ చేరకుండానే నిష్క్రమించాయి. ఐతే అప్పుడు ఆ జట్లే ఎంతో నయం అనిపించేలా.. ఇప్పుడు డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ ప్రపంచకప్లో ఘోరమైన ప్రదర్శన చేస్తోంది. అద్భుతాలు జరిగితే తప్ప 2019 ఛాంపియన్.. 2023లో సెమీస్ చేరడం అసాధ్యం.
ఇంగ్లాండ్ దాసోహం.. శ్రీలంక చేతిలో చిత్తు
1975లో తొలి వన్డే ప్రపంచకప్ను చేజిక్కించుకున్న వెస్టిండీస్.. రెండో కప్పులో కూడా అంచనాలను నిలబెట్టుకుంటూ టైటిల్ సాధించింది. 1983లోనూ ఆ జట్టు ఫైనల్ చేరింది. భారత్కు కప్పును కోల్పోయింది. ఆ టోర్నీలో విజేతగా నిలిచిన టీమ్ఇండియా.. తర్వాతి కప్పులో సెమీస్లో ఓడింది. కానీ డిఫెండింగ్ ఛాంపియన్ అంచనాలకు తగ్గ ప్రదర్శన చేయకపోవడం తొలిసారి 1992లో జరిగింది. 1987 విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా.. 1992లో సెమీస్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. కాకపోతే ఆసీస్.. గ్రూప్ దశలో పాకిస్థాన్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ లాంటి పెద్ద జట్ల చేతిలోనే ఓటములు చవిచూసింది. 1992 విజేత పాకిస్థాన్ 1996లో బాగానే ఆడింది. కానీ క్వార్టర్స్లో భారత్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. కానీ 1996 విజేత శ్రీలంక 1999కు వచ్చేసరికి తుస్సుమనిపించింది. ఎంతమాత్రం ఛాంపియన్ జట్టులా అది కనిపించలేదు. సూపర్-6లో ఐదు మ్యాచ్లాడి జింబాబ్వే, కెన్యా లాంటి చిన్న జట్ల మీద మాత్రమే నెగ్గి టోర్నీ నుంచి నిష్క్రమించింది. 1999లో ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియా ఆ తర్వాతి రెండు టోర్నీల్లోనూ టైటిల్ సాధించిన సంగతి తెలిసిందే. ఆ జట్టు 2011లో క్వార్టర్స్ వరకు వచ్చింది. అక్కడ భారత్ చేతిలో ఓడింది. ఆ టోర్నీలో కప్పు నెగ్గిన భారత్.. 2015లో సెమీస్లో ఓడింది. 2015లో మళ్లీ విజేతగా నిలిచిన ఆసీస్.. 2019లో సెమీస్ వరకు వచ్చింది. కానీ 2019లో తొలిసారి ప్రపంచకప్ను ఒడిసిపట్టిన ఇంగ్లాండ్ మాత్రం.. ఈసారి భారీ అంచనాలతో బరిలోకి దిగి తుస్సుమనిపించింది. ఇప్పటిదాకా అయిదు మ్యాచ్లు ఆడి ఒక్క బంగ్లాదేశ్ మీద మాత్రమే నెగ్గిన ఇంగ్లిష్ జట్టు.. అఫ్గానిస్థాన్, శ్రీలంక లాంటి బలహీన జట్ల చేతిలోనూ పరాజయాలు చవిచూసింది. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా సైతం ఆ జట్టును మట్టికరిపించాయి. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగి సెమీస్ చేరని జట్లలో ఆస్ట్రేలియా, శ్రీలంకే కొంచెం మెరుగైన ప్రదర్శన చేశాయి. కానీ ఈసారి ఇంగ్లాండ్ ప్రదర్శన మాత్రం మరీ ఘోరంగా ఉంది.
ఆశలు వదులుకోవడమే
ఇంకా ఇంగ్లాండ్ సెమీస్ చేరుతుందని ఎవరైనా ఆశలు పెట్టుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే ఆ జట్టు సాంకేతికంగా మాత్రమే సెమీస్ రేసులో ఉన్నట్లుగా కనిపిస్తోంది. 5 మ్యాచ్లు ఆడి నాలుగు ఓడటమే కాక నెట్ రన్రేట్ (-1.634)లో బాగా వెనుకబడి ఉంది ఇంగ్లాండ్. అయిదుకు అయిదు మ్యాచ్ల్లో నెగ్గిన భారత్.. అయిదేసి మ్యాచ్లు ఆడి నాలుగు చొప్పున విజయాలు సాధించిన దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ సెమీస్ బెర్తులు వదిలే ఛాన్సే లేదు. తొలి రెండు మ్యాచ్ల్లో ఓడినప్పటికీ తర్వాత హ్యాట్రిక్ విజయాలు సాధించిన ఆస్ట్రేలియా జోరు మీదుంది. ఈ జట్లే టాప్-4లో నిలిచి సెమీస్ చేరతాయన్నది ప్రస్తుతానికి ఉన్న అంచనా. ఇంకా పాకిస్థాన్, శ్రీలంక సైతం సెమీస్ మీద ఆశలు పెట్టుకున్నాయి. ఇన్ని జట్లను కాదని ఇంగ్లాండ్ ముందంజ వేయాలంటే అద్భుతాలు జరగాలి. మిగతా నాలుగు మ్యాచ్ల్లోనూ ఆ జట్టు ఘనవిజయాలు సాధించడమే కాక.. ఇతర జట్ల ఫలితాలు కూడా కలిసి రావాలి. ఇవన్నీ జరిగి ఇంగ్లాండ్ ముందంజ వేయడం అసాధ్యంగానే కనిపిస్తోంది.
బజ్బాల్ దెబ్బ కొట్టిందా?
బజ్బాల్.. బజ్బాల్.. రెండేళ్లుగా ప్రపంచ క్రికెట్లో చర్చనీయాంశంగా మారిన మాట ఇది. దీన్ని ప్రవేశ పెట్టింది ఇంగ్లాండే. తొలి బంతి నుంచి దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ కొట్టి మ్యాచ్లను సొంతం చేసుకోవడం ఈ విధానంలో భాగం. వికెట్లు పడ్డా దూకుడు తగ్గించకుండా బ్యాటింగ్ చేయడం.. బౌలింగ్లో కూడా వికెట్లు తీయడమే లక్ష్యంగా ఎటాకింగ్ ఫీల్డింగ్ పెట్టి, బౌలింగ్ చేయడం బజ్బల్ స్టైల్. టెస్టుల్లో ప్రవేశపెట్టాక దీనికొక పేరు, రూపం వచ్చాయి కానీ.. అంతకుముందు నుంచే పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇంగ్లాండ్ ఇదే శైలిలో ఆడుతోంది. ఈ మధ్య మరింతగా దూకుడు పెంచింది. ఈ శైలితో ప్రత్యర్థులను బెదరగొట్టడం అలవాటుగా చేసుకున్న ఇంగ్లిష్ జట్టుకు భారత గడ్డపై మాత్రం ఏదీ కలిసి రావడం లేదు. ప్రత్యర్థులను ఒత్తిడిలోకి నెట్టబోయే తనే ఒత్తిడిలో పడి మ్యాచ్లు చేజార్చుకుంది. అవసరమైనపుడు కుదురుగా ఆడటం పోయి.. దూకుడు పేరుతో వరుసగా వికెట్లు చేజార్చుకుని ఓటములు కొనితెచ్చుకుంది. ఇప్పుడు ఇంగ్లాండ్కు తన విధానాన్నే మార్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. కానీ ఈలోపు ప్రపంచకప్లో ఆ జట్టు కథ ముగిసేలా ఉంది.
-ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
-
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్