IPL 2024: దూకుడైన బ్యాటింగ్తోనే కప్ కొట్టగలం..: రికీ పాంటింగ్
ఒకప్పుడు నాణ్యమైన బౌలింగ్ వనరులు ఉంటే జట్టు గెలవడం సులువని భావించేవారు. కానీ, ఇప్పుడు బౌలింగ్ కాస్త ఫర్వాలేదనిపించినా.. లోతైన బ్యాటింగ్ ఉండాలని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా రికీ పాంటింగ్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్లో జట్టు గెలవాలంటే దూకుడైన బ్యాటింగ్ అవసరమని ఆసీస్ మాజీ కెప్టెన్, దిల్లీ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ (Ricky Ponting) వ్యాఖ్యానించాడు. ఇవాళ గుజరాత్తో దిల్లీ తలపడనున్న నేపథ్యంలో రికీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. స్కోరు బోర్డుపై భారీగా పరుగులు ఉంచితేనే బౌలర్లపై ఒత్తిడి తగ్గుతుందని వ్యాఖ్యానించాడు.
‘‘హైదరాబాద్ వరుసగా భారీ స్కోర్లు చేసింది. కోల్కతా కూడా 270+ పరుగులు రాబట్టింది. బ్యాటింగ్పై ఇంపాక్ట్ ప్లేయర్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ట్రావిస్ హెడ్ అలా వచ్చి వేగవంతమైన శతకం సాధించాడు. బ్యాటర్లలో ఆత్మవిశ్వాసం నింపకపోతే వారినుంచి ఇలాంటి ఇన్నింగ్స్ను రాబట్టలేం. గతంలో ఐపీఎల్ లేదా బిగ్బాష్ వంటి మెగా టోర్నీలు బౌలింగ్ వనరులు బాగా ఉన్న జట్టే విజేతగా నిలిచిన సందర్భాలను చూశాం. కానీ, ఈసారి మాత్రం ఐపీఎల్లో విజేతగా నిలవాలంటే మాత్రం బ్యాటింగ్ లోతుగా ఉంటేనే సాధ్యమవుతుంది. కొత్త నిబంధనలు కూడా అందుకు అనుకూలంగా ఉన్నాయనిపిస్తోంది. బౌలర్లపై ఎదురుదాడి చేసి భారీ స్కోరు చేస్తే విజయం సాధించడం తేలికవుతుంది’’ అని పాంటింగ్ తెలిపాడు. ప్రస్తుత ఎడిషన్లో తొమ్మిది మ్యాచుల్లో 200+ స్కోర్లను లక్ష్యంగా నిర్దేశించాయి. హైదరాబాద్ జట్టు రెండుసార్లు 275+ స్కోర్లు చేసిన జట్టుగా అవతరించింది. అత్యధిక పరుగులు చేసిన జట్టుగా హైదరాబాద్ (287/3) కొనసాగుతోంది.
బట్లర్.. అద్భుతమైన అథ్లెట్: టామ్ మూడీ
కోల్కతాపై అద్భుత శతకంతో రాజస్థాన్ను గెలిపించిన జోస్ బట్లర్పై సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. తాజాగా ఆసీస్ మాజీ కెప్టెన్, మాజీ కోచ్ టామ్ మూడీ స్పందిస్తూ.. ‘‘జోస్ బట్లర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అతడు మంచి అథ్లెట్. తన ఆటలో ఇది ప్రస్ఫుటంగా కనిపించింది. టీ20 క్రికెట్ సహా ఇతర ఫార్మాట్లోనైనా ఫిట్నెస్ చాలా కీలకం. నైపుణ్యం ఉన్నంత మాత్రాన సరిపోదు. టైమింగ్తోపాటు వికెట్ల మధ్య పరిగెత్తడం కూడా చేయాలి. అంతకుముందు అనారోగ్యం కారణంగా పంజాబ్తో మ్యాచ్కు దూరమైన అతడు.. త్వరగానే కోలుకొని ఈ మ్యాచ్లో ఆడాడు. దానికి కారణం అతడి ఫిట్నెస్. మైదానంలో మానసికంగానూ బలంగా ఉండటం చాలా అవసరం. అప్పుడే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ జట్టును గెలిపించే ఇన్నింగ్స్ ఆడేందుకు సాధ్యమవుతుంది’’ అని టామ్ మూడీ వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.