RCBW vs DCW: బెంగళూరుకు షాక్.. దిల్లీ ఘన విజయం
హ్యాట్రిక్పై కన్నేసిన బెంగళూరుకు దిల్లీ క్యాపిటల్స్ షాక్ ఇచ్చింది. 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీని దిల్లీ జట్టు 25 పరుగుల తేడాతో ఓడించింది.
బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2024)లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCBW)తో జరిగిన మ్యాచ్లో దిల్లీ క్యాపిటల్స్ (DCW) 25 పరుగుల తేడాతో విజయం సాధించింది. 195 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బెంగళూరు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. స్మృతి మంధాన (74: 43 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధశతకంతో మెరిసినప్పటికీ మిగతవారు విఫలం కావడంతో ఆ జట్టు ఓటమిపాలైంది. సబ్బినేని మేఘన (36) ఫర్వాలేదనిపించింది. దిల్లీ బౌలర్లలో జెస్ జోనాస్సెన్ మూడు వికెట్లు పడగొట్టగా, మారిజానే కాప్, అరుంధతి రెడ్డి తలో రెండు వికెట్లు తీసి బెంగళూరు పతనాన్ని శాసించారు. ఆర్సీబీ జట్టు 15 ఓవర్లలో రెండు వికెట్లు నష్టానికి 138 పరుగులతో విజయం దిశగా వెళుతున్న తరుణంలో.. దిల్లీ బౌలర్లు అనూహ్యంగా చెలరేగారు. దీంతో ఆ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. చివరి 5 ఓవర్లలో బెంగళూరు 7 వికెట్లు కోల్పోయింది.
అంతకు ముందు బ్యాటింగ్ చేసిన దిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. షఫాలీ వర్మ (50) అర్ధశతకంతో అదరగొట్టింది. ఓపెనర్ మెగ్ లానింగ్ (11) విఫలమైనా అలిస్ కాప్సే (46)తో కలిసి దూకుడుగా ఆడింది. మారిజానే కాప్ (32), జెస్ జోనాస్సెన్ (36*) రాణించారు. బెంగళూరు బౌలర్లలో సోఫీ డివైన్ 2, నాడిన్ డి క్లర్క్ 2, శ్రేయాంకా పాటిల్ ఒక వికెట్ పడగొట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి