Delhi Vs Kolkata: వైజాగ్లో చివరి మ్యాచ్.. ఈసారి విజయం ఎవరిదో?
విశాఖపట్నం క్రికెట్ అభిమానులను అలరించేందుకు మరో మ్యాచ్ సిద్ధమైంది. కోల్కతాతో దిల్లీ తలపడనుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్లో వైజాగ్ అభిమానులను అలరించేందుకు మరో మ్యాచ్ సిద్ధమైంది. దిల్లీ - కోల్కతా జట్లు తలపడనున్నాయి. ఇదే మైదానంలో చెన్నైను ఓడించిన ఉత్సాహంతో దిల్లీ బరిలోకి దిగుతోంది. మరోవైపు వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచిన కోల్కతా హ్యాట్రిక్పై కన్నేసింది. విశాఖ వేదికగా ఈ ఎడిషన్లో ఇదే చివరి మ్యాచ్ కావడంతో ఎవరు విజేతగా నిలుస్తారనేది ఆసక్తిగా మారింది.
దాదాపు ఐదేళ్ల తర్వాత విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియం వేదికగా ఐపీఎల్ను చూసే అవకాశం అభిమానులకు దక్కింది. దిల్లీ తన రెండో సొంత మైదానంగా దీనిని ఎంపిక చేసుకుంది. చెన్నైతో జరిగిన తొలి మ్యాచ్లో విజయం సాధించింది. రిషభ్ పంత్ నాయకత్వంలోని ఆ జట్టు గెలిచినా.. అభిమానుల మద్దతు మాత్రం చెన్నైకు ఉండటం విశేషం. దానికి కారణం ఎంఎస్ ధోనీ. దాదాపు సంవత్సరం తర్వాత బ్యాటింగ్ చేసిన అతడు ఈ మ్యాచ్లో విజృంభించాడు. తమ అభిమాన జట్టు ఓడిపోయినా.. ధోనీ ఇన్నింగ్స్తో అభిమానులు సంతోషంగా ఇంటికెళ్లారు. ఇప్పుడు కోల్కతాతో దిల్లీ తలపడనున్న నేపథ్యంలో అందరి దృష్టి రిషభ్ పంత్పైనే ఉంది. చెన్నైపై హాఫ్ సెంచరీ సాధించిన అతడి నుంచి మరోసారి అలాంటి ప్రదర్శననే కోరుకోవడం సహజమే. డేవిడ్ వార్నర్ ఎలానూ మంచి ఫామ్లోనే ఉన్నాడు. ఈ సీజన్లో తొలిసారి బరిలోకి దిగిన పృథ్వీ షా ఆకట్టుకున్నాడు. దూకుడుగా ఆడి పరుగులు రాబట్టాడు. తనపై ఉన్న అంచనాలను అందుకున్నాడు. అయితే, ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ మాత్రం తన స్థాయికి తగ్గట్లు రాణించలేదు. బౌలింగ్లో ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ, కుల్దీప్, ముకేశ్ ఉత్తమ ప్రదర్శన చేశారు. దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ ఆన్రిచ్ నోకియా మాత్రం ధారాళంగా పరుగులు ఇచ్చేస్తున్నాడు.
మిచెల్ ఏం చేస్తాడో?
కోల్కతా తాను ఆడిన రెండు మ్యాచుల్లోనూ గెలిచి ఊపు మీదుంది. కానీ, ఒకే ఒక్క ఆటగాడు మాత్రం ఘోరంగా విఫలమై నిరాశపరుస్తున్నాడు. మినీ వేలంలో దాదాపు పాతిక కోట్లు పెట్టి దక్కించుకున్న మిచెల్ స్టార్క్ మాత్రం రెండు మ్యాచుల్లోనూ ప్రభావం చూపించలేదు. వంద పరుగులు ఇచ్చి ఒక్క వికెట్టూ తీయలేదు. ఈసారి మ్యాచ్లోనైనా వికెట్ల ఖాతా తెరుస్తాడని కోల్కతా అభిమాననులు ఎదురుచూస్తున్నారు. యువ బౌలర్ హర్షిత్ రాణా పేస్ భారాన్ని మోస్తున్నాడు. ఇక బ్యాటింగ్లో కోల్కతాకు పెద్దగా ఇబ్బందులేమీ లేవు. ఫిల్ సాల్ట్, నరైన్, వెంకటేశ్ అయ్యర్, ఆండ్రి రస్సెల్, రింకు సింగ్ మంచి ఫామ్లో ఉన్నారు. హైదరాబాద్పై రస్సెల్ భీకర ఇన్నింగ్స్తో హడలెత్తించిన సంగతి తెలిసిందే. అయితే, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, నితీశ్ రాణా నుంచి భారీ ఇన్నింగ్స్లు బాకీ ఉన్నాయి.
పిచ్ పరిస్థితేంటి?
వైజాగ్ పిచ్ బౌలర్లకే కాస్త అనుకూలంగా ఉంటుందని క్రికెట్ విశ్లేషకుల అంచనా. ఫ్లడ్లైట్ల వెలుతురు స్వింగ్ బౌలర్లు మంచి ప్రదర్శన చేసే అవకాశం లేకపోలేదు. అలాగని బ్యాటర్లకు సహకరించదని కాదు. క్రీజ్లో కాసేపు కుదురుకుంటే పరుగులు రాబట్టవచ్చని రిషభ్ పంత్ నిరూపించాడు. విశాఖపట్నంలోని తేమ, వేడి వాతావరణంతో పిచ్ ఎలా టర్న్ అవుతుందనేది కూడా కచ్చితంగా చెప్పడమూ కష్టమే.
తుది జట్లు (అంచనా)
దిల్లీ: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషభ్ పంత్ (కెప్టెన్/వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్, అన్రిచ్ నోకియా, ముకేశ్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్
కోల్కతా: ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), రమణ్దీప్ సింగ్, రింకు సింగ్, ఆండ్రి రస్సెల్, సునీల్ నరైన్, మిచెల్ స్టార్క్, అనుకుల్ రాయ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘హార్దిక్ను ఎంచుకోవడం తప్పిదమా?’.. విమర్శలకు గావస్కర్ స్ట్రాంగ్ ఆన్సర్!
టీ20 ప్రపంచ కప్ బరిలోకి దిగే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. పెద్దగా ఫామ్లో లేనివారికి అవకాశం ఇచ్చారనే విమర్శలూ వస్తున్నాయి. -
ప్రపంచకప్కి రింకూని విస్మరించడమా? ఇదో చెత్త సెలక్షన్!
రింకూ సింగ్ను టీ20 ప్రపంచకప్ జట్టుకు ఎంపిక చేయకపోవడంపై సీనియర్లు మండిపడుతున్నారు. 176 స్ట్రైక్రేట్ 86 సగటు ఉన్న ఆటగాడిని ఎలా విస్మరిస్తారని ప్రశ్నిస్తున్నారు. -
వరల్డ్ కప్ జట్టులోకి ఎంట్రీ.. సంజూ శాంసన్ ‘మలయాళం’ ట్వీట్ వైరల్
భారత జట్టు తరఫున వరల్డ్ కప్ ఆడే అవకాశం సంజూ శాంసన్కు దక్కింది. పొట్టి కప్ కోసం ప్రకటించిన 15 మంది సభ్యుల జాబితాలో అతడి పేరుంది. -
బరిలో వాళ్లు.. బయట వీళ్లు... ఐపీఎల్లో ఈ కోచ్లు కి‘రాక్’
మైదానంలో దిగి ఆడే ప్లేయర్లే కాదు... డగౌట్లో కూర్చుని జట్టు వ్యూహాలను రచించే కోచ్లూ ముఖ్యమే. ఐపీఎల్లో అలా కీలకంగా నిలుస్తూ.. ఇంపాక్ట్ చూపిస్తున్న కోచ్లు వీరే. -
పంత్ 4 నెలల్లో 16 కేజీలు తగ్గాడు.. కేవలం 5ml ఆలివ్ ఆయిల్ వాడేవాడు!
ఘోర రోడ్డు ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత రిషభ్ పంత్ కోలుకొనేందుకు చాలా కష్టపడ్డాడు. మ్యాచ్ ఆడే ఫిట్నెస్ను సాధించి బరిలోకి దిగాడు. -
కెప్టెన్గా మార్ష్.. యంగ్ సెన్సేషన్కు నో ఛాన్స్.. ఆసీస్ జట్టు ఇదే!
టీ20 ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ను సారథిగా నియమించింది. -
చెన్నై ‘విన్నింగ్’ ట్రెండ్ను కొనసాగిస్తుందా.. ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకుంటుందా?
ఐపీఎల్లో ఇవాళ పంజాబ్తో సొంతమైదానం చెపాక్ వేదికగా చెన్నై తలపడనుంది. ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకోవాలంటే ఇక నుంచి ప్రతి మ్యాచ్ విజయమూ కీలకమే. -
ఆర్సీబీకి ఇదేం శాపమో..? ఆ జట్టులోకొస్తే వైఫల్యం.. వేరే జట్లలో అదరహో!
పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న నిలిచిన బెంగళూరు జట్టుకు ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు లేనట్లే. స్టార్లు ఉన్నా జట్టుగా ఆడి విజయం సాధించడంలో విఫలం కావడం అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. -
అతడికి పెద్దగా అవకాశాలు ఇవ్వలేకపోయాం..: హార్దిక్ పాండ్య
తమ ఓటమికి ప్రధాన కారణం టాప్ ఆర్డర్లో త్వరగా వికెట్లను కోల్పోవడమేనని ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య వ్యాఖ్యానించాడు. -
పంత్కు ఓటు.. సంజుకు చోటు
రిషబ్ పంత్ పోరాటం ఫలించింది.. శాంసన్ నిరీక్షణకు తెరపడింది.. యువకెరటం యశస్వి జైస్వాల్ కోరిక తీరనుంది..! వెస్టిండీస్-అమెరికా ఆతిథ్యమిచ్చే టీ20 ప్రపంచకప్ కోసం వీరంతా విమానమెక్కనున్నారు. -
కప్పు కొట్టే జట్టేనా..?
టీ20 ఫార్మాట్ అంటే కుర్రాళ్లదే.. చాలామంది సిద్ధాంతం ఇదే. రెండేళ్ల కిందట బీసీసీఐ ప్రణాళిక ఇలానే సాగింది. 2022 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో టీమ్ఇండియా ఘోర పరాజయం చవిచూడటంతో... స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్లో భారమే అనుకున్న జట్టు మేనేజ్మెంట్ వారిద్దరిని పక్కనబెట్టింది. -
లఖ్నవూ సిక్సర్
ముంబయి ప్లేఆఫ్స్ ఆశలు ఇక కనుమరుగైనట్లే! స్లో పిచ్పై ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేయడం.. ఆపై కుదురుగా ఆడి లక్ష్యాన్ని ఛేదించడం అలవాటుగా మార్చుకున్న లఖ్నవూ సూపర్ జెయింట్స్.. ఈసారి ముంబయిని దెబ్బతీసింది. -
భారత అమ్మాయిలదే రెండో టీ20
బంగ్లాదేశ్లో భారత అమ్మాయిల జోరు కొనసాగుతోంది. అయిదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. -
చైనా చేతిలో భారత్ ఓటమి
ఉబెర్కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఇప్పటికే క్వార్టర్ఫైనల్స్ చేరిన భారత అమ్మాయిల జట్టు.. చివరి గ్రూప్ మ్యాచ్లో చిత్తుగా ఓడింది. -
బట్లర్ సారథ్యంలో ఇంగ్లాండ్..
లండన్: 2022 టీ20 ప్రపంచకప్ను దేశానికి అందించిన జోస్ బట్లర్ సారథ్యంలో మరోసారి ఇంగ్లాండ్ అదృష్టం పరీక్షించుకోనుంది. -
పృథ్వీషాకి సమన్లు
యువ బ్యాటర్ పృథ్వీషాకి ముంబయి సెషన్స్ కోర్టు సమన్లు జారీ చేసింది. సామాజిక మాధ్యమ ప్రభావశీలి స్వప్న గిల్ దాఖలు చేసిన రివ్యూ పిటీషన్ను విచారించిన న్యాయస్థానం ఈ ఉత్తర్వులు వెలువరించింది.
తాజా వార్తలు (Latest News)
-
తాళాల నుంచి అంతరిక్షం వరకు.. భారతీయుల జీవితాల్లో గోద్రెజ్ ఎలా ‘కీ’లకమైంది?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘హార్దిక్ను ఎంచుకోవడం తప్పిదమా?’.. విమర్శలకు గావస్కర్ స్ట్రాంగ్ ఆన్సర్!
-
ఎఫ్డీ కంటే మెరుగైన రిటర్నులు.. స్టాక్స్ కంటే తక్కువ రిస్క్
-
పోలీస్ స్టేషన్లో రూ.5.6లక్షలు కాజేసిన హోంగార్డు
-
దిశా నిందితుల ఎన్కౌంటర్ కేసులో పోలీసులకు ఊరట